Pages

Friday, January 11, 2013

రాజుగారు – తెల్లవెంట్రుక

చాలాకాలం క్రితం మనిషి ఆయురార్థయం ఇప్పటికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండేది, ఆ కాలంలో ప్రజలు వేల సంవత్సరాలు జీవించేవారు. ఆ కాలంలో జన్మించినవాడే ఈ కథలోని మఖదేవుడు. ఆయన బాలుడిగా 84.000 సంవత్సరాలు ఉండి, ఆ పైన యువరాజుగా కిరీటధారణ చేశాడు. యువరాజుగా 80,000 సంవత్సరాలు గడిపాడు. ఒక రోజు మఖదేవుడు, క్షురకుడితో ఇలా అన్నాడు. నా తలలో నెరిసిన వెంట్రుక కనిపిస్తే వెంటనే నాకు చెప్పు క్షురుకుడు సరేనన్నాడు. మరో నాలుగువేల ఏళ్ళ గడిచాయి. ఒక రోజు క్షరకుడు రాజుగారి జుట్టు కత్తిరిస్తుండగా, ఓ చిన్న తెల్లవెంట్రుక కనిపించింది.

వెంటనే క్షురకుడు, ప్రభూ మీ తలలో ఒక తెల్లవెంట్రుక వచ్చింది. అన్నాడు. అప్పుడు రాజు, అలాగా అయితే ఆ వెంట్రక పీకేసి నా చేతికివ్వు అన్నాడు. క్షురకుడు బంగారు పనిముట్టుతో ఆ తెల్లవెంట్రుకను పీకి, రాజు గారి చేతిలో ఉంచాడు. అప్పటికి రాజుగారికి ఇంకా 84,000 ఏళ్ళ ఆయుర్ధాయ ఉంది అయినా వెంట్రుకను చూసిన ఆయనలో చావు గురించి భయం మొదలైంది. మరణం ఆసన్నమయినట్లుగా తోచింది. కాలిపోతున్న ఇంట్లో బంధింపబడినట్లుగా మెల్లగా బాధపడ్డాడు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది.

రాజు ఇలా అనుకున్నాడు ఓ మూర్ఖరాజా ఇంతకాలం జీవితం వ్యర్థంగా గడిపావు. ఇప్పుడు చావును సమీపించావు. నీ స్వార్థాన్ని, అసూయను తొలగించుకోవటానికి ఏ ప్రయత్నం చేయలేదు. ద్వేషభావం విడనాడటం, సత్యాన్వేషణ, జ్ఞాన సముపార్జనకు కృషి... ఏమీ చేయలేదు. ఆ ఆలోచన రాగానే రాజుకు మళ్ళీ చెమటలు పట్టాయి. వెంటనే ఒక నిర్ణాయానికి వచ్చాడు. రాజ సింహసనాన్ని త్యజించటానికి ఇదే సమయం. సన్యాసిగా మారి ధ్యానం ప్రారంభించాలి. ఇలా అనుకొని ఆయన ఒక పట్టణం మీద వచ్చే ఆదాయమంతా క్షురకుడికి ఇస్లున్నట్లు ప్రకటించాడు. ఆ ఆదాయం సంవత్సరానికి లక్షరూపాయల దాకా ఉంటుంది. ఆ తర్వాత రాజు, తన పెద్ద కుమారుడిని పిలిచి కుమారా... నా తల నెరవటం ప్రారంభించింది. అంటే వృద్ధాప్యం మొదలైందన్నమాట.

అధికారాన్నీ, ప్రాపంచిక సుఖాలన్నిటినీ నేను అనుభవించాను. మరణానంతరం స్వర్గానికి వెళ్లాలన్నది నా కోరిక. అందుకే నేను సన్యాసినవుదామనుకుంటుంన్నాను. రాజ్య పరిపాలన బాధ్యత ఇక నీవు చేపట్టాలి. నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పాడు. ఈ విషయం తెలిసి మంత్రులు, రాజోద్యోగులు హుటాహుటిన రాజు వద్దకు వచ్చారు. ప్రభూ హఠాత్తుగా మీరి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. అంటూ అడిగారు. అప్పుడు రాజు ఆ తెల్లవెంట్రుకను చూపుతూ ఈ వెంట్రుక జీవితంలోని మూడు దశలను సూచిస్తోందని నేను గుర్తించాను. యవ్వనం, నడివయసు, వృద్దాప్యాలే ఆ మూడు దశలు. మొదటి తెల్లవెంట్రుక నా తలమీద కూచున్న మృత్యుదేవత వంపే దేవతలవంటివి. కాబట్టి ఈ రోజే నేను అధికారాన్నిత్యజించాలనుకున్నాను. అన్నాడు.

రాజు అడవులకు వెళ్ళిపోతున్నాడని తెలిసిన ప్రజలు ధు:ఖించారు ముఖదేవుడు రాజభొగాలను విడనాడి. అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ సన్యాసిగా కాలం గడుపుతూ నాలుగు విశిష్ట లక్షణాలు సాధన చేయసాగాడు. అవి... అందరినీ ప్రేమగా, దయతో చూడటం, బాధితుల పట్ల కరుణ చూపడం. సుఖంగా ఉన్నవారిని చూసి సంతోషించడం, కష్టాలలో సైతం ప్రశాంతంగా, స్థిరచిత్తంతో ఉండటం, అలా 84,000 ఏళ్ళు గడిపాడు. ఆ తర్వాత ఒకరోజున ఆ మహాజ్ఞాని పరమవదించాడు. నీతి : వ్యర్థంగా గడపటానికి ఎంత ఎక్కువ కాలమయినా తక్కువగానే భావిస్తారు.   

No comments:

Post a Comment