Pages

Friday, September 14, 2012

ధ్రువీకరణ పత్రం


ఫరాట్లంక అనే జమీలో చాలా గ్రామాలుండేవి. జమీందారు భజరంగరా…ుుడు స్వ…ుంగా ఆ…ూవ్యక్తుల వ్యవహారజ్ఞానం, నిజాయితీల గురించి తగు వాకబు చేసి గ్రామాధికారులుగా ని…ుమిస్తూండేవాడు. ఐనా, అలాంటి వారిలో కొందరు లంచగొండ్లుగా త…ూర…్యూరనే వార్తలు, ఆ…ునకు అందుతుండేవి.
 
ఒక సారి, పోటుమెరక గ్రామాధికారి పరవస్తుదాసు మితిమీరిన లంచగొండి అంటూ, దివాణోద్యోగుల ద్వారా ఆ…ునకు తెలిసింది. ఆ…ున వెంటనే దివానును పిలిచి, సంగతి చెప్పి, ‘‘ఆ లంచగొండి సంగతేమిటో మీరే చూడండి,'' అన్నాడు. వారం తిరక్కుండానే దివాను, పరవస్తుదాసును ఎలాంటి తగాదాలూ, గొడవలూ లేకుండా ప్రశాంతంగా వుండే తుమ్మలపల్లి అనే గ్రామానికి బదిలీచేశాడు.
 
అలాంటి చోట లంచాలు తీసుకునేందుకు ఏమాత్రం అవకాశం వుండదని, దివాను ఉద్దేశం. తుమ్మలపల్లికి గ్రామాధికారిగా వచ్చిన పరవస్తుదాసుకు నెలగడుస్తున్నా, గ్రామంలో ఎవరూ తగాదాలు పడి తన తీర్పుకు రాకపోవడం చాలా బాధ కలిగించింది. ఒక రోజా…ున కిటికీ దగ్గర నిలబడి వీధిలోకి చూస్తూండగా, ఇద్దరు నడివ…ుసువాళ్ళు పెద్దగా వాదించుకుంటూ వీధి వెంట పోవడం కంటబడింది.
 
వెంటనే పరవస్తుదాసు వాళ్ళను కేకవేసి పిలిచాడు. వాళ్ళా…ునను సమీపించి, ‘‘అ…్యూ, మేం మిత్రులం! ఈ ఏడు మినుములకు ఎక్కువ ధర పలుకుతుందా, పెసలకా, అని వాదించుకుంటున్నాం,'' అన్నారు. ‘‘మహబాగు! చెరొక పది రూపా…ులివ్వండి. మీరు ప్రాణమిత్రులని ధ్రువీకరిస్తూ పత్రం ఇస్తాను,'' అన్నాడు పరవస్తుదాసు.

No comments:

Post a Comment