Pages

Monday, August 13, 2012

పంటలో వాటా

నజీరుద్దీన్‌ ముల్లాగా మారాక స్వంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకు వ్యవసాయం బావుంటుందని అనుకున్నాడు. ఒక ఆసామి దగ్గరకు వెళ్ళి, పొలం అద్దెకిస్తే వ్యవసాయం చేసుకుంటానన్నాడు.

ఆ ఆసామి జిత్తులమారి. నజీరుద్దీన్‌ వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి, "అలాగే!నా భూమిలో నీవు పంట వేసుకో. కాని అద్దె కట్టాలి"అన్నాడు.

"అలాగే.అద్దె ఎంత?" అడిగాడు నజీరుద్దీన్‌.

"పొలం పండిన తర్వాత, భూమిపైన ఉన్న పైరంతా నాకిచ్చేయాలి. అదే అద్దె" అన్నాడు. ఆ కుటిల ఆస్వామి.

" అలాగే". అని నజరుద్దీన్‌ ఆ రోజునుండే పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు.

కొంతకాలానికి పొలం పండే సమయం వచ్చింది. కోత కూడా అయిపోయిందని తెలిసిన ఆసామీ తన వాటా కోసం నజరుద్దీన్‌ దగ్గరకి వెల్లాడు.

"భూమిపైన ఉన్న పైరంతా కోసి సంచుల్లో ఎక్కించాను. తీసుకువెల్లండి"అన్నాడు.

ఆసామి సంచుల్లో చూస్తే అన్నీ ఆకులే ఉన్నాయి. తనను మోసం చేశాడని న్యాయ మూర్తి దగ్గర ఫిర్యాదు చేశాడు.

ఆయన నజీరుద్దీన్‌ని కూడా పిలిపించి విచారించాడు."

ఈ ఆసామి చెప్పేది నిజమేనా?" అని అడిగాడు.

"అవును. నిజమే" అన్నాడు నజీరుద్దీన్‌.

"మరి మోసం చేశావెందుకు?" అడిగాడు. మోసం ఏం ఉంది? ఆయన భూమిపైన పైరు కావాలన్నాడు. నేను వేరుశనగ వేశాను. ఆయన కోరినట్టే భూమిపైనదంతా ఆయన కిచ్చి, గింజలు నేను తీసుసున్నాను". అన్నాడు నజీరుద్దీన్‌.

నజీరుద్దీన్‌ తెలివికి న్యాయమూర్తి మెచ్చుకుని, అన్యాయమైన వాటా అడిగినందుకు ఆసామిని చీవాట్లు పెట్టాడు.

No comments:

Post a Comment