Pages

Wednesday, September 19, 2012

కపటయోగి


పూర్వం కురురాజ్యంలోని పాంచాల నగరా నికి, రేణుకుడు రాజుగా వుండేవాడు. అదే కాలంలో హిమాలయ పర్వతాల్లో ఐదువందల మంది సాధువులకు గురువైన మహారక్షితుడు అనే తపస్వి వుండేవాడు. ఒకప్పుడు మహారక్షితుడు శిష్యవర్గంతో దేశసంచారం చేస్తూ, పాంచాలనగరానికి వచ్చాడు. సాధువుల రాకకు రాజు చాలా సంతోషించి, మహారక్షితుడికి ఉచిత మర్యా దలు చేసి, ఉద్యానవనంలో సాధువులకు వసతి ఏర్పాటుచేశాడు.
వర్షరుతువు గడిచేవరకూ మహారక్షితుడు అక్కడే వుండి, రాజు వద్ద సెలవు పుచ్చుకుని, శిష్యులతో తిరిగి హిమాలయూలకు బయలు దేరాడు. మార్గంలో అందరూ ఒక చెట్టు నీడన కూర్చుని, రాజు తమకు చేసిన సత్కారం గురించి చెప్పుకోసాగారు. మాటల సందర్భంలో రాజుకు సంతాన ప్రాప్తి వున్నదా లేదా అన్న ప్రసక్తి వచ్చింది. శిష్యగణంలో వున్న జ్యోతిష ప్రవీణులు చర్చలు ప్రారంభించారు.
అంతా విన్న గురువు మహారక్షితుడు, ‘‘రాజు రేణుకుడికి దైవాంశ గల కుమారుడు జన్మిస్తాడు,'' అన్నాడు. మహారక్షితుడు వాక్శుద్ధికలవాడని శిష్యు లందరికీ తెలుసు. అందువల్ల వారు రాజుకు మేలు కలగబోతున్నదనుకున్నారు. వాళ్ళల్లో ఒకడికి దుర్బుద్ధి పుట్టింది. వాడు, తక్కిన వాళ్ళతో కొంచెం వెనకగా వస్తానని చెప్పి, అందరూ కనుచూపు మేరదాటిపోగానే, వెను దిరిగి పాంచాలనగరం చేరాడు.
వాడు, రాజ దర్శనం చేసుకుని, ‘‘రాజా! మేమంతా హిమాలయూలకుపోతూ ఒకచోట విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, నీవు మా తలపునకు వచ్చావు. రాజుకు వంశం నిలబడుతుందా లేదా అన్న ప్రశ్న వచ్చింది. మేము దివ్యదృష్టి వల్ల, నీకు దైవాంశ సంభూ తుడైన కుమారుడు కలుగుతాడని తెలుసు కుని, ఆ మాట చెప్పిపోయేందుకు వచ్చాము.

ఇక పోయివస్తాం,'' అంటూ తిరిగి వెళ్ళ బోయూడు. ఈ వార్త విని ఆనందభరితుడైన రాజు, యోగిని ఆపి, ‘‘మహాత్మా, తమరు సామాన్యు లుకారు, దివ్యచక్షులు! ఇక్కడే వుండి పొండి,'' అని కోరాడు. దుష్టబుద్ధి అయిన యోగి అందుకు అంగీకరించాడు. అతడికి రాజు ఉద్యాన వనంలో అన్ని వసతులూ ఏర్పరచి, గురు వులా అతణ్ణి సేవించసాగాడు. ఇక ఈ కపట యోగి ఉద్యానవనంలో ఒక మూల కూరగా యలు కాయించి, వాటిని తోటమాలీల ద్వారా అమ్మించి, ధనం గడించసాగాడు.
ఈ సమయంలో బోధిసత్వుడు, రేణుక మహారాజుకు కుమారుడుగా జన్మించాడు. జాతకర్మలు చేయించి అతడికి సుమనసుడు అని పేరుపెట్టారు. సుమనసుడు ఏడేళ్ళవాడైవుండగా రాజు రేణుకుడికి సామంతరాజులతో యుద్ధం వచ్చింది. తండ్రి ఇంట లేనప్పుడు సుమన సుడు ఒకనాడు ఉద్యానవనం చూడబో యూడు. అక్కడ ఒక మూల కాషాయవస్త్రాలు ధరించిన యోగి మొక్కలకు పాదులు తీస్తూ, కూలివాడికన్న ఎక్కువగా కాయకష్టం చేస్తూం డడం అతడి కంటబడింది.
సుమనసుడు కపటయోగిని గుర్తించి, అతడికి బుద్ధి చెప్పాలని, ‘‘ఒరే, తోటమాలీ!'' అంటూ కేకపెట్టాడు. దివ్యచక్షువుగా పేరుమోసిన కపటయోగి ఈ పిలుపు వింటూనే అదిరిపడ్డాడు. తన రహస్యం రాజకుమారుడు గ్రహించాడని తెలుసుకున్నాడు. అతణ్ణి ఎలా అయినా కడతేర్చాలని నిశ్చయించుకుని, ఒక వ్యూహం పన్నాడు. సరీగా, రాజు తిరిగి వచ్చే సమయూనికి కపటయోగి తన కమండలాన్నీ, పీఠాన్నీ ముక్కలు చేశాడు.
ఆశ్రమం చుట్టూ గడ్డీ గాదం విరజిమ్మాడు. తరవాత ఒళ్ళంతా నూనె పూసుకుని, ఆశ్రమంలో ఒక మూల మూలు గుతూ పడుకున్నాడు. రాజు తన గురువైన దివ్యచక్షుణ్ణి చూడ బోయూడు. అతడికి ఆశ్రమ పరిసరాలు అశుభ్రంగా కనిపించాయి. ‘‘మహాత్మా, ఏం జరిగింది?'' అని అడి గాడు రాజు చేతులు జోడించి. ‘‘ఇదంతా నీ కొడుకు చేసిన పని!'' అంటూ కపటయోగి, సుమనసుడు తనకు చేసిన అవమానం గురించి చెప్పాడు.

