Pages

Friday, August 17, 2012

మిత్ర లాభం :

పూర్వం  గోదావరి  ఒడ్డున  పెద్ద బూరుగు చెట్టు ఒకటి ఉండేది.  ఆ చెట్టుపై లఘుపతనకము  అనే కాకి  నివసిస్తూ  ఉండేది.  అది ఓరోజు  ఉదయాన్నే  నిద్రలేచి  తన గూడు లోంచి బయటకు వచ్చి   ఓ వేటగాడిని చూసింది.  తెల్లవారగానే  మొదట వీడి మొహం కనిపించిందే  ఈ రోజు ఏంజరుగనుందో  అనుకుంటూ  వేటగాడినే  గమనించసాగింది  కాకి.   వాడు చెట్టు పక్కనే వల పరచి దానిపై  నూకలు జల్లి  ఓ పొదలో దాక్కుని ఉన్నాడు.
చిత్రగ్రీవుడు  అనే పావురం  మిగతా తోటి  పావురాలతో కలిసి అప్పుడే అటుగా ఎగురుకుంటూ  వచ్చి  కింద నేలపై ఉన్న నూకలు చూసి   “ఎవరూ లేని ఈ అడవిలోకి ఈ నూకలు ఎలా వచ్చాయి!  ఇదేదో మోసంలా వున్నది,  వీటికి ఆశపడి పోయామంటే   బంగారు కంకణానికి ఆశపడి  ప్రాణాలు పోగొట్తుకున్న  బాటసారలా  అవుతుంది.  కనుక ఎవరూ  కిందకు దిగకుండా   ముందుకే వెళ్ళండి”  అని అచెప్పాడు.

మిగతా పావురాలన్నీ   “ బంగారు కంకణమేమిటీ, ప్రాణాలు పోటంఏమిటి!”  ఆ  కథ చెప్పమని  చిత్రగ్రీవుడిన అడిగాయి.

2 comments: