Pages

Thursday, August 16, 2012

సత్యమేవ జయతే

బోధిసత్వుడు సేరివనే రాష్ట్రంలో సేరివ అనే పేరుతో వర్తకుడిగా ఉంటున్నాడు. అదే పేరుకల మరొక వర్తకుడితో కలసి వ్యాపారానికి బయలుదేరి ఆంధ్రపురానికి చేరుకున్నాడు. వాళ్ళిద్దరిదీ ఒకటే వ్యాపారం కనుక వారి మధ్య ఘర్షణ ఉండకుండా యిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. నగర వీధులలో సగం ఒకరివి, మిగిలిన సగం వీధులు రెండో వారివి. ఒకరొక వీధికొకసారి వెళ్తే తరువాత రెండవ వారు ఆ వీధిలో తాను కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఇదీ ఒప్పందం.

ఆ పట్నంలో బతికిచెడిన వైశ్య కుంటుంబమొకటుంది. ఒకప్పుడు వారు శ్రీమంతులే. కానీ, కాలవశంలో ఆ కుటుంబంలోని వారూ వారి ఐశ్వర్యమూ నశించి ఒక ఒక అవ్వ, అమ్మాయీ మాత్రమే మిగిలారు. ఇద్దరూ కూలిచేసుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ళింట్లో చాలాకాలం నుంచి వాడని ఒక పాత సామాగ్రి పడుండేది. సేరివ ఆ వీధిలో తిరుగుతూ దండలు కావాలా? అంటూ అరవసాగాడు. ఆ అమ్మాయి వర్తకుడి కేక విని అవ్వా! నాకేమయినా కొనిపెట్టవా? అని అడిగింది. ఆ అవ్వ బాధపడూతూ ' తల్లీ! మనకి దుర్గతి పట్టింది. నీకు నేనేమిచ్చి కొనగలను? అంది. అందుకా అమ్మాయి మనింట్లో పనికిరాని పాత్ర పడుందికదా? అంది. అవ్వ ఆ వర్తకుణ్ణి లోపలికి పిలిచి ఆ పాత్ర యిచ్చి అయ్యా ఇది తీసుకొని నీ చెల్లిలికేమయినా యివ్వు, అంది. అతను దానిని చూసి, అటూ యిటూ తిప్పి, శలాకతోగీసి, బంగారు పాత్ర అని గ్రహించి వీరికేమియు తెలిసినట్లు లేదు. ఏమియు యివ్వకుండానే దీనిని పట్టుకుపోవాలి. అనుకుంటూ "ఈ బొక్కి పాత్ర కేమి విలువ? ఇది ఎందుకూ పనికిరాదు గుడ్డిగవ్వపాటయినా చెయ్యదు". అంటూ విసిరేసి వెళ్ళిపోయాడు. కొంతసేపయ్యాక బోధిసత్వుడు కూడా ఆ వీధిలోకి వచ్చి మణికలు(దండలు)కావాలా? అంటూ కేకవేశాడు. మనుమరాలు మునుపటిలాగే అవ్వను కొనమంది.

అందుకా అవ్వ కొనడానికి మనదగ్గరేముంది? ఆ వర్తకుడు పాత్రని నేలకేసి కొట్టిపోయాడు కదా చిల్లిగవ్వకూడా చేయదని? అంది. అవ్వా! అతను దుడుకు స్వభావం కలవాడు. ఈయన యోగ్యుడిలా మంచిగా కనబడుతున్నాడు. లోపలికి పిలువనా అంది. అతన్ని పిలుచుకువచ్చి కూర్చోబెట్టి ఆ పాత్రనిచ్చింది. బోధిసత్వుడు అది బంగారు పాత్ర అని గ్రహించి " అమ్మా! ఈ పాత్ర లక్ష కార్పణములు విలువ చేస్తుంది. దీనికి తూగే వస్తువులు నా దగ్గర లేవు అనేశాడు. అవ్వ ఆశ్చర్యపోయి ఇందాక వేరొక వర్తకుడు వచ్చి యిది అర్థమాషంకూడా విలువ చేయదని నేలకేసికొట్టి పోయాడు. మీ పుణ్యం కొద్దీ యిది బంగారు పాత్రే కావచ్చును. దీనిని మీకిచ్చేస్తాను. బదులుగా మాకేమివ్వగలిగితే అదే యివ్వండి అంటూ ఆమె ఆ పాత్రను అతని చేతిలో పెట్టేసింది. బోధిసత్వుడు తనవద్ద ఉన్న 500 కార్షాణాలనీ, 500 కార్షాపణాలు విలువ చేసే వస్తువులన్నీ యిచ్చి త్రాసు, సంచి, ఎనిమిది కార్షాపణములు (రూపాయిలాంటి ద్రవ్యం) మాత్రము నన్నుంచుకోనివ్వండి అని బంగారు పాత్రని తీసుకువెళ్ళాడు.

కొంత సేపటికి రెండో వర్తకుడు వచ్చి ఆ పాత్ర యివ్వండీ. ఏదో ఒకటిస్తాను. అన్నాడు దయ తలుస్తున్నట్లు. ఆ అవ్వ అతికోపంగా లక్ష కార్షాణముల విలువచేసే పాత్రను అర్ధమాషము విలువ చేయదనిపోయావుకదా? ఒక ధర్మాత్ముడూ, న్యాయమూర్తి వచ్చి వెయ్యి కార్షాణములకు దానిని కొనుక్కువెళ్ళాడు. అని తలుపు వేసింది. అప్పుడాలోభి లక్షచేసేడి బంగారు పాత్రని అతనపహరించి నన్నెంతో నష్టపరిచాడు. అంటూ ఏడుస్తూ, నిగ్రహం కోల్పోయి పిచ్చివాడిలా తన డబ్బూ, సరుకులూ, అక్కడే పారేసి బోధిసత్వుని జాడలను బట్టి నదీతీరానికి చేరుకున్నాడు.

అప్పటికే బోధిసత్వుడు పడవ మీద వెళ్ళి పోతుండటం గమనించి పడవవాడివాడిని వెనక్కి రమ్మని అరిచాడు. బోధిసత్వుడు వొద్దు అన్నాడు. వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ రెండోవర్తకుడు దుఃఖం ఆపుకోలేక గుండెవేడెక్కి బోధిస్త్వుని మీద ద్వేషం పెచ్చు పెరగగా గుండెబరువెక్కి రక్తం కక్కుకుంటూ అక్కడేపడి చచ్చిపోయాడు. బోధిసత్వుడు తన వూరు చేరి దానాలు, పుణ్యకార్యాలుచేస్తూ జీవితం గడిపాడు.       

No comments:

Post a Comment