Pages

Thursday, September 6, 2012

అమ్మవారి మహత్తు


గరికపాడు అనే గ్రామంలో వున్న వాళ్ళందరూ చిన్నకారు రైతులు. చదువులేని అమాయకులు. అందరివీ పూరి ఇళ్ళు. ఒక్క మునసబు, కరణాలకు మాత్రం పెంకుటిళ్ళు వుండేవి. గ్రామం మధ్య అమ్మవారి గుడి వుండేది.

గ్రామంలోని రైతుల మధ్య ఐక్యత వుండేది కాదు. ప్రతి స్వల్ప విషయంలోనూ తరచుగా తగవులాడుకుంటూండేవారు. ఒకనాటి ఎండాకాలంలో అర్ధరాత్రి, గ్రామంలోని ఒక పూరింటికి నిప్పంటుకుని భగ్గు మంటూ మంటలు లేచినై. అది చూసిన గ్రామస్తులు కేకలు పెడుతూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దాపులనున్న చెరువుకు పోయి కడవలతో నీళ్ళు తెచ్చి, మంటలు ఇతర ఇళ్ళకు పాకకుండా ఆర్పివేశారు.

ఆ తర్వాత తృప్తిగా తమ తమ ఇళ్ళకు పోతున్న గ్రామస్తులను గుడి పూజారి ఆగమంటూ చెప్పి, ‘‘మీరందరూ గ్రహించి వుండరు. మన గుడి అమ్మవారు, తన మహత్తును మనకళ్ళ ఎదుట కట్టి చూపింది!’’ అన్నాడు. పూజారి మాటలు గ్రామస్తులకు ఎవరికీ అర్థంకాలేదు. అందరూ మౌనంగా ఊరుకు న్నారు. అప్పుడు పూజారి గొంతెత్తి, ‘‘మన అమ్మవారే గనక ఇంతటి కటిక చీకట్లో మంటల ద్వారా వెలుగు చూపక పోతే, అవి ఎక్కడున్నవో తెలుసుకుని ఆర్పడం మనకు సాధ్యపడేది కాదు గదా!’’ అన్నాడు.

No comments:

Post a Comment