Pages

Saturday, September 8, 2012

కొలనులో అద్భుతం!


ఒకానొకప్పుడు గొప్ప శివభక్తుడైన విజయూ దిత్యుడనే రాజు చలవరాళ్ళతో అందమైన శివాలయం నిర్మించాడు. గుడిలోని శివలింగా నికి రకరకాలుగా పూజలు జరిపి, శివుడి కరుణ పొందాలని నిరంతరం తపిస్తూ ఉండేవాడు. ఒకనాడాయన, ‘‘శ్రావణమాసం ఆరంభ మయింది. శ్రావణ సోమవారం శివుడికి చాలా ప్రీతిపాత్రమైన శుభదినం. ఆ రోజు శివుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వర్తిస్తే బావుంటుంది కదా?'' అని తీవ్రంగా ఆలోచించసాగాడు.
 
శివుడు అభిషేక ప్రియుడు కదా. అందువల్ల ప్రతి సోమవారం శివలింగాన్ని వెయ్యిన్ని ఎని మిది కలశాల పాలతో అభిషేకించడం శ్రేయస్కరం. అందుకు అవసరమయ్యే పాలను ప్రజల నుంచే సేకరించాలి. అప్పుడే అభిషేక పుణ్యం ప్రజలందరికీ దక్కుతుంది, అని భావించి పాలను సేకరించడానికి, వెనువెంటనే ఆలయ ప్రాగణంలోనే ఒక కొలను తవ్వించాడు. కొన్ని రోజుల తరవాత నగరంలో, ‘‘నగర ప్రజలందరూ వినండహో... రేపే మొదటి శ్రావణ సోమవారం.
 
దానిని ఉద్దేశించి మన రాజుగారు వెయ్యిన్ని ఎనిమిది బిందెల పాలతో శివుడికి అభిషేకం చేయనున్నారు. దీని కోసం ప్రతి గృహస్తూ, రేపు తెల్లవారగానే, తమ ఇంట్లో ఉన్న పాలను తీసుకువెళ్ళి, శివాలయ ప్రాంగ ణంలో అందుకని ప్రత్యేకంగా తవ్వబడి ఉన్న కొలనులో పోయూలి. గుర్తుంచుకోండి: మీ ఇళ్ళల్లో ఉన్న పాలన్నింటినీ కొలనులో పోయూలి. చుక్క కూడా మిగుల్చుకోకూడదు. అప్పుడే కొలను త్వరగా నిండగలదు.
 
ఇదే శివుడికి సంతోషం కలిగిస్తుంది. మీ అందరినీ కృపతో చూసి రక్షిస్తాడు!'' అని చాటింపు చేశారు. నగర ప్రజలందరూ ఆ చాటింపు విన్నారు. రాజుగారి శివభక్తిని తలుచుకుని కొందరు సంతోషించారు. తమ దగ్గరున్న పాలన్నిటినీ శివపూజకని కొలనులో పోసేస్తే ఎలా అని పలు వురు అనుకున్నారు. అయినా, రాజాజ్ఞ గనక ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయూరు.

ఒకానొకప్పుడు గొప్ప శివభక్తుడైన విజయూ దిత్యుడనే రాజు చలవరాళ్ళతో అందమైన శివాలయం నిర్మించాడు. గుడిలోని శివలింగా నికి రకరకాలుగా పూజలు జరిపి, శివుడి కరుణ పొందాలని నిరంతరం తపిస్తూ ఉండేవాడు. ఒకనాడాయన, ‘‘శ్రావణమాసం ఆరంభ మయింది. శ్రావణ సోమవారం శివుడికి చాలా ప్రీతిపాత్రమైన శుభదినం. ఆ రోజు శివుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వర్తిస్తే బావుంటుంది కదా?'' అని తీవ్రంగా ఆలోచించసాగాడు.
 
శివుడు అభిషేక ప్రియుడు కదా. అందువల్ల ప్రతి సోమవారం శివలింగాన్ని వెయ్యిన్ని ఎని మిది కలశాల పాలతో అభిషేకించడం శ్రేయస్కరం. అందుకు అవసరమయ్యే పాలను ప్రజల నుంచే సేకరించాలి. అప్పుడే అభిషేక పుణ్యం ప్రజలందరికీ దక్కుతుంది, అని భావించి పాలను సేకరించడానికి, వెనువెంటనే ఆలయ ప్రాగణంలోనే ఒక కొలను తవ్వించాడు. కొన్ని రోజుల తరవాత నగరంలో, ‘‘నగర ప్రజలందరూ వినండహో... రేపే మొదటి శ్రావణ సోమవారం.
 
