Pages

Sunday, December 8, 2013

సత్యమేవ జయతే

ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండ, యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది.
ఒక రోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూచి దానిపై దూకడానికి సిద్దమైనది. అది గమనించిన ఆవు భయపడక “పులిరాజా! కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేతదూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపునిండ పాలు ఇచ్చి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు” అన్నది దీనంగా ఆవు.
ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి “ఆహా! ఏమి మాయమాటలు ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను” కోపంగా అన్నది పులి. “నీవు అలా అనుకోవడం సరి కాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏమి? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే గదా! ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి, ఆకలి తీర్చి రావాలని నా ఆశ” అన్నది ఆవు.
ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకుందామని “సరే” అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపునిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ “నాయనా! బుద్దిమంతురాలుగా మంచితనంతో జీవించు. తోటివారితో స్నేహంగా ఉండి, ఎట్టి పరిస్థితులలోను అబద్ధాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో” అని బిడ్డకు మంచి బుద్దులు చెప్పి ఆవు అడవికి చేరుకొన్నది. ఆవుని చూచిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాలకంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంతో గొప్పది! దీనిని చంపితే తనకే పాపం అనుకొని ఆవుని వదిలివేసింది పులి.

ఈ కథలోని నీతి : ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.

మితిమీరిన ఆశ

ఒక అడవిలొ ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలని పేరాశ. కాని అది చిన్న జంతువు కదా! అందువల్ల దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో, పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవనం చేస్తుండేది.
ఇలా ఉండగా ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక అడవిపంది కనిపించింది. వెంటనే గురిచూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలటం వల్ల పందికి గాయం అయింది తప్ప వేంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిమీదికి దూకి అతడిని చంపి మరికొంత సేపటికి పంది కూడా చచ్చిపోయింది.
ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాము, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో అసలే దురశ కదా! వేటగాడి పక్కనే పంది ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ” ఈ నాల్గింటి మాంసం తరువాత తాపీగా తినవచ్చు. ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపేట్టుకుందాం ” అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగతంతో వంగి ఉన్న బానంబద్ద ఊపుగా నిటారుగా సాగి, నక్క గుండెకు గట్టిగా గుద్దుకున్నది. నక్క అక్కడికక్కడే మరణించినది.

ఈ కథలోని నీతి దురాశ దుఃఖం చేటు

చెడు అలోచనల ప్రభావం

ఒక మంత్రిగారు పనిమీద ఒక గ్రామం మీదుగా వెళుతున్నాడు. అతనికి దాహంగా ఉండి దగ్గర్లోనే ఉన్న పొలంలోకి వేళ్ళాడు. మంత్రిగారికి రైతు తన చెరకు తోట నుండీ తాజా చెరకురసాన్ని తీసి ఇచ్చాడు. తీయని చెరుకు రసం తాగిన తరువాత మంత్రిగారి కళ్ళు చెరకు తోటపై పడ్డాయి. ఏపుగా పేరిగిన ఈ పంట నుంచి అదనంగా ఎంత పన్ను వసూలు చేయవచ్చునో మనసులోనే లెక్కలు వేసుకున్నాడు. మంత్రి ఇంకోంచెం చెరుకు రసం తీసుకురమ్మన్నాడు. ఈసారి తెచ్చి ఇచ్చిన చెరుకు రసం అంత తియ్యగా లేదు. మంత్రి ఆశ్చర్యంతో తన సందేహాన్ని వేలిబుచ్చాడు. ” మీ మనసులో అసూయ ప్రవేశించిన వెంటనే చెరకు రసం తన తియ్యదనాన్ని కోల్పోయింది” అని రైతు సమధనం ఇచ్చాడు. తన తప్పు తెలుసుకున్నడు మంత్రి.
ఈ కథలోని నీతి “చెదు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయి”

గర్వం పనికిరాదు

ధనం ఉందని ఎదుటివాడిని కించపరచగూడదు. తనకైతాను గర్వపడకూడదు. నేనే ధనవంతుడినినని మీరనుకుంటే మీకంటే ఎక్కువ ధనవంతులయిన వారు, గొప్పవారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నరు. సాయంకాలం వేళ మిణుగురు పురుగులు బయటికొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతూన్నానని భావిస్తుంది. కాని నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మిణుగురు పురుగు గర్వం పటాపంచలవుతుంది. మెరిసే తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అనుకుంటాయి. కాని చంద్రోదయం తరువాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తనవల్లే ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాననుకుంటాడు. ఆ తరువాత తూర్పున, సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయ వెలుగులో చంద్రుడు ఉన్నచోటు తెలియకుండా పొతుంది. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడు చెప్పుకోకూడదు.
ఈ కథలోని నీతి “తనే గొప్ప అని ఎన్నడూ విర్రవీగకూడదు”.

అద్దం లో మనిషి

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను చాలా తెల్లగా, పొడుగ్గా, అందంగా ఉండేవాడు. ఊళ్ళో అందరు అతని అందాన్ని మెచ్చుకునే వారు. అందరి పొగడ్తలు విని ఆ వ్యాపారస్తుడు బాగా గర్వం పెంచుకున్నాడు.
వయసుతో పాటు కొంచం కొంచం అందం తగ్గడం మొదలైంది. మనుషులు పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది కొంచం మొహం మీద ముడతలు అవి వస్తాయి కదా! అతనికి కూడా కొంచం కొంచం మొహం మారటం మొదలైంది.





ఒక రోజు అద్దంలో చూసుకుంటే, కళ్ళ కింద నలుపులు, ముడతలు చూసి చాలా విచారించాడు. అతని అందమే అతని అహంకారం. ఆ అందం తగ్గడం అతనికి అస్సలు ఇష్టం లేదు. అందంగా, ఎప్పుడు యౌవనంలో ఉండడానికి ఏమైనా చేయడానికి ఆటను సిద్ధ పడ్డాడు.

ఊరి చివరన ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతని దగ్గరకు వెళ్లి ఉపాయమడిగాడు. ఆ తాంత్రికుడు వ్యాపారస్తుడకు ఒక అద్దం ఇచ్చాడు. “రోజు ఈ అద్దం చూసుకో. నీకు వయసుతో రావాల్సిన మార్పులన్నీ ఈ అద్దంలో నీ ప్రతిబింబములో కనిపిస్తాయి. నువ్వు మట్టుకు యెప్పుడు ఇలాగే ఉండిపోతావు” అన్నాడు. “కాని ఒక్క విషయం. నువ్వు ఎంత మంచి మనిషిలా వుంటే నీ ప్రతిబింబం అంత బాగా వుంటుంది. నీవు చేసే ప్రతి చెడు పని నీ ప్రతిబింబం మీద కనిపిస్తుంది.” అని హెచ్చరించాడు.

అద్దం తీసుకుని వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.

ఆ రోజునుంచి నిర్భయంగా తనకు నచ్చినట్టు పాపాలు చేసుకుంటూ, తప్పులు చేస్తూ, ఆహాంకారిగా జీవితం కొనసాగాడు. రోజు అద్దంలో వచ్చే మార్పులు చూసి ఐదు నిమిషాలు బాధ పడ్డా, అతను చేసే పనులు, నడవడిక మార్చుకోలేదు.

కొంత కాలానికి అద్దంలో మొహం చాలా కురుపిగా మారిపోయింది. చూస్తె భరించలేనంత అసహ్యంగా తయ్యరాయ్యింది. కాని ఆ అద్దానికి ఒక రకమైన కట్టు వుంది. అతని ప్రతిబింబము చూడకుండా వుందామన్న ఉండలేక పోయేవాడు.

ఒక రోజు రాత్రి భరించలేక ఆ అద్దం గోడ మీంచి తీసి కిందికి విసిరేశాడు. అద్దం ముక్కలు ముక్కలుగా విరిగి పోయింది.

తెల్లారేసరికి అతని గదిలోకి ప్రవేశించిన సేవకుడికి మంచంపైన ఒక అసహ్యమైన, కురూపిగా ఉన్న ఒక వయసు మళ్ళిన వృద్దుడి శవం దొరికింది. ఎవరికి ఆ శవం ఎవరిదో, వాళ్ళ ఎజమాని, ఆ వ్యాపారస్తుడు ఎక్కడున్నాడు ఇప్పటికి తెలియదు.

ఊరవతల ఉన్న తంత్రికుడికి తప్ప.

ఒక రాజు, యేడుగురు కొడుకులు

అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు ఆ యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలిని యెండబెట్టారు.
సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని “చేప చేప ఎందుకు యెండలెదు” అని అడిగాడు. ఆ చేప “గడ్డిమెటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు. గడ్డిమెటు అందీ “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని.
రాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు?” అని అడిగాడు. “నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.
రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “యెందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు” అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని.
అమ్మ ని అడిగితే అమ్మ అందీ “ఆక్కడ పాప యెడుస్తొంది”
రాజకుమారుడు పాపని “పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.
రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు లాగ చీమ ని కూడ అడిగాడు “చీమ చీమ పాపని యెందుకు కుట్టావూ”
ఆప్పుదు చీమ అంది “నా పుట్టలో వేలు పెడితె నేను కుట్టనా” అని…
చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఈ కథ చెప్పేది. చాల కాలం ఇదొక మాములు కథ అనుకున్నను. పెద్దయ్యక మా పిల్లలకు ఈ కథ చెపుతున్నప్పుడు అర్ధం అయ్యంది. ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయని. చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో యెండు చాప లేదు.

వేరుశనగ దొంగ

కొన్ని సంవత్సరాల క్రితం ఒక వూరిలో లక్ష్మి పేరుగల ఒకావిడ వుండేది. ఆఅవిడకు రోజు సాయంత్రం ఇంటి దెగ్గిర వున్న పార్కులో ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజు అదే బెంచి మీద కూర్చునే అలవాటు పడిన లక్ష్మిగారికి కొద్దిరోజలకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది.

అలాగే ఒక రోజు పర్కులోకి వెళ్తుంటే అక్కడ వేడి వేడి గా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పధ్ధతి లో తన బెంచి కి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచి మీద అప్పటికే ఒక పెద్దాయిన కూర్చుని వున్నరు.

రుసరుసలాడుతూ తన షాల్వా, పర్సు, కూడా తెచుకున్న ఇతర సామాన్లు, చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది.

చదువుతూ పక్కనవున్న వేరుశనగల అందుకుని వల్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. “యెంత పొగరు, అడగకుండానే నా వేరుశెనగలు తినేస్తునాడు, ఇలాంటి వాళ్ళు వుండ బట్టే మన దేశం ఇలా వుంది” అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమి అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్ది సేపటి తరువాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్ని తినేస్తారో అని లక్ష్మిగారు కూడ పోటి పడి గబ గబా మిగిలిన వేరుశెనగలు వల్చుకుని తినేసింది. అన్ని అయిపోయి చివరికి ఒక్క వేరుశనగ మిగిలింది. ఫెద్దాయన చిరునవ్వుతొ “ఇది మీరు తీసుకోండి” అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయరు.

ళక్ష్మిగరు “వేరుశనగ దొంగ!” అని చికకుగా అనుకుంది.

లేచి తన సామను బెంచి మీద నుంచి తీసుకుంటు చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దెగ్గిరే కనిపించింది.

“అయ్యో! ఐతే నేనే వేరుశనగ దొంగనా! పాపం అయ్యిన్ని ఎన్ని మాటలనుకున్ననో!’ అని చాలా బాధ పడింది.

స్నేహబలం

హిరణ్యకుడు అను ఎలుక, చిత్రాంగుడు అనే జింక, మంథరుడు అనే తాబేలు, లఘుపతకము అనే కాకి వీళ్ళు నలుగురు మిత్రులు. కర్పూర గౌరవము అనే చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువులో ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేది. ఆ ప్రక్కనే ఉన్న పొదలో జింక ఉండేది.

సాయంత్రపు పూట ఈ నలుగురు మిత్రులు ఒకేచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒక రోజు మథ్యాహ్నమనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోవటంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలా సేపు ఎదురుచూసినా జింక వస్తున్న జాడ కనిపించలేదు.





‘స్నేహితులారా! చిత్రాంగుడు ఇంతసేపయినా ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకొని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. ‘అవును నిజమే!’ అన్నాయి ఎలుక, కాకి. ‘ఇప్పుడు ఏం చేద్దాం!’ అనుకున్నాయి ఆ మూడు. స్నేహితులారా! నేను ఎగిరివెళ్ళి అడవంతా చూసివస్తాను’ అంటూ కాకి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరింది.
తాబేలు, ఎలుక చిత్రాంగుడు వస్తాడేమోనని నాలుగు దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకికి ఒకచోట జింక కనిపించిది. కాని అది వేటగాడు పన్నిన వలలో చిక్కికుపొయి బాధతో గింజుకుంటోంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో ‘వచ్చావా! లఘుపతనకము ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను నన్ను రక్షించవా’ అంది. ‘భయపడకు చిత్రాంగా! నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుడిని తీసుకువస్తాను అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు!’ అని కాకి జింకకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోకి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది.

