Pages

Wednesday, September 19, 2012

మహాసాధ్వి


బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో, బోధిసత్వుడు నగరానికి సమీపాన వున్న ఒక గ్రామంలో, ఒక సంపన్న గృహస్థుడి కుమారుడుగా జన్మించాడు. అతడు చిన్నతనంలోనే సమస్త విద్యలూ నేర్చాడు. …ుుక్తవ…ుస్సు రాగానే అతని తల్లిదండ్రులు కాశీనగరంలో ఒక పెళ్ళి సంబంధం చూశారు. సుజాత అనే ఒక కన్యను తెచ్చి బోధిసత్వుడికి పెళ్లి చేశారు. సుజాత సౌందర్యవతి మాత్రమే కాక సుగుణ వతి, వివేకవతి.
అటు భర్తకూ, ఇటు అత్త మామలకూ కూడా పరిచర్యలు చేస్తూ, తలలో నాలుకగా మసలుకునేది. బోధిసత్వుడు కూడా ఆమె పైన ఎంతో అనురాగం చూపేవాడు. ఇలా ఆ ఇద్దరిదీ ఒక్క మాట, ఒక్క మనస్సు అయి, చూడ ముచ్చటగా వుండేవారు. అందరూ వారిని గురించి గొప్పగా చెప్పుకునేవారు. కొంత కాలం గడిచిన తరవాత ఒకనాడు, సుజాత తన భర్తతో, ‘‘నాకు మా అమ్మనూ, నాన్ననూ చూసి రావాలని వున్నది.
వాళ్లు వృద్ధు లైపో…ూరు. మీరు తోడు వస్తే, ఇద్దరం కలిసి వెళ్లి చూసి వద్దాం,'' అన్నది. ఇందుకు బోధిసత్వుడు చాలా సంతో షించి, ‘‘అలాగే తప్పకుండా వెళదాం. నాకూ అత్తమామల్ని చూడాలని చాలా కాలంగా కోర్కెవున్నది. ఇటీవల కొన్నాళ్ళుగా ఇంటిదగ్గిర తొందర పనుల కారణంగా వూరుకున్నాను. లేకపోతే నేనే ముందు బ…ులుదేరదామని చెప్పేవాణ్ణి,'' అన్నాడు.
మరుసటి రోజున ప్ర…ూణానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. అవసరమైన వస్తు వులన్నీ బండిలో సర్దుకుని బ…ులుదేరారు. సుజాత బండిలో కూర్చున్నది. బోధిసత్వుడు తొటె్టలో కూర్చుని బండి తోలుతున్నాడు. అలా కొంతసేపు ప్ర…ూణంచేసి వాళ్ళు, కాశీనగరం పొలిమేరలు చేరాక, ఒక చెట్టు కింద బండి విప్పి, అక్కడ వున్న కొలనులో కాళ్ళూ, చేతులూ కడుక్కుని, వెంట తెచ్చుకున్న ఆహారం భుజిం చారు. కొంచెంసేపు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్న తరవాత మళ్ళీ సంతోషంగా బండి పూన్చి, నగరంలోకి బ…ులుదేరారు.

సరిగ్గా బోధిసత్వుడి బండి నగరం ప్రవే శించే సమ…ూన, కాశీరాజు ఏనుగు అంబారీ ఎక్కి నగరంలో ఊరేగుతున్నాడు. ఆ ఉత్సవం చూడ వేడుక కలిగి, సుజాత భర్త అనుమతితో బండిదిగి, కాలినడకన ముందు నడవ సాగింది. బోధిసత్వుడు బండిలో వెనకగా వస్తున్నాడు. అంబారీ పైన వున్న కాశీరాజు, అతిరూప సౌందర్యవతి అయిన సుజాతను చూశాడు.
ఆమెను పెళ్ళాడాలన్న బుద్ధి పుట్టింది రాజుకు. ఆమెను గురించి భోగట్టా చే…ుగా, ఆమె ఫలానావారి అమ్మాయి అనీ, బండిలో కూర్చున్న వ్యక్తే ఆమె భర్త అనీ తెలి…ు వచ్చింది. రాజు ఒక దురాలోచన చేశాడు. సుజాత భర్తను ఏదోవిధంగా తుదముట్టించి, తరవాత ఆమెను తన రాణిగా చేసుకుందామను కున్నాడు. ఇందుకు అతడు తిరుగులేని ఒక వ్యూహం పన్నాడు.
తనకు విశ్వాసపాత్రుడైన ఒక భటుణ్ణి పిలిచి, రాజు అతడికి తన కిరీటం ఇచ్చి, ‘‘ఈ కిరీటాన్ని ఎవరూ చూడకుండా, ఆ కనపడే బండిలో పడవేసిరా,'' అని చెప్పాడు. భటుడు, రాజు చెప్పిన విధంగానే మరో కంటికి తెలి…ుకుండా కిరీటాన్ని బండిలో వేసి, ఆ సంగతి రాజుకు చెప్పాడు. ఒక పావు గంట కాలం గడిచేలోపలే, జనంలో, ‘‘రాజు గారి కిరీటాన్ని ఎవరో అపహరించారు!''
అన్న గగ్గోలు ప్రారంభమైంది. రాజు, తన భటులకు కిరీటం దొంగి లించినవాణ్ణి వెంటనే వెతికి పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. ఒక భటుడికి బోధిసత్వుడి బండిలో వున్న కిరీటం కనిపించింది. వాడు బోధిసత్వుణ్ణి దొంగ అంటూ లాక్కుపోయి రాజు ముందు నిలబెట్టాడు. రాజు ఉగ్రుడైపోయి, ‘‘వీడా, నా కిరీటాన్ని అపహరించినవాడు!
ఈ దుర్మార్గుణ్ణి తీసుకు పోయి శిరశ్ఛేదం చె…్యుండి,'' అని ఆజ్ఞా పించాడు. ఈ విధంగా తన వ్యూహం జ…ుప్రద మైందని రాజు సంతోషిస్తుండగా, భటులు బోధిసత్వుణ్ణి కొరడాలతో కొడుతూ, వీధు లన్నీ తిప్పి అవమానించారు. తరవాత, తల నరికేందుకు నగరం వెలుపలవున్న బలిపీఠం దగ్గిరకు తీసుకుపో…ూరు.

