Pages

Friday, June 14, 2013

రాజు రోగం కుదిర్చిన కూలి

  hyd



రంగన్న అడవిలో నడుస్తూ ఒక చెట్టు క్రింద తపస్సుకు కూర్చున్న ఓ సాధువును చూసాడు. పాము ఒకటి ఆ సాధువు వద్దకు సరసరా ప్రాకి పడగ విప్పింది. సరిగ్గా అదేసమయంలో అటుగా వెళ్లుతున్న రంగన్న ఆ దృశ్యాన్ని చూసి.. ''స్వామీ పాము'' అంటూ పరుగె త్తి ఆ సర్పాన్ని తోకపట్టుకొని గిరగిరా తిప్పి దూరంగా విసిరేసాడు. రంగన్న కేకతో కళ్లుతెరిచి '' పాము కాటు కు గురికాకుండా నన్ను కాపాడావు నీ పేరు? ఏ ఊరు? ఏం చేస్తుంటావు?'' అడిగాడు సాధువు. ''నా పేరు రంగన్న. నాది దగ్గర్లో ఉన్న రంగాపురం, రాళ్ళుకొట్టి వచ్చే కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ చావలేక బతుకుతున్నాను, రెక్కా ఎంత ఆడించినా డొక్కనిండటం లేదు. నాభార్య ఏదో వణుకుడు రోగంతో నీరసించి మంచం పట్టింది. రేపో మాపో అన్నట్టుంది ఆవిడ పరిస్థితి. పిల్లల బాగోగులూ నేనే చూడాలి అనుక్షణమూ ఈ జన్మ ఎందుకేత్తానా? అని పిస్తుంది'' వాపోయాడు రంగన్న '' పరితపించకు పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు, చీకటి తరువాత వెన్నెల రాక మానదు, ఇదిగో ఇది తీసుకో'' అని తన జడల జుట్టులో నుండి ఒక పుల్లను తీసాడు. తన వద్దనున్న ఔషధాలను బాగా నూరి అందులో పుల్లను ఉంచాడు. 

మరుసటి రోజు ఉదయం వచ్చి ఆ పుల్లను తీసుకువెళ్లమని చెప్పాడు. సరే అంటూ ఇంటికి వెళ్లిన రంగన్న ఉదయమే సాధువు వద్దకు రాగ ఔషధగుణాలు నిండిన పుల్లను ఇచ్చాడు సాధువు'' అది మామూలు పుల్లకాదు ఔషధశక్తి గల ఈ పుల్ల ఎటువంటి రోగా నైనా బాగు చేస్తుంది. ఆ పుల్లను రోగి తల మీద ఉంచి బ్రహ్మం, విష్ణుం, మహేశ్వరం' అనాలి, అలా మూడు సార్లు తలమీద ఉంచి త్రిమూర్తులను తలవాలి, రోజూ మూడు పుటలూ అలా చేస్తే మూడు రోజుల్లో వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. ఆ పుల్ల ప్రభావం ముగ్గురు వ్యాధి గ్రస్తులకే పరిమితం.మూడోవ రోగికి వైద్యం ముగిసాక ఆపుల్లను పారే నీటిలో వేయాలి. ఆ పుల్ల గొప్పతనం గుర్తించేవారు దాన్ని కాజేయటానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్త'' అని చెప్పి సాధువు ఆ ప్రాంతం నుంచి వెెళ్ళిపోయాడు.