రాజు ఉగ్రుడైపోయి, తలారులను పిలిచి, ‘‘సుమనసుడి తల నరికి నా దగ్గిరకు తీసుకు రండి!'' అని ఆజ్ఞాపించాడు. తలారులు పోయి, తల్లి దగ్గిర కూర్చుని వున్న సుమనసుడికి సంగతి చెప్పారు. సుమనసుడు తండ్రి దగ్గిరకు వచ్చి, ‘‘నాన్నగారూ, మహాత్ముడు, పవిత్రుడు అని నువ్వు పూజించే ఆ కపటయోగి చేస్తున్న దేమిటో ద్వారపాలకుల్ని అడిగి చూడు, తెలు స్తుంది,'' అన్నాడు. రాజు అప్పటికప్పుడే ప్రాసాదపు నాలుగు ద్వారాలను కాపలా కాసేవాళ్ళను పిలిపిం చాడు.
వాళ్ళు, రాజుతో దాచకుండా యోగి కూరగాయలు పండించి అమ్మడం గురించి చెప్పారు. రాజు ఆశ్రమంలో వెదికించగా, కపట యోగి దాచిన ధనం బయటపడింది. రాజు తన తప్పిదానికి చాలా విచారించి, కొడుకుతో, ‘‘నాయనా, నా తొందరపాటు మన్నించు. ఇక, ఈ రాజ్యాన్ని నువ్వే ఏలుకో,'' అన్నాడు. అందుకు సుమనసుడు ఒప్పుకోక, ‘‘మహిమగల మూలిక ఎంత పని చేస్తుందో, నోటి వెంట వెడలే మాట కూడా అంత పని చేస్తుంది.
నీ నోటి వెంట వెడలినవి దుష్ట వాక్కులు! నీ ఆజ్ఞప్రకారం, నా తల్లి దగ్గిర కూర్చునివున్న నన్ను తలారులు వధ్యశిల వద్దకు తీసుకు పోబోయూరు. నేనిప్పుడే, నీ రాజ్యం విడిచి పోతున్నాను,'' అన్నాడు. సుమనసుడి మనసు మార్చవలసిందిగా రాజు, రాణిని కోరాడు. కాని ధర్మచింతగల రాణి ఆ మాట పాటించక కొడుకును దీవిస్తూ, ‘‘నాయనా! నువ్వు ధర్మమూర్తివి. నీ అభీ ష్టానుసారం పవిత్ర జీవనం గడుపుతూ, తరించు,'' అన్నది.
సుమనసుడు హిమాలయప్రాంతం చేరి, అక్కడ విశ్వకర్మ నిర్మించి వుంచిన కుటీరంలో తపస్సు చేస్తూ కాలంగడిపాడు. రాజు రేణుకుడు కపటయోగికి మరణ దండన విధించాడు. ఆనాటి నుంచీ యోగు లకు రాజ్యంలో ఎవరూ ఆశ్రయం ఇవ్వవద్దని శాసనం చేశాడు. ఈ విధంగా, దుష్టబుద్ధి అయిన ఒక్క కపటయోగి కారణంగా, యోగులందరికీ తీరని అపకీర్తి కలిగి, కురురాజ్యంలో వారికి ప్రజాదరణ లేకుండా పోయింది.

No comments:

Post a Comment