Pages

Friday, January 11, 2013

డి విటమిన్ లోపం

డి విటమిన్ లోపిస్తే ‘ రికెట్స్ ’ అనే ఎముకల జబ్బు ఏర్పడుతుంది. ఇది పిల్లలో వస్తుంది. డి విటమిన్ లోపంతో బాధపడే పెద్దలలో కూడా కొన్ని మార్పులు కనబడతాయి. అయితే అవి రికెట్స్ కి భిన్నమయినవి. రికెట్స్ పీడిత పిల్లలు కొన్ని ప్రత్యేక గుర్తుల్ని అక్షణాలను ప్రదర్శిస్తారు. మొదట్లో వీరికి విపరీతంగా చెమటలు పడతాయి. కడుపునొప్పి కూడా రావచ్చు. అయితే అధిక మార్పులు ఎముకలలో చోటుచేసుకొంటాయి.

 పుర్రె మెత్తగా వుండిపోతుంది. మూసుకోవడానికి, గట్టిపడడానికి ఫాంటానెల్ కి ఎక్కువ సమయం పడుతుంది. పుర్రె కన్పించేటట్లుగా తల వింత ఆకృతిని ధరిస్తుంది. దంతాలు పెరగడం ఆలస్యమవుతుంది. లేదా అవి అర్థంతరంగా పెరిగిపోతాయి. పక్కటెముకలు ప్రబావితమవుతాయి. చేతియెక్క పొడవాటి ఎముకలు అస్తవ్యస్తంగా పెరుగుతాయి. రికెట్స్ పీడిత పిల్లలలో వుబ్బిన మణికట్టులను మనం చూడవచ్చు. ఎముకలు మెత్తబడి, వంగి, వింత ఆకృతులు దాల్చుతాయి. పిల్లవాడు నడవడం ప్రారంబించగానే దేహబరాలనికి కాలి ఎముకలు విల్లు ఆకృతిని దాల్చుతాయి. 

వీటిని విల్లు కాళ్లు అని పిలుస్తారు. ఎముకలలో ఏర్పడే ఇవి శాశ్వతమైన మార్పులు. శరీరంలో ఎండలో ఉన్నపుడు, శరీరమే డి. విటమిన్ ను తయారుచేసుకుంటుంది. మన దేశంలో ఎండ కావలసినంత దొరుకుంతుంది. సరయిన గాలి చోరవ, ఇరుకయిన ఇళ్లో వుండే పిల్లలను బయటకి పంపి, ఎండలో తిరగనీయకపోతే, ఆ పిల్లలు కూడా ఈ వ్యాధికి గురుయ్యే అవకాశం ఉంది. మరో కారణం కూడావుంది. మొదటగా, రికెట్స్ డి. విటమిన్ ను లోపంవల్ల వస్తుంది.

అయితే పిల్లల్ని ఎండలో తిరగనిచ్చి వారిలో డి. విటమిన్ తయారయ్యే అవకాశాన్ని కల్పించినా మరొక ఇబ్బంది కూడా వుంది. శరీరానికి తగినంత కాల్షియ ఫాస్ఫరస్ అందాలి. లేకపోతే శరీరం డి.విటమిన్ ను ప్రయోజనాన్ని పొందలేదు. పిల్లలను ప్రతి రోజూ కొంత సమయంలో తిరగీయడము వాళ్ల ఆహారంలో పాలు, రాగులు చేర్చి తగినంత కాల్సియం, ఫాస్ఫరస్లు అందేటట్లు చేయడము చాలా మంచిది.   

No comments:

Post a Comment