ఎలుక తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ ముగ్గురు ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ తమ ఇళ్ళ వైపు నడిచారు. దారిలో వాళ్ళకి తాబేలు ఎదురుపడింది. అయ్యో! మంధరా నువ్వెందుకు వచ్చావు అనడిగాడు హిరణ్యకుడు. ‘చిత్రాంగుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాతంగా కూర్చోలేకపోయాను.

మీరిద్దరూ చిత్రాంగుడిని రక్షిస్తారని నాకు తెలుసు. అయినా మనసు ఊరుకోలేదు. అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మంథరుడు. ‘నువ్వు నిజమైన స్నేహితుడివీ అంటూ చిత్రాంగుడు ఆనందంగా మంథరుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ నలుగురూ అనందంగా కబుర్లు చెప్పుకొంటూ ఇంటి దారి పట్టారు. కొంతదూరం ఆ నలుగురు నడిచే సరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే జింక పొదలోకి దూరిపోయింది. కాకి ప్రక్కనే ఉన్న చెట్టు మీదకి ఎగిరిపోయింది, ఎలుక ప్రక్కనే ఉన్నకలుగులోకి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటూ పారిపోలేక వేటగాడి చేతికి దొరికిపోయింది.

జింక తప్పించుకున్నా తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసకి తాడుతో కట్టి భుజం మీద వేసుకొని ఇంటి దారిపట్టాడు. వేటగాడు కొంతదూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక్కచోట చేరి ‘అయ్యో! చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మంథరుడు వీడి చేతికి దొరికాడే’ అనుకుని బాధపడ్డాయి.

అప్పుడు హిరణ్యకుడు ‘స్నేహితులారా! మన మంథరుడిని రక్షించుకుంటానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అంది. ‘హిరణ్యకా! తొందరగా ఆ ఉపాయం చెప్పు అంది కాకి. ‘వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు పట్టుకుంటానికి మంథరుడిని కట్టిన బాణం క్రింద పెట్టి వెళతాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మంథరుడిని తప్పిస్తాను’ అని చెప్పింది.

ఆ ఉపాయం ఎలుకకి, కాకికి నచ్చింది. ఆ మూడు అడ్డదారిలో వేటగాడి కంటే ముందుకి పోయి ఒక చోట జింక దారికి అడ్డంగా పడుకొంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూసాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పొడవటం వల్ల అది చచ్చిపోయిందనుకొని ‘ఆహా! ఏమి నా భాగ్యం. ఈ రోజు అదృష్టం నా పక్షాన ఉంది అందుకే వలలో జింక తప్పించుకున్నా ఇక్కడ మరొక జింక దిరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు.
వెంటనే ఎలుక వచ్చి తాబేలుకి కట్టిన తాడును కొరికేసింది. కాకి ‘కావ్! కావ్’మని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు కొయ్యబారి పోయి అంతలోనే తేరుకుని తాబేలు కోసం చూసాడు. అప్పటికే తాబేలు ప్రక్కనే ఉన్న చెరువులోకి పారిపోయింది.

‘ఆహా! ఏమి నా దురదృష్టం చేతిలో వున్న దానిని వొదులుకున్నాను అనుకొంటూ ఆ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు.

ఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూసారా! స్నేహం అంటే ఈ నాలుగు ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటానికి అవసరమైతే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టగలగాలి. పనికిరాని స్నేహితులు పదిమంది ఉండే కంటే అవసరంలో ఆదుకొనే స్నేహితుడు ఒక్కడుంటే చాలు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం.

Tuesday, October 22, 2013

ఉపకారం

రాజయ్యకు ఒక గొర్రెల మంద ఉండేది. రోజూ అతను ఊరి దగ్గర ఉన్న కొండలపైకి గొర్ర్రెలను తీసుకెళ్ళి మేపేవాడు. ఓరోజు అతనికి వలలో చిక్కుకున్న ఒక గద్ద కనిపించింది. దాన్ని చూసి జాలిపడిన రాజయ్య దాన్ని వల నుండి విడిపించాడు.

కొన్ని రోజుల తరువాత, అతను ఒక రాతిగుండుపై కూర్చుని ఉండగా హఠాత్తుగా ఒక గద్ద వచ్చి, అతని టోపీని తీసుకుని ఎగిరిపోయింది. కోపంతో ఆ గద్ద వెంట పరుగెత్తసాగాడు. ఇంతలోనే అతనికి వెనుక నుండి ఒక పెద్ద శ బ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస,ి ఆశ్చర్యపోయాడు రాజయ్య. అతను పైకి లేవగానే, అప్పటిదాకా అతను కూర్చున్ను రాతి గుండు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. తన ప్రాణాలు దక్కినందుకు 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నాడు రాజయ్య. హఠాత్తుగా, అదే గద్ద తన ముందుకు వచ్చి, అతని టోపీని అతని మీద విడిచిపెట్టి, మళ్ళీ పైకి ఎగిరింది. ఈ గద్ద ఒకప్పుడు తన వల నుండి విడిపించిన గద్దనేనని గ్రహించిన అతడు జంతువులు కూడా తమకు చేసిన ఉపకారం మరిచిపోవు అని తెలుసుకున్నాడు.

చెడ్డ కాకి

ఒక ఊరు అవతల ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ దారినే వెళ్ళే బాటసారులు ఆ చెట్టు నీడలో కాసేపు విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించేవారు. అక్కడికి దగ్గరలోనే పూరిపాక వేసుకుని జీవించే ఒక రైతు భార్య ఎంతో దయగలది. ప్రయాణీకులకు చల్లటి నీళ్ళు ఇచ్చి, దాహం తీర్చేది.

ఆ చెట్టు మీద ఒక కాకి ఉండేది. అది దుష్టబుద్ధి కలది. ఆ చెట్టు కింద ఎవరైనా నిద్రిస్తుంటే, చూసి ఓర్వలేక కొమ్మల మీద గెంతుతూ, ఆకులు గలగల లాడిస్తూ, కావు కావుమని గట్టిగా అరుస్తూ ఉండేది. బాటసారులు చిరాకు పడుతూ నిద్రలేస్తే అది ఎంతో ఆనందించేది.

ఒక రోజు ఒక హంస ఆ చెట్టు మీద వాలింది. ఆ చెట్టు కింద ఒక బాటసారి నిద్రిస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం.. చెట్టు ఆకుల సందుల్లోంచి సూర్యకిరణాలు ఆ బాటసారిపై సూటిగా పడుతున్నాయి. అది చూసిన హంస తన రెక్కలను సాగదీసి, ఎండ అతనిపై పడకుండా చూడసాగింది.

దుష్టబుద్ధి కాకి ఇది సహించలేక పోయింది. బాటసారి సౌకర్యంగా నిద్రపోవడం దానికి కంటికింపుగా అనిపించింది.

వెంటనే అది ఆ బాటసారి ముఖంపై రెట్ట వేసి తుర్రుమంది. ఉలిక్కిపడి నిద్రలేచిన బాటసారి పైకి చూశాడు. రెక్కలు సాగదీసి కూర్చున్న హంస కనిపించింది. తన ముఖంపై రెట్ట వేసింది ఆ హంసేనని అనుకున్నాడు. కోపంతో ఒక రాయి తీసుకుని దానిపైకి విసిరాడు. ఆ రాయి హంసకు తగిలి, గాయమైంది.హంసకి ఆ గాయం మానడానికి చాలాకాలమే పట్టింది. ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడమంటే ఇదే

వేటగాడు - చిలుక

ఓ అడవిలో ఒక చిలుకల గుంపు నివసించేది. ఇది గమనించిన ఒక బోయవాడు, ఓ రోజు ఉదయాన్నే వచ్చి చాలా చిలుకల్ని పట్టుకున్నాడు. 'ఆహా! ఎంత అందంగా ఉన్నాయి ఈ చిలుకలు. వీటిని పట్టణంలో మంచి ధరకు అమ్మవచ్చు. వీటికి కొన్ని చిన్న చిన్న మాటలు నేర్పితే ఇంకా ఎక్కువ ధరకు అమ్మవచ్చు' అని అనుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. అతడు పట్టిన చిలుకలలో కుశలబుద్ధి అనే ఒక చిలుక ఉంది. అది చాలా తెలివైనది.

ఎలాగైనా ఆ బోయవాడి నుండి తప్పించుకోవాలనుకుంది. బోయవాడు చిలుకలను తన ఇంటికి తీసుకెళ్లి, ఒక్కో చిలుకను ఒక్కో పంజరంలో బంధించి, వాటికి ఆహారం, నీళ్ళు పెట్టాడు. తప్పించుకోవడానికి అప్పటికే ఒక ఉపాయం ఆలోచించిన కుశలబుద్ధి నీటిని కానీ, ఆహారాన్ని కానీ ముట్టుకోక, ఏదో రోగం వచ్చినట్టు, పంజరంలో పడి ఉంది.

'అయ్యో! దీనికి ఎదో జబ్బు చేసినట్టు ఉందే, ఇది కోలుకున్నాక అమ్ముదాం' అని మనసులో అనుకుంటూ, మిగతా చిలుకల్ని పట్టణానికి తీసుకెళ్ళి, అమ్మి బాగా డబ్బు సంపాదించాడు. అలా రోజులు గడుస్తున్నాయి గానీ చిలుక అసలు అహారం ముట్టుకోవడం లేదు. దీంతో అది బక్కచిక్కిపోయింది. ఆ బోయవాడు దానికి అసలు ఏమైందో చూద్దాం అనుకుంటూ ఆరుబయట కూర్చుని దాన్ని పంజరం నుండి బయటకి తీశాడు. ఆ అవకాశం కోసమే చూస్తున్న ఆ చిలుక తుర్రుమని ఎగిరిపోయింది

గాడిద ప్రేమ!

రంగన్న ఒక గాడిదను, కుక్కను పెంచేవాడు. గాడిద చెరువుకు మాసిన దుస్తుల మూటలు మోసుకుని వెళ్ళేది. ఆ దుస్తులు ఉతికాక రంగన్న వెంట ఇంటింటికి తిరిగి ఎవరివి వారికి చేరవేసేది. ఈ విధంగా ఆ గాడిద దినమంతా పనిచేస్తూ విశ్రాంతి లేకుండా ఉండేది.

ఇంటికి కాపలాకాసే కుక్క మాత్రం రోజంతా ఆడుతూ పాడుతూ గడిపేది. హాయిగా దినమంతా ఇంటి అరుగుమీద పడుకుని, నిద్రపోయేది. రంగన్న భార్య పెట్టే భోజనం శుష్టుగా ఆరగించేది. రంగన్న పండూ ఫలహారం ఏది తిన్నా కొంచెం కుక్కకు పెట్టేవాడు. సాయంత్రం రంగన్న ఇంటికి తిరిగి రాగానే వీధి మలుపు దగ్గరే ఆ సంగతి పసిగట్టి, కుక్క తోక ఊపుతూ ఎదురు పరుగెత్తుకు వచ్చేది. రంగన్న శరీరాన్ని నాకుతూ, రెండు కాళ్ళెత్తి అతని మీద ఎగబడేది. రంగన్న ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో ప్రేమగా దాని తల మీద నిమిరేవాడు.

ప్రతిరోజూ ఇదంతా చూసిన గాడిదకు ఒక ఆలోచన కలిగింది. యజమానితో కుక్క ఆ విధంగా మెలగడం వల్లే యజమాని దానిని అంత ప్రేమగా చూస్తున్నాడు. తను కూడా కుక్కలా యజమాని మీద ప్రేమ ఒలకబోయాలి అని అనుకుంది.

ఆ రాత్రి రంగన్న భోజనం ముగించుకుని అరుగు మీదకు వచ్చాడు. వెంటనే గాడిద సంతోషంగా అరుస్తూ కుక్కలా రెండుకాళ్లూ పైకెత్తి రంగన్న పైకి దూకింది. గాడిద బరువు భరించలేని రంగన్న వెల్లకిలా పడిపోయాడు. గాడిద అతని ముఖాన్ని నాకడానికి ప్రయత్నించడంతో భయపడి రంగన్న గట్టిగా కేకలు వేశాడు. అతని కేకలు విన్న ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకొచ్చి దుడ్డు కర్రలతో గాడిదను చావబాదారు. పారిపోతున్న గాడిదను వెంటబడి ఊరవతలకి గెంటేశారు. దానితో ఆ గాడిదకు తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది.

జాలరి - రెండుచేపలు

ఓ కొలనులో చాలా చేపలు ఉండేవి. వాటిలో రెండుచేపలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ రెండు చేపలు ఏ పని చేసినా కలిసే చేసేవి. ఓ రోజు ఒక చేపలు పట్టేవాడు చేపల కోసం వల విసిరాడు. ఒక చేప వలలో పడగా ఇంకొకటి తప్పించుకుంది.

''ఆహా! ఈ చేప ఎంత పెద్దగా ఉంది. దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది'' అని సంతోషపడ్డాడు చేపలవాడు. ఆ చేపను వల నుండి తీసి బుట్టలో వేస్తుండగా అది ఏడుస్తున్నట్టు గ్రహించాడు అతడు.

''ఎందుకు ఏడుస్తున్నావు? వలలో చిక్కుకుని నాకు దొరికావని బాధపడుతున్నావా?'' అని అడిగాడు చేపలవాడు ఆ చేపని.

