Pages

Saturday, September 8, 2012

విదూషకుడి సమస్య


ఒకానొకప్పుడు విన…ుుడు అనే రాజు ఉండేవాడు. ఆ…ునకు చదరంగం అంటే మహా ఇష్టం. అయితే రాజుగనక, ఆ…ునతో సమ ఉజ్జీగా ఆడడానికి ఎవరూ ముందుకు వచ్చేవారుకారు. ఆస్థాన విదూషకుడు మాధవుడు మాత్రం రాజుదగ్గర ఉన్న చనువు కొద్దీ రాజుతో తరచూ చదరంగం ఆడేవాడు. సమ…ుం ఉన్నప్పుడల్లా ఇద్దరూ చదరంగం బల్ల దగ్గర కూర్చునేవారు. రాజు విలువైన మణులు, మాణిక్యాలు ఆటలో పందెం కాసేవాడు. మాధవుడు సాధారణ వస్తువులను పందెంగా పెటే్టవాడు. విదూషకుడు చదరంగం ఆడడంలో చాలా నేర్పరి. రాజు అతనితో ఆడుతూ, ఎన్నో మెళకువలను నేర్చుకునేవాడు. ఆటలోకి దిగారంటే రాజు, విదూషకుడు అనే తరతమ భావాలు మరిచిపోయి, సమ ఉజ్జీలుగా భావించి, ఆటలో లీనమై పోేువారు.
 
ఒకరోజు ఇద్దరూ ఆటలో నిమగ్నులై ఉన్నప్పుడు, అన్నను వెతుక్కుంటూ విదూషకుడి చెల్లెలు మోహిని సరాసరి రాజభవనంలోకి వచ్చింది. పేరుకు తగ్గటే్ట ఆమె చాలా సౌందర్యవతి. ఆమెను చూసి రాజు ముగ్థుడ…్యూడు. మరునాడు చదరంగం బల్ల ముందు ఆటకు కూర్చుంటూ, ‘‘మీ చెల్లెల్ని పందెం కాస్తావా? ఆటలో నేను గెలుపొందితే, ఆమెను నా రాణుల్లో ఒకతెగా చేసుకుంటాను,'' అన్నాడు రాజు విదూషకుడితో.
 
విదూషకుడు విస్మ…ుంతో తనకేసి చూడడం గమనించిన రాజు, ‘‘ఒకవేళ ఆటలో నువ్వు గెలుపొంది నేను ఓడిపోతే, ప్రవాళ నగరాన్ని నీకు ఇస్తాను,'' అన్నాడు.
 
విదూషకుడు కొంచెంసేపు మౌనంగా ఆలోచించి, ‘‘ప్రభూ, మనం కాచే పందాలు సమంగా లేవు. పైగా నాకు నగరం మీద మక్కువలేదు,'' అన్నాడు.
 
‘‘మరేం కావాలో కోరుకో,'' అన్నాడు రాజు.


‘‘తీరా చెప్పాక, ప్రభువులు ఆగ్రహించకూడదు,'' అన్నాడు విదూషకుడు విన…ుంగా. ‘‘కావలసినదాన్ని నిర్భ…ుంగా కోరుకో, ఇస్తాను,'' అన్నాడు రాజు.
 
‘‘తమరు తమ సోదరిని, మా చెల్లెలికి సమంగా పందెం కా…ూలి,'' అన్నాడు విదూషకుడు. రాజు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. ఆ తరవాత నెమ్మదిగా ఆలోచించాడు. అప్పటికే విదూషకుడి చెల్లెల్ని వివాహమాడాలన్న నిర్ణ…ూనికి వచ్చేశాడు గనక, ‘‘సరే, అలాగే,'' అని తల పంకించాడు రాజు.
 
