Pages

Wednesday, September 19, 2012

నీతివర్తనుడు


బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు ఆయన కుమారు డుగా జన్మించాడు. బ్రహ్మదత్తుడు అతడికి శీలవుడు అని పేరు పెట్టాడు. కాలక్రమాన శీలవుడు రాజోచితమైన విద్యలూ, ధర్మశాస్త్రాలూ అభ్యసించి పెరిగి పెద్దవాడై, కాశీరాజ్యానికి రాజయ్యూడు. ఆయన ప్రజలను కన్న బిడ్డల్లా ఎంతో ప్రేమా దరాలతో పరిపాలించసాగాడు. ముఖ్యంగా నేరస్థుల పట్ల ఎంతో కనికరం కనబరచి వాళ్ళ బతుకులను బాగు చేయడానికి ప్రయత్నించ సాగాడు.
దారిద్య్రం వల్లా, అజ్ఞానం చేతా దొంగతనం మొదలైన నేరాలను చేసేవారిని ఆయన కఠినంగా దండించడానికి బదులు, తన సమక్షానికి రప్పించుకుని, అవసరమైతే వాళ్ళకు డబ్బు ఇచ్చి, హితబోధలు చేసి పంపే వాడు. ఇందువల్ల రాజ్యంలో నేరాలు తగ్గడమే కాక, ప్రజలకు తమ రాజుపై అంతులేని భక్తి గౌరవాలు కలిగాయి. కాశీరాజ్యానికి సమీపంలో వున్న కోసల దేశపు మంత్రికి, కాశీరాజు మంచితనం ఆయన బలహీనతగా తోచింది.
కాశీరాజ్యాన్ని సులు వుగా గెలవవచ్చునని దుర్బుద్ధి పుట్టింది. ఆయన తన రాజుతో, ‘‘కాశీరాజైన శీలవుడు అతి దుర్బలుడు. అతను బందిపోటు దొంగ లనూ, హంతకులనూ సయితం దండించ డానికి వెనకాడతాడు. అటువంటి పిరికివాణ్ణి, మనం సునాయూసంగా జయించవచ్చు,'' అని చెప్పాడు.
ఇది నిజమో కాదో తెలుకుకోడానికై, కోసలరాజు తన సైనికులను కొందరిని పిలిచి, ‘‘మీరు సరిహద్దు దాటి కాశీరాజ్యంలో ప్రవే శించి, గ్రామాలను కొల్లగొట్టి రండి,'' అని ఆజ్ఞాపించాడు. కోసల సైనికులు, కాశీరాజ్య గ్రామాల మీదికి వచ్చి పడగానే, అక్కడి ప్రజలు కలిసి కట్టుగా వాళ్ళను ఎదిరించి పట్టుకుని, తమ రాజైన శీలవుడి దగ్గిరకు తీసుకుపోయూరు.