''నేను నా గురించి ఏడవట్లేదు. నా స్నేహితుడు కోసం ఏడుస్తున్నాను. అతను కూడా వలలో చిక్కుకున్నాడని బాధగా ఉంది'' జవాబిచ్చింది ఆ చేప.

''బాధపడకు! నువ్వొక్కడివే వలలో చిక్కుకున్నావు. ఇంకో చేప తప్పించుకుంది'' అని అన్నాడు చేపలవాడు.
ఇది విని ఆ చేప చాలా సంతోషించింది.

''ఓ చేపలవాడా! నా మాట విను!'' అని నీటి నుంచి వినిపించింది. చేపలవాడు ఆశ్చర్యపోయాడు. ఎవరు మాట్లాడుతున్నారు అని నీళ్ళల్లోకి చూశాడు. రెండో చేప నీటిపై తేలుతూ కనిపించింది.

''నా స్నేహితుడు నీ వలలో చిక్కుకున్నాడా?'' అడిగింది రెండోచేప. ''అవును!'' బదులిచ్చాడు చేపలవాడు.

''నీకు చేపలన్నీ సమానమే కదా! దయచేసి నన్ను పట్టుకుని, నా స్నేహితుడిని విడిచిపెట్టు! లేకపోతే నన్ను కూడా పట్టుకెళ్ళు. నేను నా స్నేహితుడు లేకుండా జీవించలేను'' అని ప్రాధేయపడింది రెండోచేప.

చేపలవాడు ఆ చేపల స్నేహానికి ముగ్దుడయ్యాడు. ''మిమ్మల్ని విడదీస్తే ఈ లోకంలో ఎవరూ కూడా నన్ను క్షమించరు!'' అని అంటూ మొదటిచేపను నీటిలో వదిలేశాడు.

వంకర చెట్టు

ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. దాని మొదలు, కొమ్మలు వంకరగా ఉండి చూడ్డానికే ఆ చెట్టు వింతగా ఉండేది. దాని చుట్టుపక్కల ఉన్న చెట్లు పొడవుగా, మంచి ఆకారంతో ఉండేవి. వాటిని చూసి ఆ వంకర చెట్టు 'ఆహా! ఆ చెట్లన్నీ ఎంత బాగున్నాయో!' అని అనుకుంటూ 'నేను ఎంత దురదృష్ట వంతురాలిని. నేనొక్కదానినే ఇలా వంకర టింకరగా, వికారంగా ఉన్నాను' అని బాధపడేది.

ఓ రోజు అడవికి ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. ఆ వంకర చెట్టును చూసి 'ఈ చెట్టు కట్టెతో ఏ వస్తువు చేయడానికి వీలుకాదు. ఈ ఒక్క చెట్టును వదిలి, మిగిలిన ఆ పొడవైన, మంచి ఆకారంతో ఉన్న చెట్లని కొట్టేస్తాను' అని అనుకుంటూ ఆ వంకర చెట్టుని తప్ప మిగతా చెట్లను కొట్టేశాడు.అప్పుడా చెట్టు 'నేను నా ఆకారము చూసి బాధపడేదాన్ని. ఈ రోజు ఈ ఆకారమే నన్ను ఆ కట్టెలు కొట్టేవాడి నుండి కాపాడింది' అని అనుకుని, ఆ రోజు నుండి హయిగా జీవించసాగింది.

గాడిద కథ

ఒకరోజు ఒకతను తన కొడుకును, గాడిదను తీసుకుని బజారుకి వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఒక పెద్దమనిషి వీరిని చూసి, ''అదేంటయ్యా! అంత గాడిదను పెట్టుకుని నడుస్తూ పోతున్నారు?'' అని అడిగాడు.
నిజమే కదా అనుకుని ''బాబూ! నువ్వు ఎక్కు'' అని తండ్రి కొడుకుని గాడిదపై కూర్చోబెట్టి, తను నడుస్తూ వెళ్తున్నాడు.

ఇంకొంత దూరం పోయాక మరో పెద్ద మనిషి వీళ్లని ఆపి, ''ఏం కొడుకువయ్యా నువ్వు? పెద్దవాడైన తండ్రిని నడిపిస్తూ నువ్వు సుఖంగా గాడిదెక్కి పోతున్నావా?'' అన్నాడు.

దాంతో కొడుకు దిగిపోయి, తండ్రిని గాడిదపై కూర్చోబెట్టాడు. అలా ఇంకొంతదూరం పోయాక ఇంకో మనిషి వీళ్లని ఆపి, ''అసలేం తండ్రివి నువ్వు? చిన్న వాణ్ణి నడిపిస్తూ నువ్వు గాడిదెక్కి ఊరేగుతావా?'' అన్నాడు.
అది విని, కొడుకు కూడా గాడిదపైకి ఎక్కి కూర్చున్నాడు.

అలా కాస్త దూరం వెళ్లారో లేదో - ఇంకొక అతను వీళ్లని చూసి, ''ఛ! ఛ! మీకసలు దయ, జాలి ఉన్నాయా? మీరే గాడిదల్లా పెరిగి, పాపం నోరు లేని జీవంపై కూర్చుంటారా?'' అన్నాడు.

ఇదెక్కడి గొడవరా బాబూ అనుకుని, తండ్రీ కొడుకులిద్దరూ దిగి, గాడిదను భుజాల మీదకెత్తుకుని నడవసాగారు. అది చూసి దారిన పోయేవాళ్లందరూ గట్టిగా నవ్వడం మొదలెట్టారు. దాంతో గాడిద కంగారుపడి, పారిపోయింది.
చూశారా! ఏమైనా అందర్నీ మెప్పించడం ఎంత కష్టమైన పనో కదా!

నిజమైన స్నేహితుడు!

పరీక్షిత్‌, గోపీనాథ్‌ ఇద్దరు స్నేహితులు. ఒకరిని వదిలి ఒకరు ఒక్కక్షణం కూడా విడిచి ఉండేవాళ్ళు కాదు. స్నేహితులంటే వాళ్ళిద్దరిలా ఉండాలని ఆ ఊరి వాళ్ళంతా ఎంతో పొగిడేవారు.
 
ఒకరోజు పరీక్షిత్‌, గోపీనాథ్‌లు కలిసి మరో స్నేహితుడి పెళ్ళికి పొరుగూరుకి వెళుతున్నారు. ఆ ఊరికి చేరుకోవాలంటే అడవి దాటాలి. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ దట్టమైన అడవిమార్గంలో ప్రయాణిస్తు న్నారు. ఇంతలో ఒక ఎలుగుబంటి అరుపు వినిపిం చింది. అది ఆ దగ్గరలోనే ఉన్నట్టు ఆకుల గలగలలా డాయి. భయంగా స్నేహితులిద్దరు ముఖాలు చూసు కున్నారు. వాళ్ళు ఊహించినట్టుగానే పక్కనున్న పొదల్ని తప్పించుకుంటూ ఎలుగుబంటి రావడం కనిపించింది. గోపీనాథ్‌ గబుక్కున చెట్టెక్కి పోయాడు. చెట్టెక్కడం రాని పరీక్షిత్‌ భయంగా నిలబడిపోయాడు.

'ఎలుగుబంటి చాలా దగ్గరగా వచ్చేస్తోంది. పారిపోయే సమయం లేదు. ఎలా ఈ ఆపదలోంచి బయటపడటం?' ఒక పక్క భయపడుతూ, మరోపక్క ఆలోచించాడు. అడవి జంతువులకు సంబంధించి తను విన్న విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. 'క్రూర మృగాలు చనిపోయిన శరీరాలను గాయపర్చవు' తన తాతయ్య చెప్పిన సంగతి స్ఫురించింది. వెంటనే పరీక్షిత్‌ నేల మీద పడుకుండి పోయాడు.

ఎలుగుబంటి పరీక్షిత్‌కి దగ్గరగా వచ్చింది. అతని ముఖం దగ్గర ముఖం పెట్టి చూసింది. పరీక్షిత్‌ ఊపిరి బిగపట్టాడు. ఎలుగుబంటి అతన్ని నేలపైన అటు ఇటు దొర్లించింది. చూట్టూ తిరిగింది. మళ్లీ ఒకసారి అతని ముఖం దగ్గర వాసన చూసింది. అతను చనిపోయాడని నమ్మింది ఎలుగు బంటి.

కాస్సేపు అక్కడే తచ్చాడి ముందుకు వెళ్ళిపోయింది. పొదల చాటుకు కనుమరుగైంది ఎలుగుబంటి. ప్రమాదం లేదని నిశ్చయించుకున్నాక నెమ్మదిగా కిందకు దిగాడు గోపీనాథ్‌. పరీక్షిత్‌ని తట్టి లేపాడు.

'హమ్మయ్య! గండం గడిచింది' అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు పరీక్షిత్‌.

''నీ చెవిలో ఎలుగుబంటి ఏం చెప్పింది?'' ఆసక్తిగా అడిగాడు గోపీనాథ్‌.

అతని ప్రవర్తనవల్ల బాధపడుతున్న పరీక్షిత్‌ ''స్వార్థపరులైన వారితో స్నేహం చేయకూడదని ఎలుగుబంటి నాకు ఉపదేశం చేసింది'' అని చెప్పి ముందుకు కదిలాడు.

కష్టాలలో తోడు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు.

చెడ్డ బేరం

పూర్వకాలంలో గుర్రాలు అడవుల్లోనే మిగతా జంతువులతో పాటు కలిసి జీవించేవి. ఒకరోజు ఒక గుర్రం ఒక మనిషి దగ్గరకు వెళ్ళింది. ''దయచేసి నన్ను కాపాడండి! అడవిలోని ఒక సింహం నన్ను చంపాలనుకుంటోంది'' అంటూ ప్రాధేయపడింది.

''భయపడకు మిత్రమా! నేను నిన్ను రక్షిస్తాను. సింహం నిన్ను ఏమీ చేయలేదు'' అన్నాడు మానవుడు.

దానితో గుర్రం ఎంతో సంతోషించింది. కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. తిరిగి మానవుడు ఇలా చెప్పాడు ''మరి నువ్వు నేను ఏం చెప్పినా వినాలి!'' అని.

''నువ్వేం చెప్పినా చేస్తాను. నా ప్రాణాలు కాపాడగలిగితే చాలు'' అంది గుర్రం.

''సరే మరి నువ్వు నీ మీద నన్ను స్వారీ చేసుకోనివ్వాలి.'' అన్నాడు.

ప్రాణభయంతో ఉన్న ఆ గుర్రం మానవుడు చెప్పిన వాటికల్లా ఒప్పుకొంది. మానవుడు దాని మీద ఎక్కి కూర్చున్నాడు. గుర్రాన్ని తన ఇంటివైపు నడిపించాడు. అక్కడ పశువుల కొట్టంలో దాన్ని ఉంచి ''ఇక్కడ నువ్వు ఎంతో నిశ్చింతగా ఉండొచ్చు. నా ఇంట్లో నీకొచ్చే భయం ఏమీ ఉండదు. నేను నిన్ను బయటకు తీసుకెళ్ళినప్పు డల్లా నీ వీపు మీద స్వారీ చేస్తుంటాను. నేను నీతో ఉంటే ఆ సింహం నిన్ను ఏం చేయలేదు'' అని అన్నాడు. ఆ తర్వాత తలుపులు వేసి వెళ్ళిపోయాడు.

గుర్రం ఒంటరిగా మిగిలిపోయింది. ''నేనిక్కడ జాగ్రత్తగా ఉండగలను. కానీ నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు. నా రక్షణను కొనుక్కున్నాను కానీ స్వేచ్ఛను కోల్పోయాను. ఇది చాలా చెడ్డ బేరం'' అనుకుని చింతిస్తూ ఉండిపోయింది గుర్రం.
ఇక ఆ రోజు నుండి మానవుని అదుపాజ్ఞలో బతకసాగింది.

ముగ్గురు దొంగలు!

ఒకరోజు బ్రాహ్మ ణుడు మేకను తీసుకుని ఒంటరిగా అడవి మార్గంలో ప్రయాణించసాగాడు. అది చూసి ముగ్గురు దొంగలు ఆ బాటసారి దగ్గర నుండి మేకను దొంగలించాలనుకున్నారు.

''ఏరు చూడరా..! ఒంటరిగా ఉన్నాడు. ఈ అడవిలో అరిచినా కాపాడే దిక్కులేదు. అతని మేకను లాక్కుని పారిపోదామా?'' అన్నాడు ఒకడు.

''ఆ పని మనం చేయడం ఎందుకురా? నాలుగు తగిలిస్తే వాడే మేకను వదిలి పారిపోతాడు.'' అన్నాడు రెండోవాడు.
''బెదిరించో.... లేదా రహస్యంగానో దొంగతనాలు చేసి చేసి విసుగ్గా ఉందిరా... మన బుర్రలు ఉపయోగించి, అతన్ని బురిడీ కొట్టిద్దాం!'' అంటూ తన ఆలోచన చెప్పాడు మూడోవాడు. దానికి మిగతావాళ్ళు కూడా ఒప్పుకున్నారు.
ఇద్దరు చెట్టు చాటున దాక్కోగా, ఒకడు మాత్రమే బ్రాహ్మణుడి ముందుకు వెళ్ళాడు.

''అయ్యా, నమస్కారం! మీ కుక్క భలే అందంగా ఉంది ఇది ఏ జాతిది?'' అంటూ అడిగాడు.

