Pages

Saturday, September 15, 2012

న్నాదాయ్‌ అనుపమ త్యాగం


రాణా సంగ్రామసింగ్‌ రాజస్థాన్‌లోని మేవార్‌ను పరిపాలించి దాదాపు ఐదు వందల సంవత్సరాలు గడిచిపోయూయి. ధైర్యసాహసాలకూ, ధర్మ పాలనకూ పేరొందిన ఆయన పేరు వినగానే ప్రజలు ఆయన పట్ల గౌరవ మర్యాదలు కనబరచేవారు. బాబర్‌ భారతదేశంపై దండయూత్ర చేసి. 1526 ఏప్రిల్‌ 21వ తేదీ జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంలోడీని ఓడించాడు.
 
ఢిల్లీని, ఆగ్రాను వశపరచుకుని మొగల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాక, బాబర్‌ దృష్టి రాజస్థాన్‌ మీదికి మళ్ళింది. మొగల్‌ సేనలను రాజపుత్ర సైనికులు దీటుగా ఎదుర్కొని అసమాన ధైర్యసాహసాలతో పోరాడారు. అయినా, తన సైన్యంలోని ఒక దళనాయకుడి ద్రోహం కారణంగా రాణా సంగ్రామసింగ్‌ దాపులనున్న కొండలలోకి తప్పించుకుని పోవలసివచ్చింది.
 
మొగలులపై ఎలాగైనా పగసాధించాలన్న పట్టుదలతో ప్రయత్నించినప్పటికీ రాణా 1527లో మరణించాడు. ఆ తరవాత బాబర్‌, వాటిల్లిన సైనిక నష్టాలు చాలనుకుని రాజపుత్ర వీరులను వేధించకుండా వాళ్ళు ప్రశాంతంగా జీవించేలా ఢిల్లీకి తిరిగి వెళ్ళాడు. రాణా సంగ్రామసింగ్‌ జ్యేష్ఠకుమారుడు రత్నసింగ్‌ మేవార్‌ పాలకుడయ్యూడు. అయితే, పొరుగు ప్రాంత యువరాజుతో జరిగిన గొడవలో అతడు మరణించడంతో, అతడి తమ్ముడు విక్రమ్‌జిత్‌ సింహాసనాన్ని అధిష్ఠించాడు.
 
అతడు దురహంకారీ, ప్రజాక్షేమం పట్ల శ్రద్ధ లేనివాడూ, వినోద ప్రియుడూ కావడంతో సదా సర్వవేళలా మల్లయుద్ధాలు, ఆటల పోటీలు అంటూ వినోదకార్యక్రమాలతో కాలక్షేపం చేసేవాడు. దానికి తోడు సామంతులనూ, ప్రముఖులనూ గౌరవించేవాడు కాడు. పూచిక పుల్లతో సమానంగా చూసేవాడు.

దాంతో మేవార్‌లో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటిని అవకాశంగా తీసుకుని గుజరాత్‌ సుల్తాన్‌ బహదూర్‌షా మేవార్‌ రాజధాని చిత్తోర్‌ను ముట్టడించాడు. రాజపుత్ర యోధులు ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడారు.అయినప్పటికీ ఓటమి తప్పదన్న సంకటస్థితి ఏర్పడగానే-శత్రువుల బారినుంచి తప్పించుకోవడానికి చిత్తోర్‌ కోటలోని పధ్నాలుగువేల మంది స్ర్తీలు ‘జోహర్‌' అనే అగ్ని ముట్టించి అందులో ధైర్యంగా ప్రవేశించి ప్రాణత్యాగం చేశారు.
 
ఆ వీరోచిత కృత్యాన్ని చేయించింది రాణా సంగ్రామ సింగ్‌ వీరపత్నీ, చంటిబిడ్డగా వున్న యువరాజు ఉదయ్‌ సింగ్‌ తల్లీ అయిన రాణి కర్నావతి. తండ్రి మరణించాక జన్మించిన ఉదయ్‌సింగ్‌ను రహస్యంగా సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఆ తరవాత మొగలులు విక్రమ్‌జిత్‌కు సింహాసనం అప్పగించినప్పటికీ, ప్రజలు అతడి దుష్టపాలనను భరించలేకపోయూరు. సింహాసనానికి వారసుడైన ఉదయ్‌సింగ్‌ పెద్దవాడయ్యేంతవరకు పాలనా బాధ్యతలు ఎవరు చూసుకోగలరు? రాణాసంగ్రామసింగ్‌ తమ్ముడు పృధ్వీరాజ్‌ కుమారుడైన బన్‌బీర్‌ను పాలనా బాధ్యతలు చేపట్టమని రాజపుత్ర ప్రముఖులు కోరారు.
 
