Pages

Friday, September 14, 2012

శత్రువీరభయంకరుడు


భద్రగిరి, కొండకోన అనేవి ఇరుగుపొరుగు రాజ్యాలు. తరతరాలుగా వాటిని పాలించిన రాజుల మధ్య ఆరని శత్రుభావం అప్పుడప్పుడూ రక్తపాతానికి దారి తీస్తూండేది. రెండు రాజ్యాల రాజులూ ధైర్యవంతులేకాక, యుద్ధవ్యూహంలో ఆరితేరినవారు కావడంతో, సైనిక నష్టమే తప్ప ఎవరూ విజయూన్ని సాధించలేకపోయేవారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో, తండ్రి మరణంతో భద్రగిరి రాజ్యాధికారానికి వచ్చిన రణమల్లు, కొండకోనను ఎంత సైనిక నష్టానికైనా ఓర్చి జయించి తీరాలన్న పట్టుదలతో, ఆ రాజ్యం మీద యుద్ధం ప్రకటించాడు. వారం రోజుల్లో రెండు దేశాల సైన్యాలు, సరిహద్దుల్లో మోహరించాయి. ఇక యుద్ధం ప్రారంభం కానున్న సమయంలో, భద్రగిరి సైన్యంలో చిన్న దళాధిపతిగావున్న శౌర్యశీలి అనేవాడు దళాన్ని వదిలి పారిపోసాగాడు. అది గమనించిన మరొక దళపతి అతణ్ణి తరిమిపట్టుకుని, రాజు రణమల్లు దగ్గరకు తీసుకుపోయి, జరిగింది వివరించాడు.
 
రణమల్లు, శౌర్యశీలికేసి తీవ్రంగా చూస్తూ, ‘‘ఒరే, నీ ఒడ్డూపొడుగూ, మెలితిరిగిన మీసం చూస్తూంటే, శత్రువీరభయంకరుడిలా వున్నావు. అటువంటి నువ్వు పోరు ప్రారంభంకానున్న సమయంలో పిరికిపందలా పారిపోవడం ఏమిటి?'' అని గద్దించి అడిగాడు. దానికి శౌర్యశీలి వినయంగా, ‘‘మహారాజా! నేను పిరికితనం కొద్దీ పారిపోవడం కాదు. కొండకోన సైనికుల ముఖాలు చూడడమంటే నాకు చెడ్డ అసహ్యం. అందుకని వెనుదిరిగి పోదలచాను,'' అన్నాడు.

No comments:

Post a Comment