ఆట ఆరంభమయింది. ఇద్దరూ ఏకాగ్రతతో ఆడసాగారు. విదూషకుడి వద్ద నేర్చుకున్న మెళకువలన్నిటినీ ఉపెూగించి, రాజు చాలా జాగ్రత్తగా పావులు కదపసాగాడు. విదూషకుడు ఇక ఓడి పోవడం తప్పదు అన్న పరిస్థితి ఏర్పడడంతో, రాజు మనసులో రకరకాల ఆలోచనలు కదలాడాయి.
 
తను మోహినిని వివాహ మాడే అద్భుత ఘడి…ులను తలుచుకుంటూ ఆటలో తప్పటడుగు వేశాడు. విదూషకుడు గెలిచాడు. రాజు ఓటమిని అంగీకరించాడు! విదూషకుడు పరమానందం చెందాడు. ‘‘ప్రభూ! తమ సోదరిని పంపండి. వివాహమాడతాను,'' అన్నాడు విన…ుంగా.
 
‘‘వివాహమాడతావా?'' అంటూ విస్మ…ుం చెందినరాజు, ‘‘నాకున్నది ఒక్కగానొక్క సోదరి. ఆమెకు అప్పుడే, నగరంలోని సంపన్న వర్తకుడితో వివాహ మయింది. నీకు మరేం కావాలన్నా కోరుకో, సంతోషంగా ఇస్తాను,'' అన్నాడు.
 
‘‘అది న్యా…ుం కాదు కదా ప్రభూ. తమరు ఆమెను పణంగా ఒడ్డారు కదా? ప్రభువులు మాట తప్పరని భావిస్తాను,'' అన్నాడు విదూషకుడు పట్టుదలతో.
 
రాజు విదూషకుడికి పట్టుబడిపోయినట్టు గ్రహించాడు. ‘‘సరే, రేపు నా సోదరి మా తల్లిని చూడడానికి ఇక్కడికి వస్తున్నది. ఆమెను నీ వెంట రమ్మంటే రాకపోవచ్చు. కాబట్టి ఆమెను నువ్వు వెంట బెట్టుకు వెళ్ళడానికి నీకు ఒక అవకాశం కల్పిస్తాను. ఆ ప్రకారం చె్ు,'' అంటూ ఏంచే…ూలో చెప్పాడు.
 
రాజుగారి చెల్లెలు సునీతాదేవి అనుకున్నట్టు తల్లిని చూడడానికి రాజభవనానికి వచ్చింది. మరునాడు సా…ుంకాలం రాజు నదీ తీరంలో వాహ్యాళికి వెళ్ళి వద్దామని ఆమెను ఆహ్వానించాడు. ముందు రాజూ, వెనక ఆ…ున చెల్లెలూ వెళుతూండగా, ఆమె దాపులనున్న ఒక తామర తటాకాన్ని చూసింది. 

తటాకం నిండుగా తామర పుష్పాలు వికసించి ఉన్నాయి. ‘‘ఆహా! ఎంత అందమైన దృశ్యం!'' అంటూ రాజు ముందుకు నడిచాడు.
 
సునీతాదేవి మనసులో తళుక్కున ఒక ఆలోచన తోచింది. ‘‘అన్న…్యూ, మీకు కొన్ని తామర పుష్పాలు కోసి ఇస్తాను,'' అంటూ తటాకం ఒడ్డుకుపోయి, ముందుకు వంగి ఒక పువ్వును కో…ుబోతూ కాలుజారి తటా కంలోకి పడిపోయింది. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం రాజు తిరిగి కూడా చూడకుండా ఏమీ ఎరగనట్టు వెళ్ళిపో…ూడు.
 
