Pages

Wednesday, September 19, 2012

దాసీపుత్రుడు

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు గొప్ప ధనికుడుగా పుట్టాడు. ఆయన పెరిగి పెద్దవాడై, పెళ్ళి చేసుకున్నాడు. కొంతకాలానికి బోధిసత్వుడి కొక కుమారుడు కలిగాడు. అదే రోజున ఆ ఇంటి దాసీదానికి కూడా ఒక మగపిల్లవాడు పుట్టాడు. వాడికి కటాహకుడు అని పేరు పెట్టారు. ధనికుడి కుమారుడూ, దాసీపుత్రుడైన కటాహకుడూ పెరిగి పెద్దవాళ్ళు కాసాగారు.
ధనికుడి కుమారుడు చదవటానికి వెళ్ళే టప్పుడు, కటాహకుడు అతని పలకా, పుస్త కాలూ తీసుకుని వెంట వెళ్ళి వస్తూండేవాడు. ధనికుడి కొడుకు నేర్చుకున్న చదువంతా, దాసీపుత్రుడూ నేర్చుకున్నాడు. చదువుకున్నవాడనీ, తెలివైనవాడనీ కటా హకుడికి పేరు వచ్చింది. అన్నీ వుండి కూడా తాను నౌకరుస్థాయిలోనే వుండటం కటాహకు డికి ఎక్కడలేని బాధా కలిగించింది.
తన విద్యకూ, తెలివితేటలకూ తగిన స్థానం సంపాదించాలని వాడికి బలమైన కోరిక పుట్టింది. ఇందుకు గాను ఒక ఉపాయం ఆలోచించాడు. కాశీకి కొన్ని కోసులదూరాన ప్రత్యంత దేశంలో బోధిసత్వుడి మిత్రుడొక లక్షాధికారి వున్నాడు. అతనికి తన యజమాని రాసి నట్టుగా, కటాహకుడొక జాబు రాశాడు: ‘‘నేను నా కుమారుణ్ణి తమ వద్దకు పంపుతున్నాను. మనమూ, మనమూ వియ్య మందటం ఉచితంగా వుంటుందని, నా విశ్వాసము.
కనుక తమరు మా వాడికి తమ కుమార్తె నిచ్చి వివాహము చేసి, తమ ఇంటనే వుంచుకొనేది. తీరిక చేసుకుని నేను వచ్చి, తమ దర్శనం చేసుకోగలను.'' ఈ విధంగా ఉత్తరం రాసి కటాహకుడు దాని మీద తన యజమాని ముద్రిక వేసి, ప్రత్యంత దేశానికి వెళ్ళి, లక్షాధికారి దర్శనం చేసుకుని, ఆయనకు ఉత్తరం అందించాడు.

లక్షాధికారి ఉత్తరం చూసి ఉబ్బి తబ్బి బ్బయిపోయి, కటాహకుడికి తన కుమార్తె నిచ్చి, ఒక శుభముహూర్తాన పెళ్ళి చేసేశాడు. కటాహకుడికిప్పుడు అంతులేని నౌకర్లు. దుస్తుల విషయంలో, భోజనం విషయంలో, ఇతర విలాసాల విషయంలో అతనికి రాజో పచారంగా జరిగిపోతున్నది. ఈలోపల బోధిసత్వుడికి, కటాహకుడే మైనాడా అని సందేహం వచ్చింది. ఆయన అతన్ని వెదకటానికి, నాలుగు వైపులకూ మను షులను పంపాడు.
వారిలో ఒకడు ప్రత్యంత దేశం వెళ్ళి, కటాహకుడు ఒక లక్షాధికారి కూతురును పెళ్ళాడి, తన పేరు మార్చుకుని, తాను ఫలానా కాశీ ధనికుడి కుమారుణ్ణని చెప్పుకుంటున్నట్టు తెలుసుకున్నాడు. ఈ వార్త తెలియగానే బోధిసత్వుడు చాలా నొచ్చుకున్నాడు. తాను స్వయంగా వెళ్ళి కటాహకుణ్ణి తీసుకువద్దామని ప్రత్యంత దేశానికి బయలుదేరాడు. ఆయన వస్తున్నా డన్న వార్త తెలియగానే, కటాహకుడు బెదిరి పోయూడు.
తన యజమాని వచ్చి, నిజం తెలుసు కొనకముందే, తాను ఆయనను మంచి చేసుకుని, జరిగినదంతా చెప్పి క్షమాపణ వేడుకుందామనుకున్నాడు. అయితే, తాను యజమాని దగ్గిర నౌక రులా ప్రవర్తించటం చూసి అందరూ అను మాన పడవచ్చు. అందుచేత కటాహకుడు తన సేవకులతో, ‘‘నేను అందరి కొడుకుల వంటి వాణ్ణి కాను. నాకు, నా తండ్రి మీద ఎంతో పూజ్యభావం. నేను, నా తండ్రి భోజనం చేస్తూంటే, పక్కన నిలబడి విసురుతాను.
ఆయనకు మంచినీరూ అవీ నేనే స్వయంగా అందిస్తాను,'' అంటూ తాను నౌకరు చేసే పనులన్నీ వర్ణించి చెప్పాడు. తరవాత కటాహకుడు తన మామగారి దగ్గిరకు వెళ్ళి, ‘‘మా నాన్న వస్తున్నాడు. నేనాయనకు ఎదురువెళ్ళి తీసుకువస్తాను,'' అని చెప్పాడు. లక్షాధికారి సరేనన్నాడు.
కటాహకుడు తన యజమానిని అంత దూరానే కలుసుకుని, ఆయన కాళ్ళ మీద పడి, తాను చేసినదంతా చెప్పి, తనకు అపాయం రాకుండా కాపాడమని అభయం కోరాడు. బోధిసత్వుడు అభయం ఇచ్చాడు. తరవాత కటాహకుడు బోధిసత్వుడితో సహా, మామ గారి ఇంటికి వచ్చేశాడు. లక్షాధికారి బోధిసత్వుణ్ణి చూసి ఎంత గానో ఆనంద పడి, ‘‘తమరు కోరిన ప్రకారమే ూ అమ్మాయిని మీ వాడికిచ్చి పెళ్ళి చేశాను,'' అన్నాడు.