దానిని ఉద్దేశించి మన రాజుగారు వెయ్యిన్ని ఎనిమిది బిందెల పాలతో శివుడికి అభిషేకం చేయనున్నారు. దీని కోసం ప్రతి గృహస్తూ, రేపు తెల్లవారగానే, తమ ఇంట్లో ఉన్న పాలను తీసుకువెళ్ళి, శివాలయ ప్రాంగ ణంలో అందుకని ప్రత్యేకంగా తవ్వబడి ఉన్న కొలనులో పోయూలి. గుర్తుంచుకోండి: మీ ఇళ్ళల్లో ఉన్న పాలన్నింటినీ కొలనులో పోయూలి. చుక్క కూడా మిగుల్చుకోకూడదు. అప్పుడే కొలను త్వరగా నిండగలదు.
 
ఇదే శివుడికి సంతోషం కలిగిస్తుంది. మీ అందరినీ కృపతో చూసి రక్షిస్తాడు!'' అని చాటింపు చేశారు. నగర ప్రజలందరూ ఆ చాటింపు విన్నారు. రాజుగారి శివభక్తిని తలుచుకుని కొందరు సంతోషించారు. తమ దగ్గరున్న పాలన్నిటినీ శివపూజకని కొలనులో పోసేస్తే ఎలా అని పలు వురు అనుకున్నారు. అయినా, రాజాజ్ఞ గనక ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయూరు.

నగరంలోని ప్రజలందరూ తమ వద్ద ఉన్న పాలన్నింటినీ తెచ్చి కొలనులో పోశారు; అయినా వృద్ధురాలు వచ్చి తనవంతు పాలు పోసేంతవరకు కొలను సగమే నిండింది. ఆమె వచ్చి గిన్నెడు పాలు పోయగానే కొలను పూర్తిగా నిండిపోయింది. ఆ సంగతి రాజుకు తెలియడంతో, దాని రహస్యమేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. అందువల్ల మూడవ సోమవారం ఏం జరుగు తున్నదో చూడాలన్న కుతూహలంతో కాపలా భటుడి వేషం ధరించి తెల్లవారకముందే కొలను వద్ద నిలబడ్డాడు.
 
ఎప్పటిలాగే ప్రజలు బిందె లలో పాలు తెచ్చి కొలనులోకి కుమ్మరించ సాగారు. కొలను సగం వరకు నిండి అలాగే ఆగిపోయిందే తప్ప, ఆ తరవాత ఎన్ని బిందెల పాలు పోసినా ఏమాత్రం పెరగలేదు. మధ్యాహ్నవేళకు గిన్నెనిండా పాలతో వచ్చిన వృద్ధురాలు, ‘‘పరమేశ్వరా, నేను మిగల్చ గలిగి నంత పాలు తెచ్చి నీకు భక్తితో సమర్పిస్తు న్నాను. అపార కరుణాసముద్రుడివైన నువ్వు దయతో స్వీకరించగలవని దృఢంగా విశ్వసిస్తు న్నాను. మమ్మల్నందరినీ చల్లగా చూడు తండ్రీ,'' అంటూ గట్టిగా ప్రార్థిస్తూ పాలను కొలనులో పోసి, వెనుదిరిగింది.
 
ఆ క్షణమే పాలు పొంగుతూ కొలను నిండిపోయింది. ఆ అద్భుత దృశ్యం చూసిన రాజు అబ్బుర పడ్డాడు. ఒక్క గెంతున ముందుకు వచ్చి వృద్ధురాలి దారికి అడ్డంగా నిలబడి ఆమెను ఆపాడు. ‘‘నన్నెందుకు ఆపావు నాయనా? నేనేం తప్పు చేశాను?'' అన్నది వృద్ధురాలు భయంతో కంపి స్తూన్న కంఠస్వరంతో. ‘‘భయపడకమ్మా, నేనీ రాజ్యాన్ని పాలించే రాజును. నీ నుంచి ఒక విషయం తెలుసు కోవాలి. పొద్దుట్నుంచి ప్రజలందరూ శివాభి షేకం కోసం బిందెలతో పాలను తెచ్చి కొలనులో పోశారు.
 