సునీతాదేవి చుట్టుపక్కల కల…ు జూసింది. అన్న కనిపించలేదు. తను కొలనులో పడిపోయిన సంగతి తెలి…ుక అన్న వెళ్ళిపోయి ఉంటాడని అనుకుని, ‘‘ఎవరైనా వచ్చి కాపాడండి. నీళ్ళల్లో మునిగి పోతున్నాను. కాపాడండి, కాపాడండి,'' అని కేకపెట్టింది. ఎప్పుడు పిలుస్తుందా అని దాపులనే, కాచుకుని ఉన్న విదూషకుడు ఒక్క గెంతున గుర్రంపై నుంచి కిందికి దూకి సునీతను సమీపించి చేయి అందించాడు. …ుువరాణి అతడి చేయిపట్టుకుని గట్టు మీదికి ఎక్కి వచ్చింది. ‘‘…ుువతీ రత్నమా, నా చేయి పట్టుకున్నావు గనక, ఇక నిన్ను వదిలి పెట్టను. నాతో వచ్చి, నన్ను వివాహమాడి, నాతోనే నా భార్యగా జీవించు,'' అన్నాడు విదూషకుడు ఉత్సాహంగా.
 
సునీతాదేవి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందింది. ‘‘నేను …ుువరాణి సునీతాదేవిని. నన్ను రక్షంచినందుకు సర్వదా కృతజ్ఞు రాలిని. అయినా, నేను వివాహితను. నిన్నెలా పెళ్ళాడగలను,'' అన్నది.
 
‘‘అవన్నీ తరవాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం నిన్ను ఇక్కడ ఒంటరిగా విడిచి వెళ్ళలేను. రా, మా ఇంటికి వెళదాం. గుర్రం మీదికి రా,'' అంటూ విదూషకుడు గుర్రం మీదికి ఎగిరి కూర్చున్నాడు.
 
సునీతాదేవి మరొక మార్గం కనిపించక మౌనంగా వెళ్ళి గుర్రాన్ని అధిరోహించి, విదూషకుడి వెనక కూర్చున్నది. గుర్రం నగరంలో ఒక మారుమూలనున్న చిన్న ఇంటి ముందు ఆగింది. గుర్రందిగి, ఇంట్లోకి అడుగు పెట్టాక, విదూషకుడు సునీతాదేవికి చదరంగం ద్వారా తాను ఆమెను రాజుగారి నుంచి ఎలా గెలుచుకున్నదీ తెలి…ుజేశాడు.

తనకు తెలి…ుకుండా, తన అనుమతి పొందకుండా, రాజు తనను చదరంగంలో పణంగా పెట్టాడని సునీతాదేవి గ్రహించింది. ఆ వేదన చెందింది. అయినా రాజుగారి గౌరవాన్ని కాపాడాలని, ‘‘సరే, నేను ఇక్కడే ఉంటాను. అయితే మన వివాహం మాత్రం వచ్చే పౌర్ణమికే,'' అన్నది.
 
విదూషకుడు అందుకు అంగీకరించాడు. సునీతాదేవి ఆక్షణం నుంచే అక్కడి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచించసాగింది. పౌర్ణమికి ఇంకా మూడు రోజులు ఉన్నా…ునగా, రహస్యంగా ఇంటినుంచి బ…ుటపడింది. పుట్టినింటికి కాకుండా తిన్నగా భర్త భవనానికి చేరుకున్నది. ఆమె భర్తకేమో ఇక్కడ జరిగిన సంగతులేవీ తెలి…ువు.
 
…ుువరాణి కనిపించక పోవడంతో, విదూషకుడు హడావుడిగా రాజు దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు. తన చెల్లెలు భర్త ఇంటికి వెళ్ళి వుంటుందనీ, ఆమెను మళ్ళీ ఇక్కడికి రప్పించడం సాధ్యంకాదనీ రాజు చెప్పాడు. కావాలంటే విదూషకుణ్ణే అక్కడికి వెళ్ళి, మొరపెట్టుకోమని సలహా ఇచ్చాడు.
 
విదూషకుడు …ుువరాణి అత్తవారింటికి వెళ్ళాడు. సంగతి తెలి…ుగానే సునీతాదేవి భర్త ఆగ్రహోదగ్రుడ…్యూడు. కేవలం చదరంగంలో తన భార్యను పణంగా పెట్టినందుకు రాజు మీదా, వివాహిత అని తెలిసీ ఆమెను పెళ్ళాడడానికి చూస్తూన్న విదూషకుడి మీదా మండిపడ్డాడు. ‘‘చదరంగంలో కాదు, చేవవుంటే ఇప్పుడు నాతో కత్తి …ుుద్ధం చేసి, జయించి, సునీతను తీసుకువెళ్ళు!'' అని విదూషకుడికి సవాలు విసిరాడు. విదూషకుడు అయిష్టంగానే అందుకు అంగీకరించాడు.
 