''పరాచికాలు అడడానికి నీకు నేనే దొరికానా? మేకను పట్టుకుని కుక్కంటావా? వెళ్ళవయ్యా వెళ్ళు!'' అన్నాడు బ్రాహ్మణుడు కోపంగా.

''ఏమిటి? ఇది మేకా? అహ్హా..హ్హా..!'' గట్టిగా నవ్వి అక్కడినుండి వెళ్ళిపోయాడా దొంగ.

కొంతదూరం వెళ్ళాక మరొక దొంగ బ్రాహ్మణుడిని కలిశాడు.

''ఇది విచిత్రంగా ఉందే. గుర్రం ఉండగా ఎందుకు మీరు నడుస్తూ వెళుతున్నారు. దీనిపై స్వారీ చేయొచ్చుకదా?'' అన్నాడు రెండో దొంగ.

''ఏమిటి? నా మేక నీకు గుర్రంలా కనిపిస్తోందా?'' అన్నాడు బ్రాహ్మణుడు కోపంగా.

''అయ్యా! మీరు గొప్ప పండితుడిలా ఉన్నారు. గుర్రానికి, మేకకు తేడా తెలీదంటే నేను నమ్మను'' అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు.

ఆ మాటలతో కొంత అయోమయంలో పడిపోయాడు బ్రాహ్మణుడు.

మరి కొంతదూరం వెళ్ళాక ఈసారి మూడో దొంగ ఎదురుపడ్డాడు.

''పండితులకు నమస్కారం. గాడిదను మీరు తాకటం ఏమిటి? పైగా దాన్ని మీవెంట తోలుకెళుతున్నారు. ఎందుకో నేను తెలుసుకోవచ్చా?'' అన్నాడా దొంగ వినయంగా.

''ఇది గాడిదా?'' భయంగా మేకవైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు బ్రాహ్మణుడు. ''అవును! ఇందులో సందేహం ఏముంది?'' అమాయకంగా చెప్పాడు మూడో దొంగ.

ఆ మాటలతో విపరీతంగా భయపడ్డాడు బ్రాహ్మణుడు. 'బహుశా ఇది దెయ్యమేమో? ఒక్కొక్కరికి ఒకోలా కనబడుతోంది. బాబోరు దీన్ని నా వెంట తీసుకుపోయి, నా ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటానా?' అని ఆలోచించిన ఆ బ్రాహ్మణుడు మేకను అక్కడే వదిలి పారిపోయాడు.

ఆ బ్రాహ్మణుడి తెలివి తక్కువతనానికి పెద్దపెట్టున నవ్వుకుంటూ... మేకను తీసుకుని వెళ్ళిపోయారు ముగ్గురు దొంగలు.

కుక్క-గాడిద

ఒక బట్టలు ఉతికేవాడి దగ్గర గాడిద, కుక్క ఉండేవి. కుక్క పగలూ, రాత్రీ యజమాని ఇంటికి కాపలా కాసేది. గాడిద బండెడు బట్టల మూటలు వీపుమీద మోసుకుని చెరువుకు తీసుకెళ్ళేది. కొంతకాలం గడిచాక 'ఇంతవరకూ ఒక్క దొంగ కూడా నా ఇంటికి రాలేదు. ఇన్నిరోజులూ ఈ కుక్క తిండి కోసం అనవసరంగా చాలా ఖర్చు చేశాను'' అని యజమాని తన భార్యతో అన్నాడు.

ఈ మాటలు విన్నది కుక్క. 'రాత్రంతా మెలుకుని ఎంత సేవ చేశాను? నేనుండటం వల్లే దొంగలు పడలేదన్న విషయం యజమాని విస్మరించాడు' అనుకుని ఎంతో బాధపడింది.

ఆ రోజు నుండి యజమాని భార్య కుక్కకు సరిగ్గా ఆహారం ఇవ్వడం మానేసింది. పాపం ఆ కుక్క పగలంతా ఆహారం కోసం ఊళ్ళో తిరిగి తిరిగి... ఏమైనా దొరికితే ఇంత తిని, ఓపిక ఉంటే యజమాని ఇంటికి వచ్చేది. లేదంటే ఉళ్లో ఎక్కడో ఒకచోట ముడుచుకుని పడుకునేది. కొన్నిరోజులు గడిచాక... ఒక అర్ధరాత్రి దొంగ ఒకడు యజమాని ఇంటిలోకి ప్రవేశించాడు. కుక్క దొంగను చూసింది కానీ మొరగలేదు. నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుంది. దొంగ ఇంటిలోకి వెళ్ళడం గాడిద కూడా పసికట్టింది.

''ఒక దొంగ మన యజమాని ఇంట్లోకి వెళ్ళాడు తెలుసా?'' గుసగుసగా అంది గాడిద. ''అవును తెలుసు'' అంది కుక్క.
''మరి యజమానిని ఎందుకు హెచ్చరించడం లేదు?''

''నా ఇష్టం'' నిర్లక్ష్యంగా జవాబిచ్చింది.

''నీ ఇష్టప్రకారం నువ్వు నిర్ణయాలు తీసుకోలేవు. యజమాని ఇంటిని కాపాడటం నీ బాధ్యత'' అని చెప్పింది గాడిద.
''నోర్మూసుకుని పడుకో! అనవ సరమైన సలహాలివ్వకు'' అని కుక్క కోపంగా చెప్పింది. ''సరే నువ్వు మొర గకు. నేను గట్టిగా అరిచి యజమాని ని నిద్రలేపుతాను. కుక్కకంటే గాడిదే విశ్వాసమైనదని రుజువు చేస్తాను'' అని గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది.

లోపల గాఢనిద్రలో ఉన్న యజ మాని ఉలిక్కిపడి నిద్రలేచాడు. బంగారంలాంటి నిద్ర చెడగొట్టినం దుకు అతనికి చాలా కోపం వచ్చింది. ఒక దుడ్డుకర్ర తీసుకువచ్చి ''ఏం పోయేకాలమే నీకు. అర్ధరాత్రి రచ్చ చేస్తున్నావు''అంటూ గాడిదను రెండు బాది, తిరిగి వెళ్ళి నిద్రపోయాడు.

రహస్యంగా ఇంటిలో ఒక మూల నక్కిన దొంగ విలువైన వస్తు వులను చక్కగా మూటకట్టుకుని, పారిపోయాడు. ఆ మరునాడు ఉదయం నిద్రలేచిన యజమాని ఇల్లు గుల్లవడం చూసి లబోదిబోమన్నాడు. బక్కచిక్కిపోయి నీరసంగా పడుకున్న కుక్కని చూశాకగానీ అతనికి జ్ఞానోదయం కాలేదు. తన తప్పు తెలుసుకున్న యజమాని ఆ రోజు నుండి కుక్కకు ఆహారం పెట్టి, మంచిగా చూసుకోసాగాడు.

తెలివైన ఎలుగుబంట్లు

ఒక వేటగాడు వేట కోసం ఒక అడవికి వెళ్ళాడు. జంతువుల కోసం అతను వెతుకుతూ చాలాదూరం అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ఒకచోట ఎండిపోయిన ఒక వాగు దాని కర్ర వంతెన కనిపించాయి. ఆ వంతెన ఎంత సన్నదంటే, ఒకేసారి ఆ దారి గుండా ఇద్దరు మనుషులు ప్రయాణించలేరు.

వంతెనకు ఒక పక్క నేరేడు చెట్లు ఉన్నాయి. రెండో పక్క దట్టమైన అడవి ఉంది. నేరేడు పళ్ళంటే ఎలుగుబంట్లకు ఇష్టమని వేటగాడికి తెలుసు. వేటగాడు ఒక పెద్దరాయి వెనుక నక్కి అటుగా వచ్చే ఏదైనా ఎలుగుబంటిని చంపడానికి కాచుకుని కూర్చున్నాడు.

కాస్సేపు గడిచాక నేరెడు చెట్ల వైపు నుండి ఒక పెద్ద ఎలుగు, మరోవైపు నుండి మరొక చిన్న ఎలుగుబంటి రావడం వేటగాడి కంటపడింది. ఎలుగుబంట్లు ఒకదానినొకటి దాటుకుంటూ వెళ్ళలేవని అతనికి తెలుసు. అక్కడ ఏదో పోట్లాట జరుగుతుందని అతను భావించాడు. వేటగాడు ఆ దృశ్యం చూస్తూ కూర్చున్నాడు. ఎలుగుబంట్లు దగ్గరగా వచ్చాయి. కొన్ని క్షణాలు ఎదురెదురుగా నిలబడి ఒక దానివైపు ఒకటి చూస్తూ కాస్సేపు నిలబడ్డాయి. ఆ తరువాత పెద్ద ఎలుగుబంటి కిందకూర్చుని, చిన్న ఎలుగును తన వీపుపై ఎక్కించుకుంది. చిన్న ఎలుగుబంటి పెద్దదాని వీపుపై ఎక్కి అవతలికి దాటింది. ఆ తరువాత వాటి దారిలో అవి వెళ్ళిపోయాయి.

దీంతో వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. జంతువులు మనుషులకన్నా మంచి ప్రవర్తన గలవని అతను గ్రహించాడు.

అందుకే మనిషి జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది కదా!

చిత్రపటం

ఒకసారి ఒక ధనవంతురాలు తన చిత్రపటాన్ని గీసే పని ఒక ప్రఖ్యాత చిత్రకారుడికి అప్పగించింది. ఆ చిత్రకారుడు ఎంతో కష్టపడి, ఎన్నోరోజులు శ్రమించి ఆ ధనవంతురాలి చిత్రాన్ని చాలా గొప్పగా వేశాడు. చిత్రపటం పూర్తయ్యాక ఆ చిత్రకారుడు ఆమెను తన స్టుడియోకి ఆహ్వానించాడు.

ఆమె టామీ అనే తన పెంపుడుకుక్కను వెంటబెట్టుకుని వచ్చింది. ఆమెకు తన కుక్కంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో తన కుక్కను మించిన తెలివైన జంతువు మరొకటి ఉండదని నమ్ముతుంది.

''టామీ డార్లింగ్‌! ఇదుగో నీ యజమాని'' అంటూ ఆమె తన చిత్రపటాన్ని ఆమె టామీకి చూపించింది. టామీ ఆ బొమ్మను చూడటానికి ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు.

అప్పుడా ధనవంతురాలు చిత్రకారుడివైపు తిరిగి ''ఈ బొమ్మలో ఏదో లోపం ఉంది. అందుకే టామీ నా బొమ్మను గుర్తుపట్టలేక పోయింది'' అంది.

ఆ చిత్రకారుడు కాస్త తెలివైనవాడు. ధనవంతులు ఎన్నిరకాలుగా విచిత్రంగా ప్రవర్తిస్తారో అతను ఊహించగలడు. అతను ఆమెతో వాదించలేదు. ''మేడమ్‌! మీరు రేపు రాగలరా? మీ టామీకి నచ్చేలా ఈ బొమ్మలో మార్పులు చేస్తాను'' అన్నాడు.

మరునాడు ఆ ధనవంతురాలు టామీతో వచ్చింది. ఈ సారి టామీ చిత్రపటాన్ని చూడగానే తోక పైకెత్తి దాని దగ్గరకు పరుగుదీసింది. చాలా ఆసక్తిగా ఆ చిత్రపటాన్ని నాకడం మొదలెట్టింది.

''ఓV్‌ా అద్భుతంగా గీశారు. మా టామీకే కాదు నాకు కూడా బొమ్మ చాలా నచ్చింది'' సంతోషంగా అందామె.
ఆమె చిత్రకారుడు అడిగిన డబ్బు ఇచ్చి ఆ చిత్రపటాన్ని కొనుక్కుని తనతో తీసుకుని వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోÄయాక ఆ చిత్రకారుడు పడీ పడీ నవ్వాడు. అతను ఆ చిత్రపటం కింది భాగంలో ఆమె వచ్చే ముందు మాంసం ముక్కతో రుద్దాడు. ఆ మాంసం వాసన టామీ చిత్రపటాన్ని నాకేలా చేసింది అంతే!

చిలుక పలుకులు!

శ్రీధర్‌కు పక్షులు వేటాడటం సరదా. ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు మీద చాలా చిలుకలు కనిపించాయి. అతనికి ఎప్పటినుండో ఒక చిలుకను పెంచుకోవాలనే కోరిక ఉంది. కొన్ని ధాన్యం గింజలు చెట్టుకింద నేలమీద చల్లి, వాటి మీద పలచని వల వేశాడు. చాలా జాగ్రత్తగా చూస్తే కానీ అక్కడ వల ఉందన్న విషయం తెలియదు. వల పన్నడం అయ్యాక, ఆ చెట్టు వెనకే నిశ్శబ్ధంగా మాటువేశాడు.

కాస్సేపు గడిచాక రెండు చిలుకలు నేల మీదున్న గింజలను పసికట్టాయి. ''ఆరు... ఎన్ని గింజలో! భలే.. భలే!'' అంటూ కిందకు రివ్వున దిగిందో చిలుక.

