Pages

Wednesday, September 19, 2012

అనాదరణీయుడు

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు, ఆయన వద్ద పండితా మాత్యుడుగా వుండేవాడు. ఒక సందర్భంలో కాశీ రాజైన బ్రహ్మదత్తు డికి తన కుమారుడిపై కోపం కలిగి, అతన్ని రాజ్యం నుంచి వెళ్ళ గొట్టాడు. రాజుకొడుకు, భార్యా సమేతుడై దేశాంతరాలలో చాలాకాలం పాటు అనేక కష్టాలు పడ్డాడు. నిలిచే నీడలేకా, తినడానికి తిండిలేకా భర్త కష్టాలనుభవిస్తూంటే, మహా సాధ్వి అయిన ఆయన భార్య కూడా కష్టా లన్నిటినీ అనుభవించింది.
ఇలా కొంతకాలం జరిగాక బ్రహ్మదత్తుడు చనిపోయూడు. ఆ కారణంగా ఆయన కొడుకు స్వదేశం తిరిగి రావడానికి అడ్డంకి తొలగిపోయింది. తండ్రి చనిపోయినట్టు తెలియగానే, రాజు కొడుకు పరమాందభరితు డయ్యూడు. ఎప్పుడు కాశీ చేరదామా, ఎప్పుడు సింహాసనం మీద కూచుందామా అన్న ఆదు ర్దాలో, కాశీ మార్గం పట్టి రాసాగాడు. తన భార్య తనతో సమంగా నడవలేదనీ, తన కష్టాలలో ఆమె భాగం పంచుకున్నట్టే, ఆమె కష్టసుఖాలు తను గమనించాలనీ, ఆ మూఢుడికి తోచలేదు.
అందుచేత రాజు కొడుకు ఆహార విశ్రాంతులు కూడా పాటించ కుండా రాత్రీ పగళ్ళు తాను నడిచి, భార్యను కూడా తనతో సమంగా నడిపించాడు. ఆకలితోనే నడిచి, నడిచి వారిద్దరు ఒక ఊరు చేరారు. అక్కడ కొందరు వీరి దుస్థితి చూసి, ‘‘ఇంత భోజనం పెడతాం, మూట కట్టుకుపోయి తినండి,'' అన్నారు. బ్రహ్మదత్తుడి కొడుకు తన భార్యను ఒక చోట ఉండమని చెప్పి, భోజనం పెడతామన్న వారి వెంట వెళ్ళాడు.
అతడికి వాళ్ళు ఇద్దరికి సరిపడే ఆహారం ఆకులో కట్టి ఇచ్చారు. దాన్ని తీసుకుని రాజుకొడుకు భార్య వున్న చోటుకు తిరిగి వస్తూ, ఇలా ఆలోచించాడు: ఈ భోజనం, తనూ భార్యా కలిసి తింటే, మళ్ళీ రెండో పూటకే ఆకలి వేస్తుంది. తాను కాశీకి చేరడం ప్రధానం గాని, తన భార్య చేరడం ప్రధానం కాదు.

తాను త్వరత్వరగా ప్రయూణం సాగించడానికి, ఆమె అసలే ప్రతిబంధకంగా వున్నది. అందుచేత ఏదైనా ఉపాయం చేసి,ఈ ఆహారమంతా తానే తినె య్యూలి! ఇలా ఆలోచన చేసి, ఆ నీచుడు భార్య వున్న చోటుకు వెళుతూనే, ‘‘నువ్వు ముందు నడుస్తూ వుండు. నేను కాలకృత్యాలు ముగించుకుని కొంచెం వెనగ్గా వచ్చి కలుసు కుంటాను,'' అన్నాడు. అతడి భార్య ఈ మాటలు నిజమని నమ్మి ముందు పోసాగింది. ఆమె వెళ్ళగానే వాడు ఆహారమంతా తానే తిని, ఆకులన్నీ వదు లుగా పొట్లం చుట్టి, భార్యను చేరుకున్నాడు.
భార్య చేతిలో వున్న పొట్లం కేసి చూసేంతలో కోపం నటిస్తూ, ‘‘ఈ ఊరి వాళ్ళెంత మోస గాళ్ళో చూడు! ఉత్త ఆకులు పొట్లం కట్టి, ఆహారమంటూ ఇచ్చారు,'' అన్నాడు. అతడి భార్యకు నిజం తెలిసినా, భర్త మీది గౌరవం కొద్దీ ఏమీ అనకుండా వూరుకున్నది. మరి కొంత కాలం ప్రయూణం చేసి వారు, కాశీ చేరారు. బ్రహ్మదత్తుడి కొడుకు రాజ్యాభిషేకం జరిపించుకుని, కాశీ రాజైనాడు.
రాజయ్యూక అతడికి తన భార్యను గురించి ఆలోచించే అలవాటు బొత్తిగా లేకుండా పోయింది. తన కష్టాలను ఎంతో సహనంతో పంచుకున్న భార్యకు, తన సుఖాలలో భాగ మివ్వాలని అతనికి తట్టనేలేదు. ఆమె మంచి బట్టలు వేసుకున్నదో లేదో, సరిగా భోజనం చేసిందో లేదో - రాజు ఎన్నడూ విచారించిన పాపాన పోలేదు. అందుచేత రాణి కష్ట కాలం తీరిపోయినా, పూర్వంలాగే విచార సము ద్రంలో మునిగి వుండసాగింది. రాజు వద్ద పండితామాత్యుడుగా వుంటున్న బోధిసత్వుడు రాణి విచారాన్ని గమనించి, ఒకసారి ఆమెను చూడ బోయూడు.
రాణి ఆయనను ఆదరించి ఉచిత మర్యాదలు చేసింది. ‘‘అమ్మా, తమ కష్టాలు తీరి మంచి రోజులు వచ్చినందుకు రాజుగారు ఎన్నో బహుమతు లిచ్చారు. కాని, నీ చేతి మీదుగా నాకు ఈనాటి వరకూ ఏ విధమైన బహుమతీ ముట్టలేదు,'' అన్నాడు బోధిసత్వుడు. ‘‘బాబూ, నేను పేరుకు రాణినేగాని, వాస్త వానికి అంతఃపుర దాసీలకూ, నాకూ తేడా ఏమీ లేదు.
రాజుగారి కష్టాలలోనే తప్ప సుఖాలలో భాగం లేని రాణి, ఎలాటి రాణి అనిపించు కుంటుందో, పండితామాత్యులైన మీరే చెప్పండి?'' అంటూ రాణి, మార్గంలో గ్రామ స్థులిచ్చిన ఆహారం తన భర్త తన వంతు తనకు పెట్టకుండా ఏవిధంగా తినేసిందీ చెప్పింది.

