Pages

Wednesday, September 19, 2012

ప్రాణమిత్రుడు

పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మ ణుడికి కుమారుడుగా పుట్టాడు. అతడికి తల్లి దండ్రులు సత్యానందుడు అని పేరు పెట్టారు. మరికొంత కాలానికి బ్రాహ్మణుడికి మరొక కొడుకు కలిగాడు. ఇతడికి నిత్యా నందుడు అని పేరుపెట్టారు. ఈ అన్నదమ్ములిద్దరూ పెరిగి పెద్దవాళ్ళవు తూండగా, తల్లిదండ్రులు హఠాత్తుగా కాల ధర్మం చెందారు.
దానితో జీవితం మీద విర క్తులై సత్యానందుడూ, నిత్యానందుడూ గంగా నదికి ఆవలి ఒడ్డున ఒకరూ, ఈవలి ఒడ్డున ఒకరూ కుటీరాలు నిర్మించుకుని సన్యాసి జీవితం గడపసాగారు. ఒక రోజున పాతాళలోకంలో వుండే సర్ప రాజు మణికాంతుడనేవాడు మనుష్యరూపం ధరించి, భూలోకానికి వచ్చి, గంగానది ఒడ్డునే నడిచిపోసాగాడు. అతడికి నిత్యానందుడి కుటీరం కంటబడింది.
మణికాంతుడు అంత చిన్నతనంలోనే సన్యాసి జీవితం గడుపు తున్న నిత్యానందుణ్ణి చూసి ఆశ్చర్యపడి, అతడికి తానెవరో చెప్పి, చాలా సేపు కబుర్లా డుతూ కాలంగడిపాడు. ఈ విధంగా నిత్యానందుడికీ, సర్పరాజు మణికాంతుడికీ స్నేహం కుదిరింది. ఆ నాటి నుంచీ మణికాంతుడు తరచుగా నిత్యా నందుడి కుటీరానికి వస్తూండేవాడు. వాళ్ళి ద్దరూ ఎన్నో ఆసక్తికరమైన లోక విషయూలను గురించి మాట్లాడుకునేవారు.
మణికాంతుడు అప్పుడప్పుడు తన యథారూపం ధరించి, నిత్యానందుడి తలపై పడగ విప్పి, చల్లని నీడపట్టి, తన లోకానికి వెళ్ళి పోతూండేవాడు. ఇలా కొంతకాలం జరిగాక నిత్యానందు డికి ఒక శంక పట్టుకున్నది. సర్ప రాజు మణికాంతుడు తనకు మిత్రుడన్నదాంట్లో సందేహం లేదు. కాని, స్వతహాగా సర్పాలది దుష్టస్వభావం. ఏ కారణం చేతనైనా మణి కాంతుడికి తన మీద కోపం వస్తే, కాటు వేయగలడు! ఇలాంటి ఆలోచనలతో నిత్యా నందుడికి ఎక్కడలేని బెంగపట్టుకున్నది.

ఈ స్థితిలో ఒకనాడు అతడు నది దాటి అన్న సత్యానందుణ్ణి చూడబోయూడు. సత్యానం దుడు తమ్ముణ్ణి చూసి వ్యాకులపడుతూ, ‘‘తమ్ముడూ, ఇంతగా చిక్కిపోయూవేం? కారణం ఏమిటి?'' అని ప్రశ్నించాడు. ఇందుకు నిత్యానందుడు ఏమీ దాచ కుండా అన్నకు చెప్పివేశాడు. ‘‘తమ్ముడూ, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తూంటే, ఆ సర్పరాజును నువ్వు ప్రాణ మిత్రుడుగా భావిస్తున్నట్టున్నది.
అయినా, మరొకవైపున అతణ్ణించి హాని జరుగుతుం దేమో అని భయపడుతున్నావు. ఇంతకూ అతడు నీవద్దకు రావడం ఇష్టమా లేక అతడు మరి కనబడకుండా వుంటే, నీకు సుఖంగా వుంటుందా?'' అని సత్యానందుడు అడిగాడు. నిత్యానందుడు కొంచెం ఆలోచించి, ‘‘అతడు రాకుండా వుంటేనే మనశ్శాంతి కలిగేలా వున్నది. కాని, అతణ్ణి రావద్దని చెప్పడం మాత్రం నావల్ల కాదు,'' అన్నాడు.
ఆ జవాబుకు సత్యానందుడు నవ్వి, ‘‘సరే, ఆ సర్పరాజు నీ వద్దకు వచ్చేటప్పుడు ఎలాంటి ఆభరణాలు ధరిస్తాడు?'' అని అడిగాడు. ‘‘అతడి శరీరం మీద ఆభరణా లకేం కొదవలేదు. కాని, అన్నిటికన్న గొప్పగా ధగధగ మెరిసే మణి ఒకటి అతడి కంఠం నుంచి వేళ్ళాడుతుంటుంది,'' అన్నాడు నిత్యానందుడు. ‘‘తమ్ముడూ, అలా అయితే ఒక పని చెయ్యి. ఈసారి ఆ సర్పరాజు నీ దగ్గిరకు వచ్చినప్పుడు, ఆ మణి ఇవ్వమని అడుగు,'' అని చెప్పాడు సత్యానందుడు.
రెండు, మూడు రోజుల తరవాత మణి కాంతుడు, నిత్యానందుడి కుటీరానికి వచ్చాడు. నిత్యానందుడు అతణ్ణి మణి ఇవ్వమని అడి గాడు. మణికాంతుడు కుటీరంలో కూర్చో కుండానే తన లోకానికి తిరిగిపోయూడు. మర్నాడు మణికాంతుడు రాగానే, నిత్యా నందుడు అతణ్ణి ద్వారం దగ్గిరే, ‘‘నిన్న నీ మెడలోని మణి ఇవ్వమని అడిగాను, ఇచ్చావు కాదు,'' అన్నాడు.
మణికాంతుడు కుటీ రంలో ప్రవేశించకుండా, ద్వారం దగ్గిర నుంచే వెనక్కు తిరిగి పోయూడు. మూడవరోజున మణికాంతుడు కుటీ రాన్ని సమీపిస్తూండగానే, నిత్యానందుడు అతడికి ఎదురుపోయి, ‘‘మణి ఇవ్వమని ఇంతవరకు రెండుసార్లు అడిగాను. ఇవ్వాళ యినా ఇస్తావా, లేదా?'' అని గద్దిస్తూ అడిగాడు.