ఈ సంగతి తెలిసి సుజాత దుఃఖిస్తూ, భర్త వెనకగా బ…ులుదేరింది. ‘‘మీకు, ఈ కీడు తెచ్చిపెట్టినది, నేనే!'' అని విలపిస్తూ, ఆమె బలిపీఠం దగ్గిరకు చేరి, ఆవేదనతో, ‘‘అమా…ు కులను రక్షంచగల, దేవుడే లేడా? దుష్టుల దుండగాలు, ఇలా సాగవలసిందేనా?'' అని ఆక్రోశించ సాగింది. మహాసాధ్వి అయిన సుజాత ఇలా విలపించే సరికల్లా, స్వర్గ లోకంలో ఇంద్రుడి సింహాసనం వణకసాగింది.
‘‘కారణం ఏమిటి?'' అనుకుంటూ ఇంద్రుడు దివ్యదృష్టితో చూశాడు. జరగనున్న ఘోరం ఆ…ునకు తెలిసింది. ఇంద్రుడు ఒక విచిత్రపరిస్థితి కల్పిం చాడు. రాజు స్థానంలో బోధిసత్వుడూ; బోధి సత్వుడు వున్న చోట రాజూ వుండేటట్టు, తన మహిమవల్ల ఇద్దరి స్థానాలూ మార్చివేశాడు. ఏనుగు అంబారీలో వున్నవాడు రాజే అను కున్నారు, ప్రజలు.
కాని, అక్కడ వున్నది రాజ లాంఛనాలన్నీ ధరించి వున్న బోధిసత్వుడు. అలాగే తలారుల వశంలో బలిపీఠం మీద వున్న బోధిసత్వుడు, అతడి దుస్తులు ధరించి వున్న రాజు! ఈ రహస్యం ఎరగని తలారులు, తమ అధీనంలో వున్న మనిషిని, రాజాజ్ఞ ప్రకారం తల నరికారు. ప్రాణం పోగానే దుర్మార్గుడైన కాశీరాజుకు, అతడి నిజస్వరూపం వచ్చింది. అప్పుడు ఆ చంప బడినవాడు రాజు అని ప్రజలకందరికీ తెలిసిపోయింది.
వెంటనే గొప్ప కలకలం రేగింది. ఈ విచిత్ర సంఘట నకు కారకులెవరా అని వాళ్ళు ఆశ్చర్యపడ సాగారు. అప్పుడు ఇంద్రుడు బోధిసత్వుడికీ, ప్రజ లకూ కనిపించి, జరిగినదంతా చెప్పి, ‘‘ఈనాటి నుంచీ బోధిసత్వుడే మీ రాజు, సుజాత పట్టపురాణి!'' అని అంతర్థానమ…్యూడు. పాపం పండి, దుర్మార్గుడైన రాజు బలి పీఠానికి ఆహుతి అయినందుకు రాజ్యం లోని ప్రజలందరూ సంతోషించారు.
ఇంద్రుడు చెప్పినదాని ప్రకారం బోధిసత్వుణ్ణి రాజు గానూ, సుజాతను రాణిగానూ సంతోషంగా అంగీకరించారు. ఆనాటి నుంచీ కాశీరాజ్యంలో ధర్మం నాలు గుపాదాల నడిచింది. నెలకు మూడు వర్షాలు కురుస్తూ దేశం సుభిక్షంగా వుంటూ వచ్చింది.

No comments:

Post a Comment