అందుకు అతడు అంగీకరించాడు. పాలనా బాధ్యతలు చేపట్టిన బన్‌బీర్‌కు తనే రాజుగా స్థిరపడాలన్న దురాశపుట్టుకురావడంతో అందుకు అవరోధంగా ఉన్న రాణాసంగ్రామసింగ్‌ ఇద్దరు కుమారులను తొలగిం చాలనుకున్నాడు. ప్రజల ద్వేషానికిగురై, రాజ్యం వదిలి పారిపోనున్న సమయంలో, బన్‌బీర్‌ విక్రమజిత్‌ను హతమార్చాడు. ఇక మిగిలి ఉన్నది ఒక్క పసికందు ఉదయ్‌సింగ్‌ మాత్రమే. ఆ శిశువును హతమార్చడానికి క్రూరుడైన బన్‌బీర్‌ దుష్టపథకం వేశాడు. ప్రశాంతమైన రేయి. చిత్తోర్‌ కోట అంతఃపుర భవనం నుంచి తియ్యటి జోలపాట లీలగా వినిపిస్తోంది.

రాకుమారుడు నిదిరిస్తూన్న రత్నాలు పొదిగిన అందమైన ఉయ్యూలను ఊపుతూ జోలపాడుతూన్న పన్నాదాయ్‌ చేతిలో రాకుమారుడి ఈడువాడే అయిన ఆమె సొంత బిడ్డ కూడా ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో హడావుడిగా వచ్చిన ఒక సేవకుడు ఆమె చెవిలో ఏదో చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె ముఖం వెలవెలపోయింది. వెంటనే ఆమె చేతిలోని తన బిడ్డను ఉయ్యూలలో పడుకోబెట్టింది.
 
ఉయ్యూలలోని రాకుమారుడి ఆభరణాలను, దుస్తులను తీసి తన బిడ్డకు తొడిగింది. రాజభవనంలోని వంటవాణ్ణి పిలిచి పళ్ళబుట్టను తెమ్మని చెప్పి, రాకుమారుణ్ణి అందులో సుతారంగా పడుకోబెట్టి, బుట్టను ఆకులతో కప్పింది. బిడ్డను రహస్యంగా కోటనుంచి తీసుకువెళ్ళమని వంటవాణ్ణి వేడుకున్నది. కొంతసేపటికి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ రాజప్రతినిధి బన్‌బీర్‌ అక్కడికి వచ్చాడు. క్రూరమైన చూపులతో కత్తి దూసి పసికందు గుండెల్లో గుచ్చి చంపి, వచ్చిన వేగంతో తిరిగి వెళ్ళిపోయూడు.
 
యువరాజు మరణించాడని రాజకుటుంబీకులు భోరునవిలపిస్తూండగా, పన్నాదాయ్‌, కళ్ళెదుట చంపబడ్డ పుత్రశోకాన్ని దిగమింగుకుని రాజభవనం నుంచి వేగంగా వెలుపలికి నడిచింది. ఆమె నదీ తీరానికి చేరేసరికి అక్కడ విశ్వాసపాత్రుడైన వంటవాడు బుట్టతో సిద్ధంగా ఉన్నాడు. అదృష్టవశాత్తు బిడ్డ మేలుకోలేదు. వాళ్ళు వేగంగా డోలాకు వెళ్ళి యువరాజుకు ఆశ్రయం వేడుకున్నారు.
 
యువరాజు పట్ల సానుభూతి ఉన్నప్పటికీ దుర్మార్గుడైన బన్‌బీర్‌కు భయపడి ఆశ్రయం ఇవ్వలేనని తన నిస్సహాయతను తెలియజేశాడు అక్కడి పాలకుడు. పన్నా రైతుమహిళ వేషంతో బిడ్డనెత్తుకుని, వంటవాణ్ణి వెంటబెట్టుకుని డోంగర్‌పూర్‌కు బయలుదేరింది. ఆశానిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ కొండ మీది భవనం చేరిన ఆమెకు ఆశాభంగమే ఎదురయింది. పరమకిరాతకుడైన బన్‌బీర్‌ ఆగ్రహానికి గురికాలేనని సామంత రాజు రావల్‌ అయిస్కుర్‌‌న నిర్దాక్షిణ్యంగా ఆమెను పంపేశాడు.
 