సర్పరాజు మణికాంతుడు విచారంగా ముఖం పెట్టి, ‘‘నిత్యానందా, ఈ మణి సామాన్యమైనది కాదు. ఇది నేను ఏది కోరితే అదిచ్చే కామధేనువు, కల్పతరువు. ఇటు వంటి దాన్ని అడిగితే, ఎలా ఇవ్వగలను? అందువలన నేను ఇక ఏనాడూ నీ కుటీరం చాయలకు కూడా రాను,'' అంటూ వెనుదిరిగి, తన లోకానికి వెళ్ళిపోయూడు.
నిత్యానందుడు, మణికాంతుడు వస్తాడేమో అని ఒక వారం రోజులపాటు ఎదురుచూశాడు. అతడు రాలేదు. దానితో అతడికి ప్రాణ మిత్రుణ్ణి పోగొట్టుకున్నానే అన్న బెంగ పట్టు కుని, చిక్కి శల్యమై పోయూడు. ఈ స్థితిలో సత్యానందుడు, తమ్ముడు ఎలా వున్నాడో చూసి పోదామని అతడి కుటీ రానికి వచ్చాడు. తమ్ముడి దేహస్థితి చూసి సత్యానందుడు చాలా వ్యాకులం చెంది, ‘‘నీ ఆరోగ్యం మునుపటికన్నా చాలా పాడైపోయి నట్టున్నది.
నేను చెప్పినట్టు చేశావా? సర్పరాజు పీడయింకా విరగడ కాలేదా?'' అన్నాడు. ‘‘అన్నా, నువ్వు చెప్పినట్టే, ఆ సర్ప రాజును మణి ఇవ్వమని అడిగాను. ఆనాటి నుంచీ అతను ఇక్కడికి రావడం మానేశాడు. అతడు కుటీరానికి వచ్చి నాతో మాట్లాడుతూ, తన పడగవిప్పి నా తలపై ఆచ్ఛాదనగా పట్టడం నా కెంతో ఆనందకారణంగా వుండేది. ఇప్పుడు మనసు కలవరం చెందుతున్నది. ఇందు వల్లనే, నే నింతగా శుష్కించిపోయూను,'' అన్నాడు నిత్యానందుడు.
అప్పుడు అన్న అయిన బోధిసత్వుడు , ‘‘తమ్ముడూ, సర్ప రాజైన ఆ మణికాంతుడు నీ ప్రాణస్నేహితుడయినందుకు మురిసి పోయూవు. కాని, అంత ప్రాణస్నేహితుడూ నువ్వు మణి ఇవ్వమని అడిగేసరికి, నీ మొహం చూడడమే మానేశాడు. ఇదేనా ప్రాణ మిత్రుడైనవాడు ప్రవర్తించవలసిన తీరు? అతడు స్వార్థపరుడు, నిజమైన స్నేహితుడు కాదు.
అందువల్ల అతడు ఇక్కడికి రానం దుకు విచారించకు,'' అని హితబోధ చేశాడు. అన్న చెప్పిన మాటల్లోని సత్యాన్ని గ్రహిం చిన నిత్యానందుడు, ఆ తరవాత ఏనాడూ సర్పరాజును గురించి ఆలోచించనేలేదు. త్వర లోనే అతడికి విచారం పోయి, పూర్ణారోగ్య వంతుడయ్యూడు. 

No comments:

Post a Comment