మరునాడే ఇద్దరూ కత్తి …ుుద్ధానికి సన్నద్ధుల…్యూరు. అయితే …ుుద్ధం అటే్ట సేవు జరగలేదు. …ుువరాణి భర్త కాలు మడతబడి కింద పడడంతో, అతని చేతిలోని కత్తి రెండుగా విరిగి, కొస అతని గుండెల్లోకి గుచ్చుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు!
 
భర్త మరణానికి సునీతాదేవి భోరున విలపించింది. ఆమె విషాదానికి అంతం లేకుండా పోయింది.

దుఃఖం ఉపశమించేంత వరకు ఏమీ మాట్లాడకూడదని విదూషకుడు మౌనంగా ఊరుకున్నాడు. ఆచారం ప్రకారం సునీతాదేవి భర్త చితి చుట్టూ ఏడు సార్లు ప్రదక్షణ చేసి చితికి నిప్పంటించింది. మంటలు వ్యాపించగానే, ఆమె పతి విెూగాన్ని భరించలేక మంటల్లోకి ఉరికి, భర్తతోపాటు సహగమనం చేసింది.
 
ఈ హఠాత్సంఘటన చూసి విదూషకుడు ఖిన్ను డ…్యూడు. ఆ తరవాత దుఃఖ భారంతో అక్కడ ఉండలేక రాజ్యం వదిలి పెట్టాడు. ఉన్న చోట ఉండలేక దేశదిమ్మరి అ…్యూడు. సునీతాదేవి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తనవల్లే ఆమెకీ దుర్గతి పట్టిందని పశ్చాత్తాపంతో దహించుకుపోసాగాడు. తన భర్తపట్ల ఆమె ప్రదర్శించిన విశ్వాసం తలుచుకున్నప్పుడల్లా ఆమెపట్ల అతనికి గౌరవం పెరగసాగింది.
 
సునీతాదేవి భర్తను తను చంపలేదు. ప్రమాద వశాత్తు అతను మరణించాడు. ద్వంద్వ …ుుద్ధంలో జయిస్తే, తన భార్యనే అప్ప చెబుతానన్న వీరుడికి అలాంటి దుర్గతి పట్టడం దారుణం అనిపించింది. ఇలాంటి రకరకాల ఆలోచనలతో విదూషకుడు వివిధ ప్రాంతాలు తిరిగాడు. ఆఖరిక ఒక పల్లెటూరు చేరాడు. అక్కడొక ఫకీరును చూశాడు. ఆ…ున మాటలు విదూషకుడికి ఊరట కలిగించాయి. విచారం నుంచి ఉపశమనం లభించింది. మాటల సందర్భంలో ఫకీరు విదూషకుడికి మరణించిన వారిని బతికించవచ్చని చెప్పాడు. మరణించిన సునీతాదేవినీ, ఆమె భర్తనూ బతికించుకునే అవకాశం ఉంటుందన్న ఆశతో, విదూషకుడు తన కథను ఫకీరుకు చెప్పుకున్నాడు. అంతా విన్న ఫకీరు కొంతసేపు మౌనంగా ఆలోచించి, ‘‘ఉత్తర దిశగా మూడు ెూజనాల దూరం వెళ్ళావంటే ఒక కొండ వస్తుంది. ఆ కొండల మధ్య ఒక గ్రామం వుంది. ఆ మారుమూల గ్రామంలోని కొందరికి చచ్చిన వారిని బతికించే మృతసంజీవనీ మంత్రం తెలుసునని విన్నాను. అక్కడికి వెళ్ళి వారికి సేవలు అందించి వారిని మెప్పిస్తే ఆ మంత్రం నీకు ఉపదేశించగలరు,'' అన్నాడు.
 