‘‘మీరు విదేశీయుల్లాగా వున్నారు. మా గ్రామాలను కొల్లగొట్ట రావడానికి కారణం ఏమిటి?'' అని రాజు శీలవుడు వాళ్ళను ప్రశ్నించాడు. ‘‘మహారాజా, మాకు తిండికి జరగక, ఇలా చేయవలసి వచ్చింది,'' అన్నారు కోసల సైనికులు. ‘‘మీకు తిండికే అంత ఇబ్బందిగా వుంటే, నన్నడగక పోయూరా?'' అని శీలవుడు తన ధనాగారం నుంచి డబ్బు తెప్పించి, వాళ్లకు ఇచ్చి పంపివేశాడు.
శీలవుడి ఈ ప్రవర్తన చూసి కాశీరాజుకు కొంత ధైర్యం కలిగింది. అయినా, మరొకసారి పరీక్షించి చూద్దామని అతడు, ఈసారి ఎక్కువ మంది సైనికులను, కాశీరాజ్యపు నగరాల మీదికి దోపిడీకి పంపాడు. వాళ్ళు సరిహద్దు గ్రామాలు దాటుతూండగా, కాశీరాజ్య ప్రజ లకు దొరికిపోయూరు. ఈసారి కూడా శీలవుడు బంధితులైన సైనికులను శిక్షించకుండా, కొంత డబ్బు ఇచ్చి పంపేశాడు. దీనితో కోసల రాజుకు ఎక్కడలేని ధైర్యం కలిగింది. ఆయన తన సైన్యాలతో కాశీరాజ్యం పైన యుద్ధానికి బయలుదేరాడు.
ఈ వార్త గూఢచారుల ద్వారా తెలియగానే మంత్రులూ, సేనాపతులూ శీలవుడి దగ్గిరకు వచ్చి, ‘‘మహారాజా, కోసలరాజుకు మన శక్తి తెలియదులా వుంది. మహాదర్పంగా మనపైకి యుద్ధానికి వస్తున్నాడు. అతణ్ణి ఎదుర్కు నేందుకు, సైనిక సమీకరణకు అనుజ్ఞ ఇవ్వండి,'' అని కోరారు. శీలవుడు యుద్ధానికి సమ్మతించలేదు. కొంతసేపు మౌనంగా ఆలోచించి తలపం కిస్తూ, ‘‘అనవసర రక్తపాతం వద్దు. వాళ్ళకు కాశీరాజ్యం కావాలని వుంటే, అలాగే తీసుకో నివ్వండి. వాళ్ళ కోసం కోట తలుపులు తెరిచి వుంచండి,'' అన్నాడు.
ఆయన ఒక దూత ద్వారా కోసల రాజుకు, ‘‘మీరు శత్రువులుగా రానవసరం లేదు. మిత్రులుగానే రావచ్చు,'' అని వర్తమానం పంపాడు. ఈ వర్తమానాన్ని కోసల రాజు, శీలవుడి దౌర్బల్యంగా భావించాడు. అమితోత్సాహంతో కాశీరాజ్యం మీదికి బయలుదేరాడు. సద్వర్తనా, రాచమర్యాదలూ ఎరగని కోసల రాజు తన బలగంతో, కాశీరాజు సభా మంది రంలో ప్రవేశిస్తూనే, శీలవుణ్ణీ, మంత్రులనూ పెడరెక్కలు విరిచి కట్టమని సైనికులను ఆజ్ఞాపించాడు.

‘‘అతిథులు ఇలా ప్రవర్తించడం ధర్మం కాదు,'' అన్నాడు శీలవుడు. ఆ మాటలకు కోసల రాజు వికటంగా నవ్వాడు. అతడు ఆజ్ఞాపించగానే సైనికులు శీలవుడూ, ఆయన మంత్రులూ ధరించే లాంఛనాలను తీసివేశారు. శీలవుడూ, ఆయన మంత్రులూ సాయం కాలంలోగా కాశీనగరం విడిచి, అరణ్య మార్గం పట్టి పోసాగారు. కొంత సేపటికి చీకటి పడింది. అందరూ అరణ్యంలోనే చెట్ల కింద పడుకున్నారు.
వారికా రాత్రి భోజనం కూడా లేదు. అర్ధరాత్రివేళ వారికి నిద్రాభంగమైంది. ఏమిటా అలజడి అని లేచి కూర్చుంటూ చూస్తూండగానే చాలామంది దొంగలు కాగ డాలు పట్టుకుని అక్కడికి వచ్చారు. వాళ్ళు, రాజు శీలవుడితో, ‘‘మహారాజా, మేము దొంగలం. తమ దయవల్ల ఇంతకాలంగా మేము దొంగతనాలు చెయ్యకుండా జరిగి పోయింది. కాని, నేటి నుంచి మా కష్టాలు ఆరంభమౌతున్నవి.
అందుచేత మేం ఈ రాత్రి రాజసౌధం ప్రవేశించి, ఈ సొత్తంతా దొంగి లించి తెచ్చాం. ఇదిగో, మీ దుస్తులూ, లాంఛ నాలూ, ఖడ్గాలూ! ఇది మీకోసం తెచ్చిన రాజ భోజనం. మీరు ముందుగా రాజోచితమైన దుస్తులు ధరించి, భోజనం చేసి, తరవాత మేం తెచ్చిన ఈ ధనమంతా ఏం చేయమంటారో సెలవియ్యండి,'' అన్నారు. శీలవుడూ, ఆయన మంత్రులూ భోజ నాలు చేసి తమ, తమ దుస్తులు ధరించారు. తరవాత శీలవుడు దొంగలతో, ‘‘కొత్తరాజు, మీ సమస్యను ఎట్లా పరిష్కరించేదీ తెలుసు కోవడం మంచిది.