''ఆగు నేస్తం! ఈ అడవిలో ఒక చెట్టు కింద ధాన్యం రావడం ఆశ్చర్యంగా లేదూ..'' అని హెచ్చరించింది రెండో చిలుక. తిండి చూసిన తొందరలో దానికి ఆ మాటలు చెవికి ఎక్కలేదు. నేల మీద వాలడం..వలలో చిక్కుబడి పోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.

''నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు వినలేదు. దేనికైనా అంత తొందర పనికిరాదు'' ఆ వలకి కొంచెం దూరంగా నేలమీద వాలుతూ అంది రెండోచిలుక. ''నిజమే! చాలా తొందరపడ్డాను ఇప్పుడు విచారించి ఏం లాభం! జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కదా!'' కన్నీళ్ళు పెట్టుకుంది మొదటి చిలుక.

ఇంతలో చెట్టు చాటు నుంచి ఇవతలకు వచ్చాడు శ్రీధర్‌. అతన్ని చూడగానే రెండో చిలుక చెట్టుపైకి ఎగిరిపోయింది. అతను వలలో చిక్కుకున్న చిలుకను బయటికి తీయడం, ఒక పంజరంలో బంధించడం చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయింది అది.

శ్రీధర్‌ చిలుకును తన ఇంటికి తీసికెళ్లి ఒక పంజరంలో పెట్టాడు. అతని పిల్లలు దాన్ని చూసి ఎంతో సంతోషించారు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో బందీ అయింది చిలుక. ఎన్నో రకరకాల పండ్లు తినడానికి ఇచ్చేవారు. కానీ స్వేచ్ఛలేని ఆ జీవితం ఆత్మహత్యతో సమానంగా భావించింది చిలుక. కానీ ఏం చేయలేని పరిస్థితి. ప్రతి క్షణం తన దుస్థితికి చింతిస్తూ రోజులు గడపసాగింది.

శ్రీధర్‌ ఆ చిలుకకు చిన్న చిన్న మాటలు పలకడానికి ప్రతిరోజూ తర్ఫీదు ఇవ్వసాగాడు. 'హలో..! నమస్కారం..! రండి..!' అనే చిన్న చిన్న పదాలు నేర్చుకుంది చిలుక. శ్రీధర్‌ దాన్ని ముందుగదిలో ఉంచి తన ఇంటికి వచ్చే బంధువులకు, స్నేహితులకు చిలుక పలుకులు వినిపించి, అందరిచేత ప్రశంసలు పొందసాగాడు. చిలుకను చూసి అందరు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ చిలుకకు మాత్రం ఎంతో విషాదంగా ఉండేది.

'ఒరే మీ ఆనందం పాడుగాను. నన్ను వదలండిరా! నేను మీలా స్వేచ్ఛగా బతుకుతాను' అని మనసులో ఆక్రోశించేది. కానీ తన భావం వాళ్ళకి తెలియజేయడానికి దానికి అంత భాష రాదు.

ఒకరోజు శ్రీధర్‌ని అతని కొడుకు బాగా విసిగించడంతో వాడి వీపుమీద ఒకటి పీకి, ''చంపేస్తాను రాస్కెల్‌! గెటవుట్‌'' అంటూ కోపంగా తిట్టాడు. అది విన్నది చిలుక. శ్రీధర్‌ తిట్టడంతో ఏడుస్తూ ఆ పిల్లవాడు బయటికి వెళ్ళిపోవడం చూసింది. వెంటనే దాని మనుస్సులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. 'చంపేస్తాను రాస్కెల్‌! గెటవుట్‌!' అన్న ఆ పదాలని పదే పదే మననం చేసుకుంది. రాత్రంతా అది తను నేర్చుకున్న మిగతా మాటలు మర్చిపోయి ఆ ఒక్క పదమే కంఠతా వచ్చేవరకూ మననం చేసుకుంటూనే ఉంది.

మరునాడు శ్రీధర్‌ వాళ్ళ ఆఫీసర్‌ ఇంటికి వచ్చాడు. ''ఏదయ్యా నీ దగ్గర ఒక మాట్లాడే చిలుక ఉందని విన్నాను.. చూపించు!'' అని ఆసక్తిగా అడిగాడు. శ్రీధర్‌ ఆయనకి ఎంతో గర్వంగా తన చిలుకను చూపించి... ''సార్‌కి హలో చెప్పు!'' అన్నాడు.

వెంటనే చిలుక ''చంపేస్తాను రాస్కెల్‌! గెటవుట్‌'' అంటూ ముద్దు ముద్దుగా పలికింది. ఆ మాటలు విని ఆఫీసర్‌ ముఖం అవమానంతో ఎర్రబడింది. శ్రీధర్‌ కంగారుపడి, వారిస్తున్నా చిలుక వినలేదు. ''రాస్కెల్‌ గెటవుట్‌! గెటవుట్‌!'' అని అంటూనే ఉంది. ఆఫీసర్‌ కోపంగా వెళ్లిపోయాడు.
ఆ రోజు నుండి అదే తంతు. ఎవరు ఇంటికొచ్చినా ఆ చిలుక 'గెటవుట్‌ రాస్కెల్‌! చంపేస్తాను రాస్కెల్‌!' అని గట్టిగా అరిచేది. దానితో ఎవరినైనా తనింటికి పిలవాలంటే భయపడే స్థితికి వచ్చాడు శ్రీధర్‌.

''ఏంటయ్యా చిలుకకు మంచి మాటలు నేర్పించాలి కానీ, తిట్లు నేర్పిస్తారా?'' అని చాలామంది శ్రీధర్‌ని ముఖం మీదే చివాట్లు వేయసాగారు. చిలుక చేత ఆ మాటలు మాన్పించాలని ఎంతో ప్రయత్నించాడు శ్రీధర్‌. అది నేర్చుకోగపోగా, మరింతగా రెచ్చిపోయి, అవే మాటలు పదే పదే అనసాగింది.

దీంతో అతను ఇక ఆ చిలుకను ఇంట్లో ఉంచకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. మరునాడు ఉదయాన్నే ఊరి బయటకు పంజరం తీసుకెళ్ళి, చిలుకను వదిలేశాడు. తన ఎత్తు పారినందుకు సంతోషిస్తూ.. ఆ చిలుక అరణ్యం వైపు హాయిగా ఎగిరిపోయింది. అందుకే అపాయం వచ్చినప్పుడు ఉపాయం చేయాలి. అప్పుడే ప్రమాదం నుండి బయటపడతాం.

కృతజ్ఞత

హిమాలయ పర్వతాల అడుగుభాగంలో ఒక దట్టమైన అరణ్యం ఉండేది. అందులో ఎన్నో పక్షులు, జంతువులు ఉండేవి. ఒక ముని తన తపస్సు కోసం ఆ అరణ్యంలో ఒక ఆశ్రమం ఏర్పరుచుకున్నాడు.

అది వేసవికాలం. ఆ ఎండలకు అరణ్యంలో ఉన్న నదులు, సరస్సులు ఎండిపోయాయి. నీళ్ళు దొరక్క పక్షులన్నీ వలస వెళ్ళగా, ఎక్కడికి వెళ్ళని జంతువులు అల్లాడిపోయాయి. వాటి పరిస్థితి చూస్తున్న ముని హృద యం జాలి పడింది. ఆ రోజు నుండి అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి కుండలతో నీళ్ళు నింపుకొని, అడవికి తీసుకురాసాగాడు. జంతువులు మూగేచోట వాటిని ఉంచసాగాడు. ప్రతిరోజూ ముని ఉదయం నుండి చీకటి పడేవరకూ ఆ పనే చేసేవాడు. ఆ పనిలో పడి తన భోజనం విషయం కూడా మర్చిపోయాడు.

ఇది గ్రహించిన జంతువులు తమ కోసం అంత కష్టపడుతున్నా మునికి కృతజ్ఞత చూపాలనుకున్నాయి. అన్నీ కలిసి నీళ్ళు తాగడానికి వస్తూ, తలా ఒక పండు తీసుకు రాసాగాయి. ముని వాటిలో కొన్ని తిని, మిగతావన్నీ పేద ప్రజలకు పంచిపెట్టేవాడు. వాళ్ళు ప్రతిగా నీళ్ళు అడవికి తీసుకురావటంలో సహాయం చేశారు. ఇలా ఆ వేసవి కాలమంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆనందంగా జీవించారు.

ఓడి గెలిచిన ఎద్దు!

అవంతీపురం అనే నగరంలో రామా చారి అనే బీదవాడు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తల్లా ఒక పెంకుటిల్లు, ఒక ఎద్దు. దూడగా ఉన్నప్పుడు దాని తల్లి చనిపోతే, రామాచారి ఎంతో ప్రేమగా దాన్ని పెంచాడు. 'నంద కుమారా!' అని దాన్ని ఆప్యాయంగా పిలిచుకునేవాడు రామాచారి.

రామాచారి పేదరికాన్ని గమనించిన ఎద్దు 'తను పస్తులుండి నా కడుపు నింపడానికి ఎంతో శ్రమపడ్డాడు. ఈ మహానుభావుడి రుణం తీర్చుకోవాలి' అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది.

ఒకరోజు అది రామాచారితో ''అయ్యా! మీకు తెలుసు, మీ నీడలో పెరిగిన నేను ఎంత బలశాలిగా తయారయ్యానో! నాలా బరువులు లాగే వారు ఈ రాజ్యంలోనే లేరు. మీరు భూస్వామి నరేంద్రభూపతిని కలుసుకుని, నా నందకుమారుడు యాభై నిండు బండ్లను లాగగలడని పందెం కాయండి!'' అని చెప్పింది.

రామాచారి నరేంద్రభూపతి దగ్గరకు వెళ్ళి ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ నందకుమారుడి బలం గురించి గొప్పగా చెప్పాడు. అంతేకాదు తన ఎద్దు యాభై బండ్లు లాగగలదని పందెం కాశాడు. అతని మాటలు విని, ఆశ్చర్యపోయిన నరేంద్రభూపతి వెయ్యి రూపాయల పందానికి సిద్ధపడ్డాడు.

ఆ పందెం గురించి తెలిసిన ఆ గ్రామ ప్రజలే కాకుండా ఆ చుట్టుపక్కల జనాలు కూడా పోగయ్యారు. ధాన్యం నింపిన యాభై బండ్లు నందకుమారిడికి కట్టారు. వాటిని ఆ ఎద్దు లాగడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. రామాచారి దాన్ని ఎంతగానో అదిలించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. దానితో రామాచారి పందెం ఓడిపోయి వెయ్యి రూపాయలు పోగొట్టుకున్నాడు.

అతను ఎంతో విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడా ఎద్దు అతనితో ''అయ్యా! నన్ను మన్నించు. నేను లాగలేక కాదు. ఆ మాత్రం శక్తి నాలో ఉంది. ఎందుకనో నా కాళ్ళు ముందుకు పడలేదు. ఈసారి నూరు బండ్లు లాగగలనని పందెం కాయండి!'' అని అంది.

కానీ రామాచారి దాని మాటలు విశ్వసించలేదు.

''కొడుకులా మీ ఇంట పెరిగాను. ఈ ఒక్కసారి నా మాట నమ్మండి. ఈసారి కానీ మీరు పందెం ఓడిపోయేలా చేస్తే నా ముఖం మీకు చూపించను'' అంటూ నంద కుమారుడు ఎంతో బతిమిలాడిన తర్వాత రామాచారి తిరిగి నరేంద్రభూపతిని కలుసు కున్నాడు. వృషభం చెప్పినట్లే పది వేలకు పందెం కాశాడు. అంతేకాదు ఊళ్ళో ఎవరైనా సరే పందెంలో పాల్గొనవచ్చని చెప్పాడు. రామాచారి తన పెంకుటిల్లు అమ్మేసి డబ్బు సిద్ధంచేశాడు.

అంతా రామాచారికి పిచ్చి పట్టిందనుకున్నారు. అయినా ఆ పందెం చూడడానికి తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. ధాన్యపు బస్తాలతో నిండిన నూరు బండ్లు ఒకదాని తర్వాత ఒకటి కట్టబడ్డాయి. రామాచారి మొదటి బండి ఎక్కి కూర్చుని పగ్గాలు పట్టుకుని ''నాయనా ముందుకు కదులు'' అని ప్రేమగా ఎద్దును తట్టాడు.

అంతే.. అందరు చూస్తుండగా ఆ ఎద్దు ముందుకు అడుగువేసింది. దానితో పాటే నూరు బండ్లూ కదిలాయి. అలా పదడుగులు ముందుకు నడిచింది వృషభం.

రామాచారి పందెం గెలిచాడు. నరేంద్రభూపతి పదివేల రూపాయలు అతనికి ఇచ్చాడు. అంతేకాదు ఆ ఎద్దు బలానికి ఆశ్చర్యపోయిన జనాలు కూడా తలా కొంత వేసుకుని డబ్బు పోగేసి, ఇచ్చారు. ఇంటికి తిరిగి వస్తున్న రామాచారితో నందకుమారుడు ''అయ్యా! నేను మొదటిసారే పందెం గెలిస్తే మీకు చాలా తక్కువ మొత్తం డబ్బు ముట్టేది. నేను మొదటిసారి లాగకపోవడానికి కారణం ఇదే'' అని చెప్పింది. ఆ మాటలు విన్న రామాచారి దాని వీపు మీద ఆప్యాయంగా నిమిరాడు.