మేవార్‌ రేపటి రాజును ఎలాగైనా సురక్షితమైన చోటికి చేర్చాలన్న పట్టుదలతో నిద్రాహారాలు, శ్రమ, అలసట లెక్కచేయకుండా పన్నా కొండలూ కోనలూ దాటుకుంటూ ఆరావళీ పర్వతశ్రేణులలోని కొముల్మేర్‌ కేసి నడవసాగింది. హఠాత్తుగా వంటవాడు తీవ్రమైన జ్వరానికి లోనయ్యూడు. దయూహృదయులైన భిల్లులనే స్థానిక గిరిజనులు అతడికి తాము సాయపడగలమని చెప్పి, పన్నాకు దారిచూపి సాగనంపారు. తెలతెలవారుతూండగా చిన్న కొండమీది కొముల్‌మేర్‌ రాజభవనం బాదల్‌మహల్‌ కనిపించగానే పన్నాకు కొత్త ఆశలు చిగురించాయి.

రాజు అస్సాసాహ్‌ ఆమెను కరుణతో ఆదరించాడు. చిత్తోర్‌కు పట్టిన దుర్గతిని వివరించిన పన్నా, ‘‘ఈ చిన్నారి యువరాజును సురక్షితమైన తమ రక్షణలో ఉంచితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు,'' అన్నది సజల నయనాలతో. అస్సాసాహ్‌ ఏమిచెప్పడానికీ తోచక ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆయన తల్లి, ‘‘దీనికెందుకు ఇంత ఆలోచన? ఈబిడ్డ రాణాసంగ్రామసింగ్‌ కుమారుడు. నీకు రాజు.
 
రాజుపట్ల విశ్వాసం ఉన్నవాడికి భయం అన్నది ఉండకూడదు. నీ ఎదుట నిలబడ్డ పన్నా ఒక సాధారణమైన దాది. ఆమె చేసిన నిరుపమాన త్యాగం; కనబరచిన అసమాన ధైర్యం; పడ్డ కష్టాలు చూశాక కూడా నీలో ఎందుకీ సందిగ్థత?'' అన్నది రాజుతో. అప్పుడాయన బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని, ‘‘ఈ చిన్నారి యువరాజు సంరక్షణా బాధ్యతనాది. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా,'' అని పన్నాకు మాట ఇచ్చాడు.
 
పన్నా ఆ మాటలకు పరమానందం చెంది, బిడ్డను తీసుకుని మరొక్కసారి ఆప్యాయంగా హృదయూనికి హత్తుకుని రాజుచేతికిచ్చింది. బిడ్డను ఆప్యాయంగా రెండుమూడుసార్లు చేత్తో నిమిరింది. కన్నీటితో రాజుకు కృతజ్ఞతా పూర్వకంగా చేతులెత్తి నమస్కరించి, రాణిగారికిచ్చిన మాటను నిలుపుకున్నామన్న తృప్తితో భవనం నుంచి వెలుపలికి నడిచింది. ఏడేళ్ళు గడిచిపోయూయి. తన ఈడువాడే అయిన అస్సాసాహ్‌ కుమారుడితో కలిసి ఉదయ్‌సింగ్‌ పెరగసాగాడు.
 
ఒకనాడు రాజభవనానికి అతిథిగా వచ్చిన అస్సాసాహ్‌ మిత్రుడైన ఒక రాజపుత్ర ప్రముఖుడు ఉదయ్‌సింగ్‌ను చూసి ఆశ్చర్యపడి, ‘‘ఎవరీ రాజకుమారుడు?'' అని అడిగాడు. అస్సాసాహ్‌కి అసలు సంగతి చెప్పక తప్పలేదు. రాజపుత్ర ప్రముఖుడు ఉదయ్‌సింగ్‌కు నమస్కరించాడు. అచిర కాలంలోనే ఆ సంగతి అందరికీ తెలిసిపోయింది.
 
మేవార్‌ ప్రముఖులు, చుట్టుపక్కల నాయకులు న్యాయబద్ధమైన యువరాజుకు తమ మద్దతును తెలియజేశారు. పరమ దుష్టుడూ, దురహంకారీ అయిన బన్‌బీర్‌ పట్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత బయలుదేరింది. పసి యువరాజు నాయకత్వంలో పెద్ద సైన్యం చిత్తోర్‌ కోటను ముట్టడించింది. బన్‌బీర్‌ సైన్యాన్ని ఎదుర్కోలేక ఓటమి భయంతో పారిపోయూడు. ప్రజల ఆనందోత్సాహాల మధ్య రాణా ఉదయ్‌సింగ్‌ 1597లో మేవార్‌ సింహాసనాన్ని అధిరోహించాడు.

No comments:

Post a Comment