రంగన్న ఇల్లు చేరి కాళ్ళు కడుక్కొని, భార్యను కళ్ళు మూసుకొని పడుకోమని చెప్పి పుల్లను ఆమె తలపై ఉంచి త్రిమూర్తులను తలచి, అలా మరో రెండు దఫాలతో ఆరోజు ప్రక్రియను పూర్తి చేసాడు. ఉదయాన్నే భార్య రత్తాలు నాకళ్ళల్లో నీరు కారటం లేదు. వొంటి వొణుకూ ఆగి పోయింది' అంది. సాధువు ఇచ్చిన పుల్ల పనిచేస్తున్నదని గ్రహించాడు. రెండో రోజు ఆమె లేచి కూర్చుంది. మూడో రోజు లేచి నడవటమేగాక ఇంటి పనులన్నీ చేయసాగింది రత్తాలు. గోరంత పుల్ల చేసిన మేలుకు కొండంత సంబరపడ్డాడు రంగన్న.

రాజుగారు గుర్రమెక్కబోయి కాలు జారి కిందపడి వెన్ను పూసవిరిగి మూలుగుతూ చిక్కిశల్యమై శయ్య మీద ఉన్నాడని వైద్యులె వ్వరూ, చివరకు ఎంతో పేరున్న రాజు వైద్యుడూ నయం చెయ్యలేక పోయాడని ఆనోట, ఈనోట రంగన్నకుతె లిసింది. రాజును రక్షిస్తే తనకు గుర్తింపు ఉంటుందని మరుసటి రోజే నగరానికి బయలుదేరాడు. 

ద్వారపాలకులు రంగన్నను రాజభవనంలోనికి వె ళ్ళనివ్వలేదు. రంగన్న రాజవైద్యుడు రాంభట్టు ఇంటికి వెళ్ళి తనకు అవకాశం కల్పిస్తే తనవైద్యంతో రాజుకు నయం చేస్తానన్నాడు. రాంభట్టు రంగన్నకు ఒకరోగిని చూపి 'ఆమె నా చెల్లెలి కూతురు ఊర్మిళ . ఏడాదిగా మతిస్థిమితం లెెదు. ఎవ్వరినీ గుర్తు పట్టడం లేదు. ముందుగా ఆమె జబ్బు నయంచేస్తే నీకు రాజుగారికి వైద్యం చేసే వీలు కల్పిస్తాను' అన్నాడు . సరే అని రంగన్న ఆమెకు వైద్యం చేశాడు. 