 ‘‘ఇప్పుడైనా, నా భర్త నేను సుఖపడుతు న్నానో లేదో విచారించడు. నేను మంచి భోజనం చేస్తున్నానా, మంచిబట్ట కడుతున్నానా అన్న ఆదుర్దా కూడా ఆయనకు లేదు,'' అని రాణి కంట నీరుపెట్టుకున్నది. ‘‘అమ్మా, చింతించకు. ఈ విషయం నీ నోట తెలుసుకునేందుకే, వచ్చాను. రేపు నిండు సభలో నిన్ను నేను ఇప్పుడడిగిన మాటలే అడుగుతాను.
నువ్వేమాత్రం జంకక ఇవే సమా ధానాలు చెప్పావంటే, నీకీ విచారం లేకుండా నే చూస్తాను,'' అన్నాడు పండితామాత్యుడు. మర్నాటి సభకు రాణీ కూడా వచ్చింది. ఆమెను చూసి బోధిసత్వుడు, ‘‘రాణీగారు రాజ్యానికి వచ్చాక భృత్యుల విషయం పట్టిం చుకోవడమే లేదు,'' అన్నాడు. రాణి పూర్వం పండితామాత్యుడికి చెప్పిన విషయూలన్నీ సభలో చెప్పేసింది. తాను ఆమె వంతు భోజనం దొంగతనంగా తిన్న మాట ఆమె బయటపెట్టేసరికి, రాజుకు సభికులలో తీరని తలవంపులయింది.
రాణి మాట్టాడడం పూర్తి కాగానే పండితా మాత్యుడు, ‘‘రాజుగారికి నీ పట్ల ఆదరం లేనప్పుడు, నువ్వాయనను అంటిపెట్టుకుని ఉండడం అనవసరం. చజే చజంతం, వణం న కయిరా; ఆపేత చిత్తేన న సంభజేయ్య; ద్విజో దుమం భీణ ఫలంతి ఞత్వా; అంఞం సమేక్ఖేయ్య, మహాహె లోకే. (విడిచినవాణ్ణి విడిచిపుచ్చు, అలాటి వాడి స్నేహం ఆశించకు; ఆపేక్ష లేనివాడి పట్ల ఆదరభావం చూపకు.
పక్షి ఫలాలు లేని చెట్టును విడిచి ఇతర చెట్లు చూసుకుం టుంది. లోకం సువిశాలమైనది.) అందుచేత నువ్వు, ఈ రాజభవనం విడిచి విశాల ప్రపంచంలోకి పోయి, ఆదరం లభించే చోట సుఖజీవనం గడపడం మంచిది,'' అన్నాడు. వెంటనే రాజు సింహాసనం నుంచి దిగి వచ్చి, ఆయన కాళ్ళపైబడి, ‘‘పండితామాత్యా, నా తప్పు క్షమించండి! ఇక ముందు నా భార్య పట్ల ధర్మంగా ప్రవర్తిస్తాను,'' అన్నాడు. ఆనాటి నుంచి రాజు రాణిని ఆదరంతో చూడసాగాడు.

No comments:

Post a Comment