Pages

Saturday, August 18, 2012

పంచతంత్రం – ౩

బాల్యంలొ అడవిలో నా జాతి వారితో ఆడుతూ హాయిగా స్వేచ్చగా ఉండేవాడిని. ఓ వేటగాడు పన్నిన వలలోని పచ్చికను చూసి దానికై వెళ్ళి ఆ వలలో చిక్కుకున్నాను. ఆ వెటగాడు నన్ను ఆ దేశపు రాజుగారి కొడుకుకి బహుమానంగా ఇచ్చాడు. సైనికులు నన్ను జాగ్రత్తగా చూసుకునే వారు వేళకు ఆహారం అందేట్టుగా చూసేవారు.

ఓరోజు ఊరుచూడాలని కోటలోంచి బయటకు వెళ్ళాను. వీధుల్లోని పిల్లలు నావెంటపడ్డారు. నేను భయంతో పారిపోయి అంత:పురంలోని తోటలోకి వెళ్ళాను. అక్కడి దాసీలు నన్ను పట్టుకుని ఓ చోట కట్టివేసారు. అప్పుడు పెద్ద వర్షం కురవడం మొదలెట్టింది. ఆ వర్షం చూస్తే నాకెంతో ఆనందం కలిగి ’ ఆహ్హా ఈ వర్షంలో తడుస్తూ అడవిలో స్వేచ్చగా గంతులేస్తూ ఉంటే ఎంతహాయిగా ఉంటుంది! ఆ అదృష్టం నాకులేదు! అన్నాను. రాజకుమారుడి గది పక్కనే ఉన్నది. నా మాటలు విని రాజకుమారుడు బయటకు వచ్చి ఒక లేడి మాట్లాడం చూసి ఆశ్చర్యపోయి జోతిష్యుడిని పిలిచి విషయం చెప్పాడు. మృగము మానవ భాషలో మాటలాడటం అరిష్టము. వెంటనే దీన్ని పంపించివేయండి. శాంతి జరిపించండి అన్నాడు ఆ జోతిష్యుడు. సేవకులు నన్ను అడవిలో వదిలేశారు. అప్పుడే మీరు నాకు తరసపడ్డారు. అంటూ తనకథను వారికి వినిపించాడు చిత్రాంగుడు.

అంతలో వీళ్ళకి మంథరుడు ఎదురు వచ్చాడు. “ఎందుకింత సాసం చేశావు? ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? అంటూ ప్రశ్నించాడు హిరణ్యకుడు.

మీరు ఎంతసేపటికీ రాకపోయే సరికి మీకేం ప్రమాదం జరిందోనని ఆందోళనతో ఒక్కడినే ఉండలేక ఇలా వచ్చాను” అంది తాబేలు. నలుగురూ మాట్లాడుకుంటూ నడవసాగారు.

ఆవెటగాడు వీరిని అనుసరిస్తూ రావడం మొదలెట్టాడు. ఆ సంగతి ఎగురుతున్న లఘుపతనం కనిపెట్టి. “వేటగాడు వస్తున్నాడు పారిపొండి” అంటూ కేకలు పెడుతూ ఓ చెట్టుకొమ్మల్లో దాక్కున్నాడు. పక్కనే ఉన్న కలుగులోకి దూరి దాక్కున్నాడు హిరణ్యకుడు. చిత్రాంగుడు వేగంగా పారిపోయాడు. నేలపై వేగంగా నడవలేని తాబేలుమంథరుడు వేటగాడికి దొరికి పోయాడు.

వెటగాడు తాబేలుని పట్టుకుని ఓకర్ర కు కట్టుకిని ఆ కర్ర బుజంపై పెట్టుకుని వెళ్ళసాగేడు.
తమ మిత్రునికి కలిగిన ఆపద చూసి అందరూ ఎంతో విచారించారు.

హిరణ్యకుడు మంథరుడిని విడిపించడానికై ఒక ఉపాయం చెప్పాడు. అది అందరికీ నచ్చింది.
దాని ప్రకారం చిత్రాంగుడు వెటగాడు వచ్చేదారిలో అక్కడికి దగ్గర్లోని చెరువు గట్టుపై చచ్చిన వాడివలె పడుకున్నాడు. కాకి అతడిపై చేరి ముక్కుతో కళ్ళను పొడుస్తున్నట్టుగా నటించసాగాడు.
వేటగాడు ఒడ్డున చచ్చినట్టు పడిఉన్న లేడీని చూసి, దానికోసం తన చేతిలోని తాబేలును నేలపై జారవిడిచి లేడి వద్దకు వెళ్ళాడు.
హిరణ్యకుడు వెంటనే వెళ్ళి తాబేలుని కట్టిన తాళ్ళను కొరికివేశాడు. తాబేలు చట్టుకున చెరువులోనికి వెళ్ళిపోయాడు. లఘుపతనకం కావు మంటూ ఎగిరిపోయింది. ఆసందేశం విని చిత్రాంగుడు మెరపు వేగంతో పారిపోయాడు.

ఇలా ఈ కథ లన్నింటినీ రాజకుమారులకు చెప్పిన విష్ణుశర్మ. మంచి స్నేహితులను సంపాదించుకుని ఒకరికొకరు తోడుగా హాయిగా జీవించాలి. స్నేహితుల వలన కలిగే లాభం ఏమిటో తెలిసింది కదా. అంటూ మిత్రలాభం కథలని ముగించాడు.
అలాగే మంచివారితో మంచి జరిగినట్టే చెడు స్నేహాల వల్ల నష్టం జరుగుతుంది. చెడుస్నేహాల జోలికి పోవద్దంటూ. హితవు పలికాడు.

మిత్రలాభాన్ని తెలుసుకున్నాం. మిత్రభేదాన్ని గురించి చెప్పండి. అంటూ రాజకుమారులు విష్ణుశర్మని అడిగారు.

అలాగే అంటూ మిత్ర భేదాన్ని చెప్పసాగాడు విష్ణుశర్మ.

No comments:

Post a Comment