నాలుగో రోజు ఊర్మిళ రాంభట్టును చూసి ''మామయ్యా బాగున్నావా?'' అంటూ పలుకరించింది. ఇంట్లోవారందరినీ గుర్తించింది. రంగన్న తన వైద్యం తో ఊర్మిళ తలకు పుల్లతాకించటం, త్రిమూర్తులను స్మరించటం, ఏమందూ మాకూ వాడకపోవటం గమనించాడు రాంభట్టు . పుల్లలో ఏదో మహిమ ఉందని భావించాడు. ''రంగన్నా నిన్ను రాజువద్దకు తీసుకెళ్ళటానికి దినాలు బాగా లేవు మూడు రోజులు ఆగు'' అన్నాడు. ఆ రాత్రి కొక్కేనికి తగిలించిన రంగన్న చొక్కా జేబులోని పుల్లను తీసుకొని దానిస్థానంలో మరోపుల్లను ఉంచాడు. తాను దొంగిలించిన పుల్లతో మూడురోజులు రాజు వైద్యం చేసాడు. కానీ రాజు ఆరోగ్యపరిస్థితిలో మెరుగుదలలేదు ''రాంభట్టూ, నీవు నాజేబులోనుండి తీసుకెళ్ళింది నకిలీ పుల్ల. అసలు పుల్లను జేబులో పెట్టడానికి నేనేమైనా వెెర్రి వాడినా? పుల్లకాజేయటంలో నీ అల్పబుద్ధి బయటపడింది. నకిలీ పుల్లతో రాజుకు ఎలా బాగావుతుంది.'' అని రంగన్న రాంభట్టును నిలదీశాడు. తమ తప్పు తెలుసుకున్న రాంభట్టు చివరకు రాజు జబ్బునయం అయితే..ఆయన ఇచ్చే బహుమతిలో సగం తనకు ఇవ్వాలన్న షరతుతో రంగన్నను రాజుకు పరిచయం చేసాడు. పెట్టాడు. రాజు అసహనంతో 'రాంభట్టూ! నా వ్యాధి నయం చేయటం నీ వల్లే కాలేదు. ఇతని వల్ల ఏమౌతుంది? ఇక నాకు వల్ల కాడే గతి? అని నిరాశగా అన్నాడు రాజు. మీ వ్యాధిని పూర్తిగా నయం చేస్తాను నమ్మండి'' అన్నాడు రంగన్న ''ఏ పుట్ట లో ఏ పాముందో ..సరే కాని వ్వు '' అన్నాడు రాజు. రంగన్న దాచుకున్న అసలు పుల్లను తీసి రాజు తలపై ఉంచి బ్రహ్మ, విష్ణుం, మహేశ్వరం అన్నాడు . ముప్పొద్దుల వైద్యం ముగిసి తేల్లారగానే రాజుకు వెన్ను నొప్పి పోయింది. ఊరటచెందిన రాజు మనసు ఉత్సాహంతో ఉల్లాసంతో ఉప్పొంగింది. రెండో రోజు కాళ్ళునొప్పులు, కీళ్ళు నొప్పులు తొలిగిపోయాయి, మూడవరోజు లేచి మునుపటిలా నడిచేస రికి రాజు ఆనందం అంబరాన్ని తాకింది. ''రంగన్నా! అద్భుత మైన నీవైద్యంతో నా ప్రాణాలు నిలిపావు. నీవు మరో రాజు వైద్యునిగా ఇక్కడే ఉండిపో '' అన్నాడు రాజు. ''మహరాజా! నేను వైద్యుణ్ణికాను, రాళ్ళు కొట్టి బతికేవాణ్ణి అని తాను సాధువును పాము కాటు నుంచి కాపాడింది లగాయితు జరిగిందంతా పూసగుచ్చినట్టు చె ప్పాడు రంగన్న. 'అలాగా ఎలాగైతేనేం నాకు పునర్జన్మనిచ్చావు. నీకేం కావాలో కోరుకో' అన్నాడు రాజు. నాకు ఏమీ వద్దు ఏమి తీసుకున్నా అందులో నాకు దక్కేది సగమే. నా వల్ల తమ వ్యాధినయమైతే మీరు నాకే దైనా బహుమతి ఇస్తే అందులో ఆయనకు అర్ధభాగం ఇవ్వాలని రాంభట్టు మీకు నాతో వద్యం చేయించటానికి షరతుపెట్టాడు' అన్నాడు రంగన్న. అప్పుడే వచ్చిన రాంభట్టు, రాజులేచి నడవటం చూసి ఆశ్చర్యపోయాడు. అతణ్ణి చూడగానే రాజు ఉగ్రుడయ్యాడు.

'' రాంభట్టూ! ఈ రంగన్న నీ మేనకోడలి రోగం నయం చేసాడన్న విశ్వాసం లేకుండా నా వ్యాధి బాగైతే నేను తనికిచ్చే కానుక సగం వాటా ఇవ్వాలన్నావట? నిన్ను రాజ వైద్యుని పదవి నుండి తొలగిస్తున్నాను. పదివేలవరహాలుతో సత్కరించి రంగాపురంలో అతనికి పది అంకణాల మిద్దె, పదె కరాల మాగాణితో పాటు పశుసంపదను బహుమతిగా ఇచ్చాడు. రాజు ఇచ్చిన బహుమానాలతో బయలుదేరిన రంగన్న ఊరు చివరన ఉన్న ఏరు ముందు నిలిచి పుల్లను కళ్ళకద్దుకుని స్వామీ! నీ కరుణతో నా జీవితానికి దారీ తెన్నూ ఏర్పడింది కృతజ్ఞుణ్ణి '' అని పుల్లను నీటిలో విడిచాడు. 

No comments:

Post a Comment