విదూషకుడు ఆ క్షణమే కొండలకేసి బ…ులుదేరి కొన్నాళ్ళకు అక్కడికి చేరుకున్నాడు. ఒక గ్రామంలోని ప్రజలు పక్షులను చంపి తినడం - ఆ తరవాత చచ్చిన పక్ష ఈకలనూ, చర్మాన్నీ ఒక చోట చేర్చి ఏదో మంత్రం చెప్పడం మరుక్షణమే చర్మానికీ, ఈకలకూ ప్రాణం వచ్చి పక్షులు ఎగిరి వెళ్ళడం విదూషకుడు చూశాడు.

ఫకీరు చెప్పిన గ్రామం ఇదే అని గ్రహించిన విదూషకుడు ఆ గ్రామంలోనే ఉంటూ, మంచిగా మాట్లాడుతూ వారి కార్యకలాపాలలో పాలుపంచుకోసాగాడు. ఆ గ్రామస్థులు పక్షులను చంపి తిని, ఆ తరవాత వాటికి ప్రాణం పో…ుడం విదూషకుడు మళ్ళీ ఒకసారి చూశాడు. అదెలా సాధ్యం అని వాళ్ళను ఆశ్చర్యంతో అడిగాడు.
 
గ్రామస్థులు అతన్ని ఒక వృద్ధురాలి దగ్గరికి తీసుకు వెళ్ళారు. విదూషకుడి తరపున గ్రామస్థుల వేడుకోలును ఆలకించిన వృద్ధురాలు అతనికి మృత సంజీవనీ విద్యను నేర్పడానికి అంగీకరించింది. ఆమె అతన్ని తన గుడిసెలోని చీకటి మూలకు తీసుకుపోయింది.అతను మంత్రాన్ని ఆరుసార్లు వల్లించేలా చేసింది. విదూషకుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చే…ుకుండా, తనరాజ్యానికి తిరుగు ప్ర…ూణమ…్యూడు. రాజధానికి చేరి …ుువరాణి సునీతాదేవి సహగమనం చేసిన స్థలానికి చేరాడు. అక్కడి భస్మరాసిపై నీళ్ళు చల్లి కళ్ళుమూసుకుని మూడుసార్లు మంత్రం జపించాడు. కళ్ళు తెరవగానే సునీతాదేవి ప్రాణాలతో లేచిరావడం చూశాడు.
 
విదూషకుడు మళ్ళీ కళ్ళు మూసుకుని మూడుసార్లు మంత్రం జపించగానే సునీతాదేవి భర్త కూడా సజీవుడై లేచాడు.
 
విదూషకుడు పరమానందం చెందాడు. సునీతాదేవిభర్త విదూషకుణ్ణి సమీపించి, ‘‘మాధవా, కత్తి …ుుద్ధంలో నువ్వు జయించావు. కాబట్టి సునీత మీద హక్కు నీకే ఉంది,'' అన్నాడు.
 
సునీత నోరువిప్పలేదు. మౌనం వహించింది. ఆమెను చేపట్టడమా? వద్దా? అన్న పెద్ద సమస్య విదూషకుడికి ఎదురయింది.
 
సరిగ్గా ఆ సమ…ూనికి అటుకేసి వచ్చిన ఫకీరు అతని సమస్యను గ్రహించి, ‘‘మాధవా, నువ్వు ఆమెకు ప్రాణం పోశావు. ప్రాణదాత తండ్రితో సమానం. తండ్రిగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు,'' అన్నాడు.
 
ఆ వెంటనే విదూషకుడు సునీతాదేవి చేతిని, ఆమె భర్త చేతిలో పెట్టి, ఒక్క మాట యినా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపో…ూడు. ఆ తరవాత రాజ్యంలో విదూషకుడి జాడ కనిపించలేదు.

No comments:

Post a Comment