అది తెలుసుకోకుండా ముందుగానే మీరిలా దొంగతనాలకు పాల్ప డడం మంచిది కాదు. ఈ ధనమంతా తీసుకు పోయి రాజుకు ఇచ్చి, ఆయన మీ బతుకు తెరువుకు ఏం చేయమంటాడో అడగండి,'' అన్నాడు. ‘‘ఆతిథ్యం ఇచ్చిన వారిని, పచ్చిదారి దొంగలా దోచిన వాడికి న్యాయబుద్ధి వుండదు. మాకా నమ్మకం ఇసుమంత కూడా లేదు. మహారాజా! మే మా నీచుడి దగ్గిరకు వెళ్లం. మీరే, మాకు ఎప్పటికీ మహారాజులు,'' అన్నారు దొంగలు.
‘‘ఆ కొత్తరాజు దగ్గిరకు మీరు వెళ్ళక పోతే, ఈ ధనం తీసుకుని నేనే ఆయన దగ్గిరకు వెళతాను,'' అన్నాడు శీలవుడు. ఆయన వెంటనే తన మంత్రులతో సహా బయలుదేరి, మర్నాడు ఉదయూనికల్లా రాజసభ చేరుకున్నాడు. శీలవుణ్ణి చూడగానే కోసలరాజు నిర్ఘాంతపోయూడు. శీలవుడు జరిగినదంతా చెప్పి, ‘‘మహా రాజా, నాకన్నా ప్రజలను మరింత న్యాయంగా పరిపాలించాలనే కదా, మీరు నన్ను వెళ్ళ గొట్టి, నా సింహాసనం ఆక్రమించుకున్నారు?
అమాయకులైన దొంగలు, ఈ సంగతి గుర్తిం చక, తమ పరిపాలనలో జరుగుబాటుం డదని భయపడి, రాత్రి తమ ఖజానా దోచారు. వారి సమస్యలను, నా కన్నా మీరు మరింత న్యాయసమ్మతంగా పరిష్కరిస్తారని అభయం ఇచ్చి, మీ సొత్తు, మీకు ఒప్పగించ వచ్చాను. ఇంతకన్న, ఈ రాజ్యంలో నాకు వేరే పని లేదు,'' అన్నాడు. ఈ మాటలతో కోసలరాజుకు హృదయ పరివర్తన కలిగింది.
ఆయన సింహాసనం మీది నుంచి లేచి వచ్చి, శీలవుడి కాళ్లపై బడి, ‘‘మహాత్మా, దొంగలు సయితం ప్రేమించే మీ మహిమా, సద్వర్తనా గ్రహించలేక, నీచుడైన నా మంత్రి సలహా విని, తమ పట్ల తీరని ద్రోహం చేశాను. నన్ననుగ్రహించి, మీ రాజ్యం మీరు ఏలుకోండి, మీ మైత్రి చాలు; మీ రాజ్యం నాకక్కరలేదు,'' అన్నాడు. శీలవుడు తిరిగి కాశీ రాజ్యాధిపత్యాన్ని స్వీకరించాడు. ఆయన కోసలరాజుకు అన్ని మర్యాదలూ చేసి, అతణ్ణి అతడి రాజ్యానికి పంపివేశాడు.

No comments:

Post a Comment