అయినా, అది సగం వరకే నిండి అలాగే ఉండి పోయింది. నువ్వు వచ్చి గిన్నెడు పాలు పోయగానే, అంచుల వరకూ నిండి పోయింది. ఎందుకిలా జరిగిందో చెప్పగ లవా?'' అని అడిగాడు రాజు. ‘‘ప్రభూ, నేనొక తల్లిని. కన్న బిడ్డలు ఆకలితో అలమటించడం ఏ తల్లీ చూడ జాలదు కదా! అందువల్ల తమ ఆజ్ఞను పూర్తిగా పాటించలేక పోయూను. పాలు పితికేప్పుడు లేగలకు కొంచెం వదిలి పెట్టాను. పిండిన పాలను నా పిల్లలకూ, మనమలకూ ఇవ్వగా మిగిలిన గిన్నెడు పాలనే తెచ్చి శివుడి అభిషేకానికి సమర్పించాను. సకల జీవరాశులకూ తల్లీ తండ్రీలాంటివాడు కదా శివుడు.

తన బిడ్డలకు ఆహారం లేకుండా చేయడం ఆయన ఆమోదించగలడా? ప్రభూ, ఉన్న మాట అంటున్నందుకు క్షమించాలి. తమరు చేసింది అదే కదా! ప్రజలందరూ దూడ లకూ, పిల్లలకూ, వృద్ధులకూ, రోగులకూ మిగల్చకుండా పాలన్నిటినీ తీసుకురావాలని ప్రజలను ఆజ్ఞాపించారు కదా. ప్రజలకది ఇష్టం లేదు. బాధ కలిగించింది. తమ ఆజ్ఞను మీర లేక, అయిష్టంగానే పాలను తెచ్చి సమర్పిం చారు. శివుడికిది ఇష్టం లేదు. అందుకే అసంతృప్తి వ్యక్తం చేశాడనుకుంటాను,'' అన్నది వృద్ధురాలు.
 
ఆ మాట విని రాజు దీర్ఘాలోచనకు లోన య్యూడు. ‘‘అవును, ఆ వృద్ధురాలి మాట అక్షరాలా నిజం. కన్న తండ్రిలా, ప్రజల అవసరాలకు, ఆరోగ్యానికి ఎలాంటి కొరతా లేకుండా చూడడం రాజు బాధ్యత. అయితే ఇప్పుడు తను చేసిందేమిటి? అభిషేకం పేరుతో పిల్లలకూ, పెద్దలకూ ఆఖరికి నోరులేని లేగ లకు సైతం పాలు లభించకుండా చేస్తున్నాను. ఇది ఘోర పాపమే అవుతుంది. దీన్ని దేవుడెలా ఆమోదించగలడు? నన్నెలా ఆశీర్వదిస్తాడు?'' అనుకుంటూ తీవ్రమైన అంతర్మథనానికి లోనయ్యూడు.
 
ఒక విధమైన అపరాధభావమూ, అవమానమూ ఆయన్ను ఆవరించాయి. ఆ తరవాత వృద్ధురాలికేసి తిరిగి, ‘‘నాకు నిజమైన భక్తి మార్గం చూపి, నా కళ్ళు తెరిపిం చావు. కృతజ్ఞతలు తల్లీ,'' అంటూ చేతులు జోడించాడు. రాబోయే సోమవారం లేగలకూ, పిల్లలకూ, వృద్ధులకూ ఇవ్వగా మిగిలిన పాలను మాత్రం శివుడి అభిషేకానికి తెచ్చి ఇస్తే చాలునని అప్పటి కప్పుడే నగరమంతటా చాటింపు చేయించాడు. మరుసటి సోమవారం, అంటే ఆఖరి శ్రావణ సోమవారం రానే వచ్చింది.
 
తెల్లవారేసరికి నగర ప్రజలు తాము మిగల్చగలిగిన పాలతో ఆలయం వద్దకు వచ్చారు. రాజు సైతం, లేగలకూ, రాజ భవనంలోని పిల్లలకూ ఇవ్వగా మిగిలిన పాలను మాత్రమే తెచ్చి, అభిషేకానికి కొలనులో పోశాడు. దాని ఫలితం వెనువెంటనే తెలియ వచ్చింది. రెండుబారల పొద్దెక్కే సరికి కొలను పాలతో నిండిపోయింది! వృద్ధురాలు వచ్చేంతవరకు రాజు అక్కడే కాచుకుని ఉన్నాడు. ఆమె వచ్చి, తన వంతు పాలు సమర్పించాక, రాజు ఆమెను సాద రంగా ఆలయం లోపలికి తీసుకువెళ్ళాడు. ఉభయులూ కలిసి శివుడికి క్షీరాభిషేకం నిర్వ హించారు. ‘‘ఆఖరికి దేవుడు నిజంగానే ఆనందిం చాడు. చాలా కృతజ్ఞతలు తల్లీ,'' అన్నాడు రాజు ఎంతో ఆనందంతో.

No comments:

Post a Comment