బోధిసత్వుడు తృప్తిపడినట్టు కనిపించి కటాహకుడితో, తన కుమారుడితో లాగే మాట్లాడాడు. తరవాత ఆయన లక్షాధికారి కుమార్తెను పిలిచి, ‘‘అమ్మా, నా కుమారుడు నిన్ను సరిగా చూసుకుంటున్నాడా?'' అని అడిగాడు. ‘‘ఆయనలో మరే లోపం లేదు గాని, భోజనం దగ్గిర ఆయనకు ఒకటీ రుచించదు. ఎన్ని విధాల మంచి వంటకాలు చేసినా, ఏదో ఒక తప్పు పడతాడు.
ఏం చేసి ఆయనను తృప్తిపరచాలో, ఎంత ఆలోచించినా తెలియ కుండా వున్నది,'' అన్నది కటాహకుడి భార్య. ‘‘అవును. వాడు తిండి దగ్గర లోగడ కూడా ఇలాగే నానాతిప్పలూ పెట్టేవాడు. అందుచేత ఈసారి వాడు భోజనానికి కూర్చుని ఇది బాగా లేదు, అది బాగాలేదు అన్నప్పుడు ఒక శ్లోకం చదువు. ఆ శ్లోకం నీకు రాసి ఇస్తాను. దాన్ని బాగా కంఠస్థం చెయ్యి. అది చదివావంటే, వాడు తప్పులు పట్టటం మానేసి, పెట్టినదేదో తింటాడు,'' అంటూ బోధిసత్వుడు ఆమెకు ఒక శ్లోకం రాసి ఇచ్చాడు.
బోధిసత్వుడు కొద్ది రోజులు అక్కడ వుండి, కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయూడు. ఆయన వెళ్ళగానే కటాహకుడు మరింతగా విజృం భించాడు. భోజనం ముందు కూర్చుని వడ్డిం చిన ప్రతి పదార్థాన్నీ, నిందించసాగాడు. ఒకరోజున కటాహకుడు ఇలా చీద రించుకుంటూ వుంటే, అతడి భార్య ఈ శ్లోకం చదివింది : ‘‘బహూంపి సో వికత్థేయ్య అంఞం జనపదం గతో, అన్వాగంత్వాన దూసేయ్య భుంజ భోగే కటాహక.''
(కటాహకుడు అనేక విధాల తిట్లు తిని, వేరొకచోటుకు పోయి, ఇతరులను దూషిస్తూ సకల భోగాలూ అనుభవిస్తాడు.) దీని అర్థం కటాహకుడి భార్యకు తెలి యదు. కాని కటాహకుడు మాత్రం, తన యజమాని తన పేరుతో సహా, తన రహస్య మంతా భార్యకు చెప్పేశాడని భయపడి పోయూడు. ఆ తరవాత అతడు ఏది వడ్డిస్తే అది తిని సంతృప్తిపడుతూ, సుఖంగా కాలక్షేపం చేశాడు.

No comments:

Post a Comment