Pages

Friday, August 17, 2012

బాటసారి – బంగారు కంకణం

ఓ పులి ముసలిదైపోయి వేటాడే శక్తి లేక,  ఆకలితో  బాధ పడసాగింది.  శారీరక శక్తి లేక  బుద్దితో  ఆహారాన్ని సంపాదించాలని అనుకుంది.  ఉపాయంతో  ఓ బంగారు కాంకణాన్ని  చేత పట్టుకుని  చెరువు గట్టు పై కూర్చుంది.
ఆ దారిలో  వెళుతున్న ఓ బాటసారి  పులి చేతిలోని బంగారు కాంకణాన్ని చూసి  ఆగాడు.  పులి సంతోషంతో  “నా దగ్గరకి రా వచ్చి ఈ బంగారు కంకాన్ని తీసుకో” అంది.

అందుకు  బాటసారి “కౄర జంతువువైన నిన్ను నమ్మి దగ్గరికి వస్తే నువ్వు నన్ను చంపేస్తావేమో” అన్నాడు.
దానికి పులి   “నేనింత కాలం ఎన్నో జీవులు చంపి తిన్నందుకు పశ్చాతాప పడుతున్నాను, ఇప్పుడు ములిదాన్ని అయ్యాను. వంట్లో బలం లేదు. నా పాపాలను తొలగించుకోవటానికి  ఈ బంగారు కంకణాన్ని దానం చేద్దానుకుంటున్నాను.  ఆ చెరువులో స్నానం చేసివచ్చి ఈ బంగారు కంకణాన్ని తీసకో నాకు పుణ్యం లభిస్తుంది  సంశయించకు”  అంది.

బాటారికి పులి మలు నమ్మకం కలిగించాయి. స్నానానికని చెరువులో దిగి బురదలో కూరుకుపోయాడు. అది చూసి పులి  బయటకు లాగుతానని చెప్పి  చంపి తినేసింది.

“అత్యాశకు పోయి కౄర జంతవున నమ్మి ఈ గతి తెచ్చుకున్నాను, ఉచితంగా వస్తున్న దానికి   ఆశపడరాదు”  అనుకుంటూ  పులికి ఆహారమైనాడు బాటసారి.

ఆ కథ చెప్పి  చిత్రగ్రీవుడు “కనుక ఆ నూకలపై మనకు ఆశ వద్దు. వాటి వెనుక  ఏ ఆపద ఉందో తెలిదుకదా!”  అన్నాడు.

దానికి వాటిలోని  ఓ వృద్దపావురం  “ఎక్కడో  ఏదో జరిగిందని  కళ్లఎదుట ఉన్న  ఆహారాన్న  వదులుకోవటం ఎందుకు?  ఇలా ప్రతిదాన్ని  అనుమానిస్తే సుఖం లేదు.  వెళ్లి ఆ నూకలు తింద్దాం పదండి.”  అంది.

ముసలి పావురం మాటలు విన్న పావురాలు  ఆశతో ఆహారంకై వెళ్లి ఆ వలలో చిక్కుకుని పోయాయి.  అప్పుడు వాటికి చిత్రగ్రీవుడి మాటల్లో నిజమేమిటో తెలిసింది.

” బుద్ది ఉన్నవాడే వృద్దుడు  గాని నీలా వయసు  ఉన్న వాడ వృద్దుడా! నీ మాటలు నమ్మి చిక్కలో పడ్దాం”  అని ఆ ముసలి పావురాన్ని నిందించాయి.

దానికి  చిత్రగ్రీవుడు  “అతడిని అనటమెందుకు? మన బుద్ది ఏమయినట్టు.  ఇలాంటప్పుడే ఉపాయం ఆలోచించాలి, నేనొక ఉపాయం చెపుతాన,  మమందరం ఒక్కసారిగా  ఎగిరి  వలను మనతో తీసుకు వెళదాం. అందరూ ఒక్కసారిగా రెక్కలుకదల్చి పైకి ఎగరండి”   అన్నాడు.

అందరూ కలిస్తే ఎంతటి పనినైనా  సునాయాసంగా చేయవచ్చు,ఆన్న మాటలు నచ్చి  పావురాలన్నీ  వలతో పాటు ఆకాశ మార్గాన ఎగిరాయి.

వేటగాడు  ఆశ్చర్యపోతూ ఐకమత్యాన్ని మించిన బలమేమున్నది! అనుకున్నాడు.

“ఇప్పుడు మనమేం చేద్దాము, ఇలా ఎంతసేపని ఎగరగలము” అంటూ  మిగతా పావురాలు చిత్రగ్రీవుడిని అడిగాయి.
“ఇక్కడికి దగ్గరలోనే హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నాడు అతడు నాకు సన్నిహిత మిత్రుడు.  అతడు ఈ వలను కొరికి మనకు సహాయం చేయగలడు, ఈ లోకంలో ఎవరికైనా తల్లి తండ్రులు, స్నేహితులే నమ్మదగిన వారు.”  అన్నాడు చిత్రగ్రీవుడు.

అన్నీ కలిసి ఎగురుతూ  హిరణ్యకుడి  కలుగు దగ్గరకు వెళ్ళాయి.  హిరణ్యకుడు స్నేహితుడికి కలిగిన కష్టాన్ని చూసి విచారించి తన పళ్ళతో ఆ వల కొరికి వాళ్ళను బంధ విముక్తులను చేసాడు.

కనుక బుద్దిమంతుడైన వాడు  “మొదట మంచి స్నేహితులను సంపాదించుకోవాలి..”  అంటూ  మిత్ర లాభం  గురించి రాకుమారులకు చెప్పాడు విష్ణుశర్మ.

No comments:

Post a Comment