పనికిరాని బంగారం

ఒకానొకప్పుడు రంగయ్య అనే ఓ పిసినారి ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపా దించాడు. అయినా ఒక నయాపైసా కూడా ఖర్చు పెట్టలేదు. తన పెరట్లో ఓ గొయ్యిని తవ్వి, తను కూడబెట్టిన బంగారమంతటినీ అందులో దాచి ఉంచుకున్నాడు. రోజూ ఆ గొయ్యిని తవ్వడం - బంగారాన్ని చూసి మురిసిపోవడం మళ్ళీ ఆ గొయ్యిని కప్పేయడం... కొన్నేళ్ళపాటు ఇదే అతని ముఖ్యమైన దినచర్యగా ఉండేది.

అయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది? ఒకనాడు ఓ దొంగ ఇదంతా చూడనే చూశాడు. ఇంకేముంది. ఆ రాత్రే గొయ్యిని తవ్వి, మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మరునాడు ఎప్పటిలాగే గొయ్యిని తవ్వి చూసుకున్న రంగయ్య తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. ''ఏదీ! నా బంగారం ఏదీ? అంటూ లబోదిబోమని ఏడ్వడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఓ పెద్దమనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు.

''అసలింతకీ నువ్వా బంగారంతో ఏం చేయాలనుకున్నావు?'' అని అడిగాడు పెద్దమనిషి. ''ఏమీ చేయాలనుకోలేదు. కేవలం దాచుకుందామనుకున్నాను'' అన్నాడు రంగయ్య. ''అలాగా!... అయితే ఈ గులకరాయిని ఆ గోతిలో వేసి నీ బంగారం ఎక్కడికీ పోలేదనుకో. ఎప్పటిలాగే రోజూ వచ్చి, ఈ గులకరాయిని చూసి వెళ్ళిపో!'' అంటూ ఓ గులకరాయిని అందించి, తన దారిన తాను వెళ్ళిపోయాడు పెద్దమనిషి. రంగయ్య అయోమయంగా చూశాడు. సరిగ్గా ఉపయోగించని వస్తువు ఎంత ఖరీదైనదయినా వ్యర్థమే కదా!

ఏనుగుకు కోపం వచ్చింది!

సీత శివాలయానికి చెందిన ఏనుగు. మావటివాడు రోజూ దాన్ని ఆ దగ్గరలో ఉన్న చెరువుకు తీసుకుని వెళ్ళేవాడు. చెరువుకు వెళ్ళేదారిలో గోపయ్య ఇల్లు ఉంది. అతను తన ఇంటి అరుగుమీద కూర్చుని బట్టలు కుట్టేవాడు.

సీత రోజూ గోపయ్య ఇంటి ముందు కొంచెంసేపు ఆగేది. గోపయ్య అరటి పండ్లు, కొబ్బరిచిప్పలు, తన దగ్గర ఏమి ఉంటే అవి ఏనుగుకు ఇచ్చేవాడు. సీత అవి తీసుకుని అతన్ని తన తొండంతో ఆశీర్వదించి వెళ్ళిపోయేది.

ఒకరోజు గోపయ్యకు, అతని భార్యకు మధ్య చిన్న తగువు జరిగింది. ఆ కోపంలోనే వచ్చి కుట్టుమిషను ముందు కూర్చున్నాడు. ఎప్పటిలా చెరువుకు వెళుతూ సీత అతని ముందు ఆగింది. కానీ కోపంగా ఉన్న గోపయ్య దాన్ని పట్టించుకునే స్థితిలో లేడు. చాలాసేపు నిలబడి, నిలబడి తను వచ్చానని తెలపడానికి సీత గట్టిగా ఘీంకరించింది.

గోపయ్య ఆ శబ్ధానికి ఉలిక్కిపడ్డాడు. అతనికి చాలా చిరాకు కలిగింది. తన చేతిలో ఉన్న సూదితో ఏనుగు తొండంలో గుచ్చాడు.

తొందరపాటు

ఒక అరణ్యంలో జింక ఒకటి ఉండేది. దానికి తొందర పాటుతనం ఎక్కువ. అది పసికట్టి వాళ్ళమ్మ ''నీ ప్రవర్తన వల్ల నువ్వు ఒకరోజు ఏ వేటగాడి చేతిలోనో ఇరుక్కుంటావు!'' అని ఎప్పుడూ హెచ్చరించేది. కానీ తల్లి మాటలు ఈ జింకపిల్ల ఏ రోజూ పట్టించుకునేది కాదు. చాలా నిర్లక్ష్యంగా తల్లి మాటల్ని కొట్టిపారేసేది. తన ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించేది కాదు.

ఒకరోజు కొందరు వేటగాళ్లు ఒక జింకను తరమడం ప్రారంభించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తి ఆ జింక చెట్ల పొదల వెనుక దాక్కుంది. ఆ వేటగాళ్ళు దానికోసం వెతికారు. కానీ అది ఎక్కడా కనిపించలేదు. వారు అలాగే ఆలోచిస్తూ నిలబడ్డారు. వారు వెళ్ళిపోయారనుకున్న జింక అక్కడ చెట్లకున్న లేత ఆకులను కొరికి తినడం ప్రారంభించింది.

దానితో ఆ చెట్టుకొమ్మలు కదిలాయి. ఆలోచిస్తూ నిలబడ్డ వేటగాళ్ళలో ఒకరి దృష్టి కదిలే కొమ్మలపై పడింది.
వెంటనే అతడికి విషయం అర్థమైంది. ఇంకేం! తన విల్లు తీసి ఎక్కుపెట్టి బాణం వేశాడు. పాపం! జింక ప్రాణాలు కోల్పోయింది. దాని తొందరపాటే దాని ప్రాణాలు మీదకు తెచ్చింది.

నిర్ణయం!

ఒక జింకను వేట కుక్కలు తరుమడం ప్రారంభించాయి. దిక్కుతోచని ఆ జింక ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ వచ్చి ఒక పశువుల పాకలోకి వచ్చింది. అక్కడ ఒక ఎద్దు కోసం కేటాయిచిన స్థలానికి వచ్చింది. అక్కడ ఉన్న గడ్డిలోకి దూరింది. గడ్డితో తన శరీరాన్నైతే కప్పగలిగింది కానీ కొమ్ములు మాత్రం కప్పలేకపోయింది.

నెమ్మదిగా చీకటి పడింది. జింక అమ్మయ్య అనుకుంది. ఇంకా బాగా చీకటి అలుముకున్నాక చడీచప్పుడు కాకుండా పారిపోవచ్చనుకుంది. అయితే అక్కడే ఉన్న ఎద్దులలో ఒకటి మాత్రం, అది పారిపోవడం అంత తేలిక కాదని చెప్పింది.

తమ యజమాని భోజనం చేసి ఒకసారి ఆ పాకలోకి వస్తాడని, అతడు కనుక జింకను చూస్తే వదలడం కష్టమని చెప్పింది. ఆ మాటలను పూర్తి చేస్తుండగానే, యజమాని ఆ పాకలోకి ప్రవేశించాడు. అక్కడ కుప్పలా ఉన్న గడ్డిని చూసి, తనతో వచ్చిన పాలేర్లను ఆ గడ్డిలోంచి పైకి కనిపించేవి ఏమిటని అడిగాడు. దానితో పాలేర్లు అవేమిటో చూసేందుకు వెళ్ళి జింకను పట్టుకున్నారు. ఇంక తప్పించుకోవడం దానికి అసాధ్యమై పోయింది. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటారు.

బడాయికి పోయిన దూడ!

ఒక రైతు దగ్గర ఒక ఎద్దు, ఒక దూడ ఉండేవి. రైతు రోజూ పెందలాడే ఎదు,్ద దూడ లను పొలానికి తోలుకెళ్ళేవాడు. దూడను మేత మేయడానికి పొలంగట్టు వెంట వదిలేసేవాడు. ఎద్దుని నాగలికి కట్టేవాడు. ఎద్దు విశ్రాంతి అనేది లేకుండా చీకటిపడే వరకూ పొలం దున్నేది. దూడేమో చెట్లనీడలో కునుకు తీసేది. చెంగు చెంగున గంతులు వేస్తూ స్వేచ్ఛగా తిరిగేది.

ఒకరోజు ఎద్దు దగ్గరకు వెళ్ళింది దూడ. ''నిన్ను చూస్తోంటే చాలా జాలి కలుగుతోంది ఎద్దు మామా! నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునేవరకూ విరామమనేది లేకుండా కష్టపడుతూనే ఉంటావు. ఎంతటి బానిస జీవితం గడుపుతున్నావు? నన్ను చూడు ఎంత స్వేచ్ఛగా, ఉల్లాసంగా జీవితం గడుపుతు న్నానో! నీ స్థితిపట్ల నాకు చాలా బాధ కలుగు తోంది'' అంది.

ఎద్దు ఆ మాటలు వినిపించుకోనట్టు తన పని తాను చేసుకుపోయింది. పొగరెక్కిన దూడ వదిలేస్తేగా! ఎద్దుకు అడ్డంపడి, తన జీవితంలోని సుఖం గురించి చెప్పసాగింది.

చీకటిపడే సమయానికి సుందరయ్య వచ్చి ఎద్దు కాడి విప్పి, గడ్డి మేయడానికి వదిలేశాడు. కొద్దిసేపటి తర్వాత దూడ మెడలో వేప మండలు కట్టి, పలుపుతాడు బిగించాడు. సుందరయ్య గ్రామదేవతకు మొక్కుకున్న మొక్కు ప్రకారం ఆ సాయంత్రం దూడను బలి ఇవ్వటానికి దాన్ని లాక్కుపోసాగాడు.

గింజుకుంటున్న దూడ దగ్గరకు వచ్చింది ఎద్దు. ''అల్లుడూ..! నా స్థితి చూసి గేలి చేశావు. నన్ను చూసి జాలిపడ్డావు. ఇప్పుడు చూడు నీకు ఎలాంటి గతి పట్టిందో? యజమాని ఈ పని కోసమే నిన్నింత స్వేచ్ఛగా తిరగనిచ్చి, బాగా బలిసేలా చేశాడు. ఇప్పుడు చెప్పు నీ స్థితి మంచిదా? నా స్థితి మంచిదా?'' అని అడిగింది ఎద్దు.
జవాబు చెప్పలేని దూడ తల వంచుకుని యజమాని వెంట నడిచింది.

''అందుకే ఏ ఒక్కరినీ ఎగతాళి చేయడం, మిడిసిపాటు పడడం తగదు'' అంటూ కథ ముగించాడు తాతయ్య.

తెలివి మీరిన కోతులు

ఒకప్పుడు ఒక ఆసామి వీధి వీధీ తిరిగి టోపీలు అమ్ముకొని జీవించే వాడు. ఒక రోజున మధ్యాహ్నం వరకు టోపీలు అమ్మి భోజనం చేద్దామని ఒక మర్రిచెట్టు నీడలో తన టోపీల బుట్టను దించుకొన్నాడు. భోజనం చేసేందుకు సిద్ధమయ్యేంతలో చెట్టు మీద గల రెండు కోతులు రంగు రంగుల టోపీలను చూసి, కిందకు దిగి రెండు టోపీలను పట్టుకొని పైకి పోయాయి. అయ్యో! నా టోపీలుఅంటూ అతడు ఎంత అరచినా అవి వినిపించుకోలేదు. ఇలా కాదని అతడొక టోపీని తలమీద పెట్టుకొని అటు ఇటు ఊగుతూ, టోపీని గాలిలోకి విసిరాడు. కోతులు కూడా అతడి లాగే అటు ఇటు వూగి టోపీలను గాల్లోకి విసిరాయి.బతుకు జీవుడా! అనుకొంటూ అతడు టోపీలను తీసుకొని వెళ్ళిపోయాడు.

కొంత కాలానికి అతడు ముసలివాడై పోయాడు. అతడి కొడుకు టోపీల వ్యాపారాన్ని కొనసాగించాడు. ఒక రోజున సరిగ్గా అతడికి తండ్రికి జరిగినట్టే జరిగింది. చెట్టు కింద టోపీల బుట్టను పెట్టుకొని, భోంచేస్తుంటే రెండు కోతులు వచ్చి రెండు టోపీలను ఎత్తుకు పోయాయి. కాని అతడికి వెంటనే తండ్రి మాటలు గుర్తొచ్చి, అతడిలాగే అటు ఇటు వూగి టోపీని గాలిలోకి విసిరాడు. కాని కోతులు వాటి దగ్గర టోపీలను విసరలేదు. నువ్విలా వూగి టోపీని గాలిలోకి విసురుతావని అయినా సరే టోపీలను విసరొద్దని మా అమ్మ చెప్పిందిగాఅన్నాయి.

దాంతో ఇంకా చేసేదేమి లేక అతడు మిగిలిన టోపీలను తీసుకొని వెళ్ళి పోయాడు.

Monday, October 7, 2013

ఏమిలేదు


అల్లరి ఎలుకపిల్ల


ప్రకృతి విస్మయం


సహజ స్వాభావం


పేరు లేని పక్షి


చివరి కోరిక


ముల్లా దురాశ


ఎలుక-మిడత


నెలవంక


చంద్రుడు-చలి


కోతి చెప్పిన నీతి


కోతి చేసిన న్యాయం


కోతి గెంతులు


కోతి పాట్లు


కోతి-కొబ్బరికాయ


కోతి చేష్టలు


డబ్బు విలువ


లోభి దాచిన ధనం


పొగరుబోతు


అల్లరి విక్కీ


Wednesday, September 18, 2013

దురాశ దుఃఖానికి చేటు

వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటి కంటే భైరవుడికి... కుందేలు, జింక, అడవిపంది వంటి జంతువుల మాంసమంటే భలే ఇష్టం.

ఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు, ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది.

భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి, చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు, అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది

ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి... పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగూ చనిపోయి కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది.

దగ్గరికెళ్లిన నక్క ఇలా ఆలోచించింది "ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది." అనుకుంది.

అనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే...! పదునైన "వింటి కోపు" దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ... తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి.

భైరవుడు ఒక జింక చాలదని అడవిపందిని వేటాడబోయి చనిపోయాడు. నక్క ఎలాంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా, పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. దీన్నిబట్టి మీకెమర్థమయ్యింది పిల్లలూ...! దురాశ దుఃఖానికి చేటు. మానవుడు ఆశాజీవే కానీ అత్యాశ పనికిరాదు.

బలం కన్నా బుద్ధి గొప్పా

మిణుగురు పురుగు సమయస్ఫూర్తి
అనగనగా ఒక అడివిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.

కాకి “యేమిటది” అని అడిగింది.“నీకు నా లాంటి చాలా పురుగులున్న చొటొకటి చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.ఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.

కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది. సుర్రని నోరు కాలింది. బాబోయి, ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని యెగిరిపోయింది. ఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పా” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది!

శిబి చక్రవర్తి దానశీలత

మహాదానశీలి అయిన శిబి చక్రవర్తి, తన సహాయం కోసం శరణుజొచ్చిన వారికి కాదనకుండా సాయం చేసేవాడు. ఆడిన మాట తప్పడం ఆయన జీవితంలో లేదు. అందుకనే ఆయన పేరు ఈ భూమి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. అలాంటి శిబి చక్రవర్తి జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటనను గురించిన కథను తెలుసుకుందాం...!
ఒకసారి శిబి చక్రవర్తిని ఇంద్రుడు, అగ్నిదేవుడు పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపాని ధరించి భూలోకానికి దిగివచ్చారు. రావడంతోటే డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి కాపాడమంటూ ప్రాదేయపడుతుంది. నీకేమీ భయంలేదు నేనున్నానంటూ ఆయన దానికి అభయమిస్తాడు.


అయితే డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు శిబి చక్రవర్తి వద్దకు వచ్చి... "ఈ పావురం నా ఆహారం. నువ్వు దానికి అభయమిచ్చి, నా ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. ఇది నీకు తగునా...?" అంటూ ప్రశ్నించాడు.అప్పుడు శిబి చక్రవర్తి "ఈ పావురానికి ప్రాణాలు కాపాడతానని నేను అభయం ఇచ్చాను. నీకు కావాల్సింది ఆహారమే కదా..! ఈ పావురం కాక మరేదయినా ఆహారం కోరుకో ఇస్తాను..." అని చెప్పాడు.


దానికి డేగ మాట్లాడుతూ... "అయితే ఆ పావురమంత బరువు కలిగిన మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు ఇవ్వు" అని అంది.దీనికి సరేనన్న శిబి చక్రవర్తి కొంచెం కూడా తడబడకుండా త్రాసు తెప్పించి పావురాన్ని ఓ వైపు కూర్చోబెట్టి, మరోవైపు తన తొడ నుండి మాంసం కోసి పెట్టసాగాడు. ఆశ్చర్యంగా ఆయన ఎంత మాంసం కోసి పెట్టినప్పటికీ పావురమే ఎక్కువ బరువు తూగనారంభించింది.


సరే... ఇక ఇలాగ కాదు అనుకుంటూ... చివరకు శిబి చక్రవర్తి తన పూర్తి శరీరాన్ని డేగకు ఆహారంగా ఇచ్చేందుకు సంసిద్ధుడయి త్రాసులో కూర్చున్నాడు. దీన్ని చూసిన అగ్నిదేవుడు, ఇంద్రుడు తమ నిజరూపాన్ని ధరించి ఆయన త్యాగబుద్ధిని కొనియాడి, శిబి చక్రవర్తి శరీరాన్ని తిరిగి అతడికే ఇచ్చివేశారు.

గుర్రం

ఒక బట్టల వ్యాపారి దగ్గర ఒక గుర్రం వుండేది. అతను ఆ గుర్రం వీపుపైన బట్టల మూటలు వుంచి, ఒరూరు తిరిగుతూ వ్యాపారం చేసేవాడు. ఆ పని చేయడం గుర్రానికి అస్సలు ఇష్టం వుండేది కాదు. ఎలాగైనా అక్కడి నుండి బయట పడి స్వేచ్చగా బ్రతకాలని ఆరాట పడసాగింది. యజమాని ఎంత బాగా చూసినా దానికి అసంతృప్తి గానే వుండేది.
***
ఒక రోజు ఒక దొంగ వ్యాపారి ఇంటికి కన్నం వేసాడు. ఆ సమయంలో వ్యాపారి ఘాడ నిద్రలో వున్నాడు. దొంగ వ్యాపారి ఇంటిలోకి చొరబడి ధాన్యపు మూటలు ఒక్కొక్కటి ఇంటి వెనకాల నిలబెట్టివున్న బండి పైకి చేరవేయ సాగాడు.
***
జరుగుతున్న తతంగాన్ని పసికట్టింది గుర్రం. యజమానిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనే దానికి రాలేదు. నిశ్సబ్దంగా చూస్తూ వుండిపోయింది. దొంగ చివరి బస్తాను మోసుకు వెల్లుతుండటంతో....
***
"అయ్యా అదే చేత్తో నా కట్లు కూడా విప్పండి" అని అడిగింది.
***
"ఎందుకు?" దొంగ అడిగాడు.
***
"ఇక్కడ బ్రతకడం నాకు ఇష్టం లేదు"
***
"మరి నీ కట్లు విప్పితే నాకేంటి లాభం?" దొంగ అడిగాడు.
***
"కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి వుంటాను" అంది.
***
దాని మాటలకు ఒక్క క్షణం అలోచించి చిన్నగా నవ్వాడు దొంగ. "అవునూ... నేను దొంగని. నీకా విషయం ఇప్పటికే అర్ధమయి వుండాలి. మరి నీ యజమానిని నిద్రలేపలేదేమి.
***
"నాకు నా యజమాని అంటే అసహ్యం. అతని సొత్తు పోతే నాకేం? చూడు... నువ్వు దొంగిలిస్తుంటే నీ పనికి అవకాసం వున్నా అడ్డు పడలేదు నేను. మరి కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం" అంది గుర్రం.
***
గుర్రం మాటలకు నవ్వాడు దొంగ, " కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీలో అవి వున్నాయా? నిన్ను సంరక్షించే నీ యజమాని పట్ల నీకు క్రుతగ్నతే లేదు. వుంటే నువ్విలా స్వార్ధంగా ప్రవర్తించవు. నీలాంటి దాన్ని వెంట తీసుకుపోయి వుంచుకోవటం ఎప్పటికీ ప్రమాదమే. విశ్వాసం లేని పని వాడికి యజమాని అయ్యే కంటే అసలు.... పని వాడు లేక పోవడమే మేలు..." అంటూ అక్కడి నుంచి నిశ్సబ్దంగా జారుకున్నాడు దొంగ.
***
ఒక దొంగలో వున్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ మౌనంగా నిలబడిపోయింది గుర్రం.

Saturday, September 14, 2013

నోరు జారిన మాటలు

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినా చారుమతి మట్టుకు పట్టించుకునేది కాదు.

ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.

మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.

“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.

సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సాధువు దెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.

మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.

వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.

అప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.

ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది.

గురుశిష్యులు

ఒక రాజ్యంలో ఒక గొప్ప గురువు ఉండే వాడు. అతని పేరు విద్యా నాధుడు. అతని వద్ద చాలా మంది శిష్యులు ఉండేవారు. విద్యా నాధుడు శిష్యులను ప్రేమతో చూస్తూ విద్య బుద్దులు నేర్పేవాడు. అప్పుడప్పుడు వారికి విద్యలోనే కాక వేరే విషయాలలో కుడా పరీక్షలు పెడుతుండే వాడు. ఆయన వద్ద అనంతుడనే శిష్యుడు విద్య నేర్చుకునేవాడు.

ఒకసారి అనంతుడు గురువుగారు ఏది అడిగిన ఇస్తాను అని తోటి విద్యార్దులతో గొప్పలు చెప్పాడు. ఆవిషయం గురువు గారికి తెలిసింది. అవి నేరేడు పండ్లు కాసే రోజులు కావు. కాని అనంతుని పరీక్షించ డానికి గురువు గారు అనంతుని నేరేడు పండ్లు తీసుక రమ్మని చెప్పాడు. అందరు ఆశ్చర్యంతో అనంతుడు ఏమి చేస్తాడా అని చూడ సాగారు. అనంతునికి గూడా ఏమి చెయ్యాలో తోచలేదు. గురువు గారు ఏది అడిగిన ఇస్తానని తోటివారితోచెప్పాడు. ఇప్పుడు గురువు గారుఅడిగిన పండ్లు దొరికేరోజులు కావు. ఎలానా అని అనుకుంటుండగా అతనికి ఒక ఉపాయం తోచింది. గురువుగారి దగ్గరకు వెళ్లి “గురువుగారు నేను పండ్ల కోసం వెళుతున్నాను. నేను వచ్చేదాకా మీరు ఇక్కడినుండి కదలవద్దు.” అనిచెప్పి వెళ్ళాడు.

అతడు కాసేపట్లోవచ్చి పండ్లుదొరకలేదని చెపుతాడని అప్పుడు గొప్పలు చెప్పవద్దని బుధ్ది చెప్పాలనుకున్నాడు గురువుగారు. అనంతుని కిచ్చిన మాట ప్రకారం గురువు గారు కదలకకూర్చున్నాడు. ఒకరోజు గడిచింది. రెండు రోజులు మూడు రోజులు గడిచాయి. అనంతుడు రాలేదు. కాని ఒక మనిషి వచ్చాడు. అతడు గురువు గారితో “అయ్యా మీకాడ సదువుకొనేపిల్లడంట. అడవిలో తిరుగుతొండు. నేరేడు పండ్లుకావాలంట. ఇప్పుడు దొరకవు సామి అంటే ఇంటలేదు. మిమ్ము మాత్రం పండ్లు తెచ్చే దాకా ఈడనే కుసోమన్నాడు.” అని చెప్పాడు.

గురువు గారికి మిగతా శిష్యులకు గుండెల్లో రాయి పడ్డట్లయింది. అనంతుడు రానిదే గురువు గారు కదలటానికి లేదని తెలిసి శిష్యులందరు అనంతుని వెదకటానికి అడవికి వెళ్లారు. అనంతుడు కనిపించాడు కాని పండ్లు లేనిదే రానని చెప్పాడు. అప్పుడందరూ కలసి నచ్చచెప్పి గురువు దగ్గరకు తీసుక వచ్చారు. అనంతుడు వచ్చాడు కాబట్టి గురువు గారు కదలగలిగారు. అనంతుడుకూడా గురువు గారి ఆశ్విర్వాదంతో చదువు కొనసాగించాడు.

నీతి: పిల్లలు గొప్పలు చెప్పకూడదు, పెద్దలు కుడా పిల్లలకు చెయ్యలేని పనులు చెప్పకూడదు.

దురాశ దుఃఖానికి చేటు

వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటి కంటే భైరవుడికి... కుందేలు, జింక, అడవిపంది వంటి జంతువుల మాంసమంటే భలే ఇష్టం.

ఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు, ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది.

భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి, చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు, అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది

ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి... పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగూ చనిపోయి కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది.

దగ్గరికెళ్లిన నక్క ఇలా ఆలోచించింది "ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది." అనుకుంది.

అనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే...! పదునైన "వింటి కోపు" దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ... తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి.

భైరవుడు ఒక జింక చాలదని అడవిపందిని వేటాడబోయి చనిపోయాడు. నక్క ఎలాంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా, పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. దీన్నిబట్టి మీకెమర్థమయ్యింది పిల్లలూ...! దురాశ దుఃఖానికి చేటు. మానవుడు ఆశాజీవే కానీ అత్యాశ పనికిరాదు.

అందని ద్రాక్ష పుల్లన

అనగనగా ఒక నక్క ఉండేదట, ఒక రోజు అది రైతు యెక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది. అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి. ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు నోరూరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది.

మామూలుగా అయితే నక్కకు ఆ పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి వాటిని అందుకోబోయింది. కానీ, దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్షపళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక ఎగరలేక విసిగి,"ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది

అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి ఆశాభంగం చెందినపుడు, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశారో దాన్నే చెత్తది, పనికిరానిది అని అన్నపుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు.

సమయస్ఫూర్తి - అమాయక బ్రాహ్మడు

అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యగ్నంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలపడ్డారు.

మొదటి దొంగ బ్రాహ్మడు దెగ్గిర పడుతుంటే చూసి యెదురొచ్చాడు. వచ్చి, “ఆచర్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు. కొంత దూరమెళ్ళాక రెండొ దొంగ యెదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని యొచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు యెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ యెదురయ్యాడు.

“అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ. ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు… ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నరు.

దుష్టులతో స్నేహం

ఒక రోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయిటికి వచ్చి నక్కను “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాయి.“అయ్యో! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసేయి” అని ఎడుస్తూనే సమధనమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి.

“ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుంతుంటే నేను వద్దన్నాను – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి?” అంది నక్క. “ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు” అని అడిగాయి పీతలు. “తెలీదు, ఎమైనా పని చూసుకోవలి” అని దీనంగా జవబిచ్చింది ఆ నక్క. పీతలన్ని కలిసి అలోచించాయి. “మన వల్లే దీనికీ కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి” అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతఙతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది.

రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది.“ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైన విహరించారా? చాలా బగుంటుంది” అని నక్క పీతలని అడిగింది. భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళ లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడ బయలుద్యారాయి.

కొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలన్ని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హటాత్తుగా అడివిలోంచి చాలా నక్కలు బయిటికి వచ్చి పీతల పైబడ్డాయి. పీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి.ఎలాగోలాగ ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధ పడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్ధమయ్యింది.

మింటూ-చింటూ


మంత్రుల ఉపాయం


మంత్రి సలహా


Thursday, September 12, 2013

బంగారుపళ్లెం

అనగనగా ఒక ఊరిలో సోము అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు సోము తండ్రి పాతకాలం నాటి ఇనుపపెట్టెను శుభ్రం చేస్తూ ఉంటే, సోము దానిలో ఉండే బంగారు పళ్లాన్ని బయటికి తీసి, దానితో ఆడుకోసాగాడు. అది చూసిన తండ్రి సోము వీపు మీద రెండు దెబ్బలు వేసి దాన్ని లాక్కుని, ‘‘ఇది ఆడుకునే వస్తువు కాదు. దీన్ని మన వంశప్రతిష్ఠకి గుర్తుగా తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం.

ఇంకెప్పుడూ దీనితో ఆడకు’’ అని కోప్పడ్డాడు. బంగారు పళ్లాన్ని భద్రంగా పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు, తిట్టిన తిట్లకు సోము చాలా బాధ పడ్డాడు. ఏడుస్తూ ఇంట్లోంచి బయటకు నడిచాడు.

ఊరి చివర తోటలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని బాధపడసాగాడు. అంతలో ఇద్దరు దొంగలు అక్కడికి వచ్చి, ఆ చెట్టుకి మరో వైపున కూర్చున్నారు. వాళ్లు దొంగిలించిన నగల్ని పంచుకోవడానికి గొడవ పడసాగారు. వాళ్ల మాటల్ని జాగ్రత్తగా వింటున్న సోముకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే లేచి చప్పుడు కాకుండా నడుస్తూ అక్కడికి దగ్గర్లో ఉన్న బావి దగ్గరికి వెళ్లి, బావిలోకి చూస్తూ , ‘బంగారు పళ్లెం’, ‘బంగారు పళ్లెం’ అని గట్టిగా ఏడ్వసాగాడు. అది విన్న దొంగలు ఆ బావి దగ్గరికి వెళ్లారు.

సంగతేంటని అడిగారు. ‘‘మా ముత్తాత గొప్ప పండితుడు. అప్పట్లో ఆయనకి రాజుగారు పే...ద్ద బంగారు పళ్లెం బహుమతిగా ఇచ్చారు. మా ఇంట్లో పెట్టెలో ఉన్న ఆ పళ్లాన్ని తీసి, ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంటే అది బావిలో పడిపోయింది. దాన్ని ముట్టుకున్నానని తెలిస్తేనే మా నాన్న కొడతాడు. ఇక అది పోయిందని తెలిస్తే చంపేస్తారు’’ అని సోము పెద్దగా ఏడవసాగాడు. దొంగలకి దాన్ని తీసుకోవాలనే ఆశ పుట్టింది. ‘‘నేను తీసిస్తానంటే నేను తీసిస్తాను’ అంటూ పోటీ పడ్డారు. వాళ్ల చేతుల్లో ఉన్న నగలమూటని కింద పెట్టి ఇద్దరూ బావిలో దూకారు.

సోము వెంటనే ఆ నగల మూటని తీసుకొని ఊరిలోకి పరుగెత్తాడు. ఊర్లో పెద్దలకి దొంగల సంగతి చెప్పి వారిని బావి దగ్గరికి తీసుకుని వచ్చాడు. అందరూ కలిసి దొంగల్ని పట్టుకొని రాజభటులకి అప్పగించారు. ఆ నగలు ఎవరివో కనుక్కొని వారికి అందచేశారు. సోము తెలివిని, సమయస్ఫూర్తిని ఊరివారంతా మెచ్చుకున్నారు. సోము తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు.

రంగు వెలిసిన ఏనుగు

అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను, పొదల్లో అటుఇటు గెంతులేస్తున్న కుందేళ్ళను చూశాక ఆ ఏనుగుకు ‘నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను. హంసలు, కుందేళ్ళు తెల్లగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో!’ అనే ఆలోచన కలిగింది.ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది. కానీ ఎలా మారాలో దానికి తెలియలేదు. ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది.

ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది. స్నేహితుడి కోరిక తీర్చడానికి అది ఒక ఉపాయం ఆలోచించింది. అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్లరంగు డబ్బాలు తెప్పించింది. కోతులతో, ఎలుగుబంట్లతో చెప్పి ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది. నల్లగా ఉన్నది కాస్తా తెల్లగా మారిపోయింది. ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది. తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది.

కొన్నిరోజుల తరువాత ఆ అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది. ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకురమ్మని కొంతమంది భటులను పంపాడు. రాజభటులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ అడవంతా జల్లెడపట్టి వెతకసాగారు. వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అతలాకుతలం అయిపోయింది. అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి. చివరకు తెల్లగా మారిన ఆ ఏనుగును రాజభటులు పట్టుకోగలిగారు.

ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్ళతో కట్టి లాక్కుపోసాగారు భటులు. ఇంతలో వర్షం మొదలయ్యింది. చూస్తుండాగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది. ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్లరంగు కాస్తా కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది. నల్ల ఏనుగును చూసి రాజభటులు ముందు అవాక్కయ్యి తరువాత దాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది. ఉన్న దానితో సంతృప్తి చెందాలే కాని, లేని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది. తన తప్పు తెలుసుకుని గట్టిగా లెంపలు వేసుకుంది.

నిజమైన మేధావి

రాజు తెలివైన కుర్రాడు.ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా అతనికో గొంతు వినిపించింది. అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తోందని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది. ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్ధించింది.

చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏ మాత్రం అనుమానం రాని రాజు సీసామూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ, మధ్య నుంచి ఒక భయంకరమైన భుతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు భయంతో "ఎవరు నువ్వు?" అని అడిగాడు. "నేను భూతాన్ని, ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నేనిప్పుడు స్వేచ్చగా ఉన్నాను. నిన్ను తినేస్తాను" అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం.

తెలివైన రాజు, "నేను నిన్ను నమ్మను. ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు?" అని అడిగాడు. దానికి ఆ భూతం "ఎందుకు ప్రవేశించలేను. కావాలంటే చూపిస్తాను" అంటూ సీసాలోకి ప్రవేశించింది. ఏ మాత్రం ఆలస్యం చెయకుండా రాజు వెంటనే ఆ సీసా బిరడా బిగించేశాడు. అది చూసిన భూతం "దయచేసి నన్ను విముక్తుడిని చెయి. నేను నీకు ఏ మాత్రం హాని చేయను" అని బతిమాలసాగింది. "నేను నిన్ను ఎలా నమ్ముతాను? నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు" అన్నాడు రాజు. భూతం "నేను నీకు అపకారం చెయ్యను. అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారుతుంది" అని చెప్పింది.

దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో... అది చెప్పిన సంగతి కుడా గుర్తుంచుకుని మరి దేనినీ ముట్టుకోకుండా నేరుగా వెళ్లి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారంగా మారింది. అనతికాలంలోనే సంపన్నుడయ్యడు రాజు.

నిజాయతీ

ఒక బాలుడు ఇంటి వసారాలో కూర్చొని శ్రద్ధగా లెక్కలు చేసుకొంటున్నాడు. అవి వాళ్ళ ఉపాధ్యాయుడు ఇంటి వద్ద చేసుకొని రమ్మని ఇచ్చిన లెక్కలు. ఆ బాలుడు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని లెక్కలు చేశాడు. ఆ ఒక్క లెక్క ఎట్లా చెయ్యాలో అతనికి తోచలేదు. అతడు లెక్కల పుస్తకం తీసుకొని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ స్నేహితుడి అన్నగారు ఉన్నారు. ఆయన ఆ లెక్కను ఎట్లా చెయ్యాలో ఆ బాలుడికి చెప్పాడు. అతడు ఇంటికి వచ్చి ఆ లెక్క కూడా చేశాడు.

మరునాడు తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలు ఇంటి వద్ద చేసుకువచ్చిన లెక్కలు చూడటం మొదలు పెట్టాడు. అందరి పుస్తకాలు చూడటం పూర్తి అయింది. అన్ని లెక్కలు సరిగా చేసినవాడు ఈ బాలుడు ఒక్కడే! ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆ బాలుడుకి ఒక బహుమతిని ఇస్తాను అన్నాడు. ఆ బాలుణ్ణి తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయన తన బల్ల సరుగులో బహుమతిగా ఇవ్వతగిన వస్తువును వెదుకుతున్నాడు. ఆ బాలుడు లేచి నిలుచున్నాడు గాని ఉపాధ్యాయుని వద్దకు వెళ్లలేదు. ఉపాధ్యాయుడు తల ఎత్తి చూశాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు.

ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బాలుని వద్దకు వచ్చి, "నాయనా! ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. ఆ బాలుడు, "అయ్యా ! లెక్కలన్ని సరిగా చేశాననిగదా, మీరు నాకు బహుమతి ఇస్తున్నారు! ఈ లెక్కలు అన్ని నేను చెయ్యలేదు. వీటీలో ఒక లెక్క నా స్నేహితుడు అన్న గారి చేత చెప్పించుకొని చేశాను. కనుక ఈ బహుమతిని తీసుకొనటానికి నేను తగను." అన్నాడు. అయితే, ఏడవటం ఎందుకు? అని అడిగాడు ఉపాధ్యాయుడు. లెక్కలన్ని విద్యార్థులు స్వయంగా చెయ్యాలని గదా, మీ ఉద్దేశం? కాని నేను ఒక లెక్కను ఇతరులచేత చెప్పించుకొని చేసి, మిమ్ములను మోసగించాను. అందుకు నన్ను శిక్షించండి. అని బాలుడు ఇంకా ఏడవటం మొదలుపెట్టడు.

ఉపాధ్యాయుడు ఆ బాలుడు తల నిమురుతూ, నాయనా నిన్ను శిక్షించటం కాదు. అభినందించాలి. నీకు బహుమతి తీసుకొనటానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు. అంతకంటే గొప్ప పనికి! నీ "నిజాయితీకి" అని ఆ బాలుడుకి బహుమతిని ఇచ్చాడు ఉపాధ్యాయుడు.

ధర్మరాజు నరక ప్రయాణం

ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజు కు దారి లో వైతరణి నది కనిపిస్తుంది. ఈ నది ఎన్నో వేల వైశాల్యం కలిగి, ఎముకలు,చీము,రక్తము మరియు బురద కలిగిన మాంసము తో నిండి ఉంది. ఈ నది నిండా పెద్ద పెద్ద మొసళ్ళు, మాంసము తినే క్రిములు, విశ్వం లో మాంసాహారం భుజించే సకల జీవాలు అందులో నిక్షిప్తం అయి ఉన్నాయి. దోవ అంతా దుర్గందపూరితం గా ఉంది. దానిని భరించలేక ధర్మరాజు మూర్చపోయాడు. జన్మలో ఎటువంటి తప్పు చెయ్యని నాకు ఈ దురవస్థ ఏమిటని ధర్మరాజు ఇంద్రుని అడిగాడు. అపుడు ఇంద్రుడు ధర్మరాజు తో 'కురుక్షేత్ర సంగ్రామాన, అశ్వద్ధామ హత: అని బిగ్గరగా పలికి, కుంజర: అని హీన స్వరం తో పలికి గురుదేవుని వంచించిన ఫలితమిది' అని చెప్పాడు. అబద్దం ఆడిన వారికే నరక దర్శనం తప్పకపోతే ఇక పాపాలు చేసే వారి పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి

Tuesday, September 10, 2013

మంత్రి పదవి


తెలివి తక్కువ పిల్లులు


బుద్ధిబలం


స్నేహపు సందేశం


జమీందారు పనివాడు


స్వభావం


సాధు స్వభావం


మ్యావ్... మ్యావ్... మ్యావ్...


గురువు


మర్యాదరామన్న తెలివి


తప్పులకు ఆనవాళ్ళు


మామిడి పండ్లు


మంచి పనుల డబ్బా